టీం ఇండియా బోణీ, చితగ్గొట్టిన కోహ్లీ

Publish Date:Mar 19, 2016

Advertisement

 

టి20 వరల్డ్ కప్ లో భారత్ బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్ధి పాక్ పై కష్టమైన పిచ్ మీద కూడా అద్భుతంగా రాణించాడు కోహ్లీ. తనను ఛేజింగ్ కింగ్ అని ఎందుకంటారో ప్రూవ్ చేసుకున్నాడు. తనకు అలవాటైన చివరి బాల్ సిక్స్ బదులు, లాస్ట్ బట్ వన్ బంతిని సిక్స్ కొట్టి ధోని లాంఛనాన్ని పూర్తి చేశాడు. నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో టీం ఇండియా నిలిచి గెలిచింది.18 ఓవర్లలో 119 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 6 వికెట్లతో గెలుపొందింది. విరాట్ పోరాటం అతని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచిపోతుంది. కష్టమైన పిచ్, పాకిస్థాన్ తో మ్యాచ్, పెవిలియన్ కు క్యూ కడుతున్న సహచరులు, ఇలాంటి సమయంలో టీం కు ఇరుసులా నిలిచి 37 బంతుల్లో 55 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు కోహ్లీ. ఒకానొక టైం లో, న్యూజిలాండ్ మ్యాచ్ రిపీట్ అవుతుందని భారత అభిమానులు భయపడినా, కోహ్లీ ఉన్నంత వరకూ ఏం కాదులే అన్న భరోసాతో ఉన్నారు. నిజంగానే కోహ్లీ తనకు అలవాటైన రీతిలోనే మళ్లీ ఇండియాను గెలిపించాడు.

18 ఓవర్ల ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ భారత అద్భుత బౌలింగ్ వల్ల 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ లో అహ్మద్ షెహజాద్ (25), షోయబ్ మాలిక్ (26), ఉమర్ అక్మల్ (22) రాణించారు. భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, జడేజా, రైనా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.

టీం ఇండియా ఇన్నింగ్స్ లో రోహిత్ (10, 11 బంతుల్లో) అనవసర షాట్ కు అవుటైతే, ధావన్ (6, 15 బంతుల్లో) పరుగులు చేయడానికి కష్టపడ్డాడు. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ ఎప్పటిలాగే, తన ఛేజింగ్ కింగ్ పేరును నిలబెట్టుకున్నాడు. అతని 55 పరుగుల ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. యువరాజ్(24, 23 బంతుల్లో) ఫామ్ లో ఉన్నట్టే కనిపించినా, త్వరగా గేమ్ ను ముగించే ప్రయత్నంలో అవుటయ్యాడు. చివర్లో వచ్చిన ధోనీ (13, 9 బంతుల్లో) నాటౌట్ గా నిలిచాడు.

ఓవరాల్ గా పాయింట్స్ పట్టికలో అకౌంట్ ఓపెన్ చేసిన టీం ఇండియా,రెండు మ్యాచ్ ల్లో, ఒక గెలుపు, 2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆడిన రెండు మ్యాచ్ లూ గెలిచిన న్యూజిలాండ్ టాప్ లో ఉండగా, రెండు మ్యాచ్ లాడి ఒకటే గెలిచి పాయింట్లలో ఇండియాతో సమానంగా ఉన్నా, మెరుగైన రన్ రేట్ కారణంగా రెండో స్థానంలో ఉంది పాకిస్థాన్. నాలుగు ఐదు స్థానాల్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ రెండు టీమ్ లు ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు.

By
en-us Political News

  
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.