అధికారి టేబుల్‌పై బాదం పప్పులు చల్లిన బాధితుడు!

Publish Date:Apr 20, 2026

Advertisement

 

ఛత్తీస్‌గఢ్‌లో వినూత్న నిరసన: ఫైల్ క్లియరెన్స్ కోసం అధికారిణికి 'బాదం' బహుమతి!

ఫైల్ గుర్తులేదన్న అధికారి.. బాదం పప్పులతో 'జ్ఞాపకశక్తి' పాఠం చెప్పిన బాధితుడు.

నెలల తరబడి తిరిగినా పట్టించుకోలేదని.. అధికారి టేబుల్‌పై బాదం పప్పులు చల్లి నిరసన..


ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పని జరగకపోయినా, అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పకపోయినా బాధితులు పడే వేదన వర్ణనాతీతం. ఇలాంటి ఓ విచిత్రమైన, అదే సమయంలో అందరినీ ఆలోచింపజేసే ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో వెలుగుచూసింది.

బిలాస్‌పూర్‌లోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఇంటికి సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ కోసం ఓ వ్యక్తి గత కొన్ని నెలలుగా ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు విన్నవించినా, అధికారుల నుంచి మాత్రం నామమాత్రపు సమాధానాలే తప్ప, పనిలో పురోగతి కనిపించలేదు.

సదరు బాధితుడు ఫైల్ గురించి అడిగిన ప్రతిసారీ, సంబంధిత అధికారిణి నుంచి "నాకు ఫైల్ గుర్తులేదు.. చూస్తాను" అనే సమాధానమే వచ్చేది. నెలల తరబడి ఇదే తంతు కొనసాగడంతో బాధితుడి సహనం నశించింది. తన పని ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అయోమయంలో ఉన్న ఆయన, అధికారులకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే బాధితుడు కార్యాలయానికి వెళ్ళి మరోసారి తన ఫైల్ గురించి ఆరా తీశాడు. అధికారిణి ఎప్పటిలాగే ఏమీ తెలియదన్నట్లుగా సమాధానం ఇచ్చింది. వెంటనే అతను తన వెంట తెచ్చుకున్న బాదం పప్పులను టేబుల్ మీద పారబోశాడు. "ఈ బాదం పప్పులు తినండి.. అప్పుడు మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది, నా ఫైల్ కూడా మీకు గుర్తుకొస్తుంది" అంటూ ఘాటుగా స్పందించి అక్కడి నుంచి నిష్క్రమించాడు.

ప్రభుత్వ వ్యవస్థలో నిర్లక్ష్యం ఎంతలా వేళ్లూనుకుపోయిందో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేకపోతే ఇలాంటి నిరసనలు తప్పవని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అధికారిణి టేబుల్‌పై బాదం పప్పులు చల్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే, ఈ వినూత్న నిరసనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, సదరు వ్యక్తి ఫైల్ క్లియర్ అవుతుందో లేదో చూడాలి. ప్రజాసేవలో ఉండాల్సిన వారు బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 

