తెలంగాణలో ఆత్మార్పణ కథ సుఖాంతం... ఎపిలో అఘోరీ అలజడి

Publish Date:Nov 5, 2024

Advertisement

అఘోరీ ఆత్మార్పణం కథ సుఖాంతం అయినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ అలజడి ప్రారంభమైంది. కేదార్ నాథ్ నుంచి తెలంగాణలో ఎంటర్ అయిన అఘోరీని గత నెల సిద్దిపేటలో పోలీసులు అదుపులోకి తీసుకుని అఘోరీస్వగృహమైన మంచిర్యాలకు తరలించారు. అక్కడ పోలీసులు కౌన్సిలింగ్ చేసి మహారాష్ట్ర సరిహద్దుల్లోని వాంకిడిలో వదిలేశారు.  సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఈ నెల ఒకటోతేదీన ఆత్మార్పణం చేసుకుంటానని అఘోరీ ప్రకటించడంతో తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయ్యారు. అఘోరీ గత కొన్ని రోజులుగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో శాంతి భధ్రతల సమస్య వస్తుందని పోలీసులు ఊహించారు. ఇందులో భాగంగా హైద్రాబాద్ లో 144 సెక్షన్ తీసుకువచ్చినట్టు సీనియర్ పోలీసు ఉన్నతాధికారి తెలుగు వన్ తో అన్నారు. కెటీఆర్ అరెస్ట్ వార్తలు రావడంతో 144 సెక్షన్ అనివార్యమైందని ఆయన అన్నారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబులు పేలతాయని మంత్రి శ్రీనివాసరెడ్డి సియోల్ పర్యటనలో ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కుంభకోణం దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో కెసీఆర్, హరీష్ రావులు అరెస్ట్ అవుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బిఆర్ఎస్ నేతల అరెస్ట్ వల్ల హైద్రాబాద్ లో అల్లర్లు చెలరేగే అవకాశముందని ఇంటెలిజెన్స్, ఎస్ బి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో అఘోరీ ప్రస్తావనకూడా వచ్చింది. తెలంగాణలో గత కొంతకాలంగా మతకలహాలు జరగడం లేదు. అఘోరీ విద్వేష ప్రసంగాలపై కూడా రేవంత్ సర్కార్ మిన్నకుండిపోయింది. మళ్లీ మతకలహాల ముప్పు పొంచి ఉందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. హైద్రాబాద్ లో కేవలం మత కలహాల సమయంలో మాత్రమే విధించే 144 సెక్షన్ రేవంత్ సర్కార్  హాయంలో విధించడం చర్చనీయాంశమైంది.  మరో వైపు ఈటెల నేతృత్వంలో బిజెపి నేతలు గవర్నర్ ను కల్సి  హైద్రాబాద్ లో శాంతి భధ్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని ఫిర్యాదు చేశారు. మతోన్మాదులు ముత్యాలమ్మ గుడిలోని అమ్మవారిని ధ్వంసం చేసినప్పటికీ పోలీసులు ఇంతవరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకపోవడం శోచనీయమన్నారు.  ముత్యాలమ్మ గుడి వద్ద ఆందోళన చేస్తున్న హిందుత్వ వాదులపై   పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని బిజెపి నేతలు తప్పు పట్టారు.  ఈ నేపథ్యంలో వివాదాస్పద అఘోరీ ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో  సుసైడ్ చేసుకుంటానని ప్రకటన చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  సడెన్ గా అఘోరీ కేదార్ నాథ్ లో ప్రత్యక్షం కావడంతో అఘోరీ పారిపోయినట్లు వదంతులు వచ్చాయి.  ఈ వదంతులను స్వయంగా అఘెరీ కొట్టివేశారు. తాను ముత్యాలమ్మ గుడి వద్ద ఆత్మార్పణం చేసుకుంటానని పెట్రోల్ బాటిళ్లతో సిద్దిపేటలో ప్రత్యక్ష కావడం పోలీసులకు చెమటలు పట్టాయి. అఘోరీపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. నగ్నంగా అఘోరీ తిరగడం, నెంబర్ ప్లేట్ లేకుండా అఘోరీ కారులో ప్రయాణించడాన్ని కూడా వారు తప్పు పట్టారు. అఘోరీకి మానసిక చికిత్స అవసరమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తనను తాను నియంత్రించుకోలేని అఘోరీ సనాతన ధర్మం పరిరక్షిస్తానని కొన్ని రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అని సనాతన ధర్మం చెబుతుంది. తనపై సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుందని అఘోరీ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని సంప్రదాయవాదులు తప్పు పడుతున్నారు. అఘోరీ జనారణ్యంలోకి రారని వారు అంటున్నారు. భారతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అఘోరీ రోడ్డుకెక్కడం చర్చనీయాంశమైంది.  యూట్యూబ్ చానెళ్లకు  అఘోరీ వందల ఇంటర్వ్యూలు ఇవ్వడం వెనక మతలబు ఏమిటని పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఆపరేషన్ అఘోరీ చేపట్టిన పోలీసులు    మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలేశారు.  ఇప్పుడు ఎపి పోలీసులకు కూడా అఘోరీ తలనొప్పిగా మారారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు టోల్ గేట్ సిబ్బంది అఘోరీని అడ్డుకోవడం వివాదాస్పదమైంది. తన శరీరాన్ని తాకే ప్రయత్నం జరిగిందని అఘోరీ అంటున్నారు. తెలంగాణ పోలీసులు అఘోరీని వదిలించుకున్నప్పటికీ ఆంధ్ర పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 

By
en-us Political News

  
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.