Publish Date:Jan 16, 2026
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తోంది. ఏపీలో 16 ఎంపీలు టీడీపీకి ఉండగా, ఇద్దరు జనసేన, ముగ్గురు బీజేపీ, నలుగురు వైసీపీకి ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పెమ్మసాని, రామ్మోహన్ రూపంలో కేంద్రంలో మంత్రి పదవులుండగా.. బీజేపీ నుంచి శ్రీనివాసవర్మ కూడా కేబినేట్ లో సహాయ హోదాలో ఉన్నారు. అంటే ఏపీకి ముగ్గురికి అవకాశం లభించింది తొలి మంత్రి వర్గంలోనే వీరు స్థానం సంపాదించారు.
అయితే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరిగి ఏపీకి,, మరీ ముఖ్యంగా టీడీపీకి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ లభించేలా తెలుస్తోంది. మొన్న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అమిత్ షాతో భేటీలో ఈ విషయం ఆయన చెవిలో వేసి వచ్చారు. దీంతో ప్రతిపాదనలు పంపమని కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. దీంతో చంద్రబాబు టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కుల సమీకరణల్లో భాగంగా ఈ సారికి ఒక రెడ్డి సామాజికవర్గం పేరు ప్రతిపాదించినట్టు కనిపిస్తోంది.
గతంలో వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి టీడీపీలోకి రాగానే నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అంతే కాకుండా ప్రకాశం జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలోనూ వేమిరెడ్డి ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. దీంతో వేమిరెడ్డికి కేంద్ర మంత్రిత్వం కట్టబెడితే ఆయన ద్వారా రెండు జిల్లాలను కవర్ చేసినట్టుగా ఉంటుందని భావించిన టీడీపీ అధిష్టానం ఆయన పేరు కేంద్ర మంత్రిగా సిఫార్సు చేసినట్టు కనిపిస్తోంది.
ఇక జనసేనకుగానీ ఒక మంత్రి పదవే ఇస్తే.. బాలశౌరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో ఏపీకి రెండు కేంద్ర పదవులు ఇస్తారన్న మాట కూడా జోరుగాననే ప్రచారం సాగుతోంది. ఒక దశలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వేమిరెడ్డితో పాటు వినిపించినప్పటికీ.. వేమిరెడ్డికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. కారణం వేమిరెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా జిల్లాలో ప్రభావవంతమైన నాయకత్వం వహించడం.. వంటి అంశాలను పరిగణలోకి తీస్కున్న అధిష్టానం వేమిరెడ్డికే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mp-vemireddy-prabhakar-reddy-39-212596.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.