Publish Date:Jan 16, 2026
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తోంది. ఏపీలో 16 ఎంపీలు టీడీపీకి ఉండగా, ఇద్దరు జనసేన, ముగ్గురు బీజేపీ, నలుగురు వైసీపీకి ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పెమ్మసాని, రామ్మోహన్ రూపంలో కేంద్రంలో మంత్రి పదవులుండగా.. బీజేపీ నుంచి శ్రీనివాసవర్మ కూడా కేబినేట్ లో సహాయ హోదాలో ఉన్నారు. అంటే ఏపీకి ముగ్గురికి అవకాశం లభించింది తొలి మంత్రి వర్గంలోనే వీరు స్థానం సంపాదించారు.
అయితే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరిగి ఏపీకి,, మరీ ముఖ్యంగా టీడీపీకి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ లభించేలా తెలుస్తోంది. మొన్న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అమిత్ షాతో భేటీలో ఈ విషయం ఆయన చెవిలో వేసి వచ్చారు. దీంతో ప్రతిపాదనలు పంపమని కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. దీంతో చంద్రబాబు టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కుల సమీకరణల్లో భాగంగా ఈ సారికి ఒక రెడ్డి సామాజికవర్గం పేరు ప్రతిపాదించినట్టు కనిపిస్తోంది.
గతంలో వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి టీడీపీలోకి రాగానే నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అంతే కాకుండా ప్రకాశం జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలోనూ వేమిరెడ్డి ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. దీంతో వేమిరెడ్డికి కేంద్ర మంత్రిత్వం కట్టబెడితే ఆయన ద్వారా రెండు జిల్లాలను కవర్ చేసినట్టుగా ఉంటుందని భావించిన టీడీపీ అధిష్టానం ఆయన పేరు కేంద్ర మంత్రిగా సిఫార్సు చేసినట్టు కనిపిస్తోంది.
ఇక జనసేనకుగానీ ఒక మంత్రి పదవే ఇస్తే.. బాలశౌరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో ఏపీకి రెండు కేంద్ర పదవులు ఇస్తారన్న మాట కూడా జోరుగాననే ప్రచారం సాగుతోంది. ఒక దశలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వేమిరెడ్డితో పాటు వినిపించినప్పటికీ.. వేమిరెడ్డికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. కారణం వేమిరెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా జిల్లాలో ప్రభావవంతమైన నాయకత్వం వహించడం.. వంటి అంశాలను పరిగణలోకి తీస్కున్న అధిష్టానం వేమిరెడ్డికే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mp-vemireddy-prabhakar-reddy-39-212596.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.