https://x.com/ChotaNewsApp/status/2045427648470642774

By
en-us Political News

  
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్‌లో తిలక్ వర్మ ప్రదర్శన చూస్తుంటే.. అతడొక సంపూర్ణ బ్యాటర్ అన్నవిషయం అదర్ధమౌతోందన్న ఆకాశ్ చోప్రా.. ముంబై ఇండియన్స్ కు తిలక్ వర్మ భవిష్యత్ కెప్టెన్ కాగల అన్ని అర్హతలూ ఉన్నబ్యాటర్ అని పేర్కొన్నాడు. తిలక్ వర్మ ఐపీఎల్ జట్టును నడిపించే రోజు ఎంతో దూరంలో లేదన్నాడు.
ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఇలా ఆకస్మికంగా తప్పుకోవడం ఇప్పుడు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల కొన్ని రోజులుగా సుదన్ గురుంగ్‌పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంతో పాటు, మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ భట్టా సంస్థల్లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు బయటపడటంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
పాకిస్థాన్ జెండా కలిగిన నౌకలకు మాత్రమే ఇరాన్ ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడంతో మధ్యవర్తిత్వం పేరుతో సొంత ప్రయోజనాల లావాదేవీలకు పాకిస్థాన్ ప్రాధాన్యత ఇస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ చర్యలు ఇరాన్-అమెరికా మధ్య దౌత్యపరమైన విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పాకిస్థాన్ తీసుకున్న కొన్ని దౌత్యపర చర్యలు ఇరాన్ కు అనుకూలమని కనిపించినా.. వాస్తవానికి ఇరాన్, అమెరికా మధ్య ఉన్న సున్నిత సమతౌల్యాన్ని అవి దారుణంగా దెబ్బతీశాయని అంటున్నారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై అనుమతి షరతులు, పాక్ నౌకలకే ప్రత్యేక అనుమతులు, అలాగే ఇస్లామాబాద్ లో ఇరాన్–అమెరికా చర్చలపై వస్తున్న వార్తలు.. ఇవన్నీ కలిసి పాకిస్థాన్ దౌత్యం నమ్మకం మీద ఆధారపడినదిగా కాకుండా, లావాదేవీల మీద ఆధారపడినదిగా మార్చేశాయి.
కోరుకొడ మండలం కాపవరం పరిధిలోని పాండవుల మెట్టపై పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాండవుల మెట్టపై పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారుల ప్రకటనతో ఒక్కసారిగా ఆప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు.
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ​సుప్రీంకోర్టు ఆదేశించినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై దళిత నాయకుల తీవ్ర ఆగ్రహం వ్ యక్తం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ​సాక్షులను బెదిరిస్తూ,డబ్బు ఆశ చూపి కేసును నీరుగార్చేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మౌలాలీలోని ఒక రసాయన యూనిట్‌లో అక్రమంగా మత్తు మందులు తయారవుతున్నాయన్నవిశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌సిబి అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో రెండు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో భారీగా మత్తు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు.
డబ్బులు ఇవ్వ కపోతే రేప్ కేసులు పెడతామని బెదిరిస్తూ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.ఈ ముఠా ఇప్పటికే పలువురిని ఇలా బెదరించి లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ.10 లక్షలు, ఓ జ్యోతిష్యుడి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. బెదిరింపు లకు తట్టుకోలేక బాధితులు డబ్బులు ఇచ్చినట్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు నమోదైన కేసులో తనను పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన విజ్ణప్తిని ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.
అమెరికా ఆంక్షలు అమలులోకి వచ్చిన గత కొద్ది రోజుల్లోనే కనీసం 34 ఇరాన్ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటినట్లు సమాచారం. వీటిలో 19 నౌకలు గల్ఫ్ నుంచి వెలుపలికి, మరో 15 లోపలికి ప్రవేశించాయి. ఈ రవాణా ద్వారా ఇరాన్ దాదాపు 10.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విదేశాలకు తరలించినట్లు అంచనా.
దీంతో ఆగ్రహానికి లోనైన మోహన్.. తన తల్లి చంద్రకళ , భార్య హరితను గొంతు నులిమి హత్య చేశాడు. వారిద్దరూ ప్రాణాలు విడిచాక, తన ఇద్దరు పిల్లలు కౌశిక్ , హరిణి ని తీసుకుని ఇంటి నుంచి వేపకుంట రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు.
160 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆరంభంలోనే రిషబ్ పంత్ డకౌట్ కాగా, మిచెల్ మార్ష్ (55) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో లక్నో 18 ఓవర్లలోనే 119 పరుగులకుఆలౌట్ అయింది.
నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ద్రమాండ్‌గంజ్ ఘాట్ రోడ్డు మీదుగా లసోడా వైపు వెళ్తున్న ఓ ట్రక్కుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ అదుపు కోల్పోయిన ఆ వాహనం ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి మధ్యలో ఉన్న ఒక ఆల్టో కారు నుజ్జునుజ్జు కాగా, ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని కూడా వాహనాన్ని ట్రక్కు బలంగా ఢీకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.