కొత్త రికార్డుల దిశగా పసిడి పయనం.. డీబేస్మెంట్ ట్రేడ్ ఎఫెక్ట్!

Publish Date:Apr 18, 2026

Advertisement

అంతర్జాతీయ ఆర్థిక రంగంలో ప్రస్తుతం  పసిడి ధరల పెరుగుదలపైనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా రికార్డు స్థాయిలో పెరుగుతున్న బంగారం ధరలు భవిష్యత్తులో ఊహించని రీతిలో భారీ గరిష్టాలను చేరుకోనున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం వెల్స్ ఫార్గో  తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం..  2027   నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర ఏకంగా 8,000 డాలర్ల మార్కును తాకుతుంది. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న  డీబేస్‌మెంట్ ట్రేడ్  ధోరణే ఇందుకు ప్రధాన కారణమని ప్రముఖ ఆర్థిక నిపుణుడు ఓహ్ సంగ్ క్వాన్  అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న విధానాలు, కరెన్సీల విలువ పడిపోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను పసిడి వైపు  మొగ్గు చూపేలా చేస్తున్నాయి. సాధారణంగా డీబేస్‌మెంట్ ట్రేడ్ అంటే.. పేపర్ కరెన్సీ (ఫియట్ కరెన్సీ) పై నమ్మకం తగ్గినప్పుడు.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వంటి స్థిరమైన విలువ కలిగిన  అసెట్స్‌లోకి మార్చుకుంటారు. 

అభివృద్ధి చెందిన దేశాలలో విపరీతంగా పెరిగిపోతున్న అప్పులు, నోట్ల ముద్రణ కారణంగా డాలర్, యూరో వంటి కరెన్సీల వాస్తవ విలువ అంతకంతకూ  క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో సంపదను కాపాడుకోవడానికి పసిడిని మించిన సురక్షిత మార్గం మరొకటి లేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.వెల్స్ ఫార్గో విశ్లేషణ ప్రకారం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం నాలుగో  కరెన్సీ డీబేస్‌మెంట్ సైకిల్ లో ఉంది. ఈ సైకిల్ 2022లో ప్రారంభమైంది. సాధారణంగా ఇలాంటి సైకిల్స్ సగటున ఎనిమిదిన్న సంవత్సరాల పాటు కొనసాగుతాయి. కాగా  ప్రస్తుతం ఈ కాలవ్యవధిలో కేవలం మూడున్నరేళ్లు  పూర్తి అయ్యింది.  అంటే రాబోయే ఐదు సంవత్సరాలలో పసిడి ధరల ర్యాలీ కొనసాగుతుంది. గతంలో గ్రేట్ డిప్రెషన్ సమయంలో,  1971లో డాలర్ నుంచి గోల్డ్ స్టాండర్డ్ తొలగించినప్పుడు కూడా ఇలాంటి భారీ ధరల పెరుగుదల కనిపించిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పసిడి దూకుడుకు కేవలం కరెన్సీ విలువ తగ్గడమే కాకుండా..  పెరుగుతున్న జియోపాలిటికల్ ఉద్రిక్తతలు కూడా తోడవుతున్నాయి. 

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, అలాగే , మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు, అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రిస్క్‌ను పెంచుతున్నాయి. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను  సేఫ్ హెవెన్ గా భావించే బంగారం వైపు మళ్లిస్తున్నారు.  అలాగే..  ప్రపంచవ్యాప్తంగా   వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వలను తగ్గించుకుంటూ..  భారీ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. ప్రముఖ పెట్టుబడిదారుడు రే డాలియో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  పేపర్ కరెన్సీల కొనుగోలు శక్తి పడిపోవడమే పసిడి ర్యాలీకి  అసలైన ఇంధనమని  పేర్కొన్నారు. 

2025లో బంగారం సుమారు 65 శాతం రాబడిని అందించి, స్టాక్ మార్కెట్  కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వాల ఆర్థిక లోటులు పెరగడం..  ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అస్థిరమైన వడ్డీ రేట్ల కారణంగా బంగారం ధరలు నిలకడగా పెరుగుతూనే ఉండే అవకాశాలు ఉన్నాయి.అయితే..  ప్రతికూల పరిస్థితులు ఎదురైతే తప్ప పసిడి ధరలు తగ్గే సూచనలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ద్రవ్యోల్బణం అనూహ్యంగా తగ్గిపోయి, వడ్డీ రేట్లు పెరిగినట్లయితే పసిడి ధర కొంత మేర దిగివచ్చే అవకాశం ఉంది.    

కానీ ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులను బట్టి చూస్తే..  ఈ నెగటివ్ సెంటిమెంట్ వచ్చే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో గోల్డ్ మైనింగ్ కంపెనీల షేర్లు  గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడులు పెట్టే వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందని వెల్స్ ఫార్గో నివేదిక చెబుతోంది. మొత్తంగా చూస్తే..  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక భారీ మార్పు దశలో ప్రయాణిస్తోంది. డాలర్ ఆధిపత్యంపై పెరుగుతున్న ప్రశ్నలు,  పేపర్  కరెన్సీలపై తగ్గుతున్న నమ్మకం కారణంగా బంగారం   ప్రాధాన్యతను పెరిగిపోతోంది. అందుకే దీర్ఘకాలికంగా సంపదను భద్రపరుచుకోవాలనుకునే వారికి పసిడి మాత్రమే సేఫ్ అనే పరిస్థితులు ఉన్నాయనడంలో ఇసుమంతైనా  సందేహం లేదు.

-సీతారాం కంఠమనేని

By
en-us Political News

  
పాకిస్థాన్ జెండా కలిగిన నౌకలకు మాత్రమే ఇరాన్ ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడంతో మధ్యవర్తిత్వం పేరుతో సొంత ప్రయోజనాల లావాదేవీలకు పాకిస్థాన్ ప్రాధాన్యత ఇస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ చర్యలు ఇరాన్-అమెరికా మధ్య దౌత్యపరమైన విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పాకిస్థాన్ తీసుకున్న కొన్ని దౌత్యపర చర్యలు ఇరాన్ కు అనుకూలమని కనిపించినా.. వాస్తవానికి ఇరాన్, అమెరికా మధ్య ఉన్న సున్నిత సమతౌల్యాన్ని అవి దారుణంగా దెబ్బతీశాయని అంటున్నారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై అనుమతి షరతులు, పాక్ నౌకలకే ప్రత్యేక అనుమతులు, అలాగే ఇస్లామాబాద్ లో ఇరాన్–అమెరికా చర్చలపై వస్తున్న వార్తలు.. ఇవన్నీ కలిసి పాకిస్థాన్ దౌత్యం నమ్మకం మీద ఆధారపడినదిగా కాకుండా, లావాదేవీల మీద ఆధారపడినదిగా మార్చేశాయి.
కోరుకొడ మండలం కాపవరం పరిధిలోని పాండవుల మెట్టపై పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాండవుల మెట్టపై పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారుల ప్రకటనతో ఒక్కసారిగా ఆప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు.
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ​సుప్రీంకోర్టు ఆదేశించినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై దళిత నాయకుల తీవ్ర ఆగ్రహం వ్ యక్తం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ​సాక్షులను బెదిరిస్తూ,డబ్బు ఆశ చూపి కేసును నీరుగార్చేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మౌలాలీలోని ఒక రసాయన యూనిట్‌లో అక్రమంగా మత్తు మందులు తయారవుతున్నాయన్నవిశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌సిబి అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో రెండు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో భారీగా మత్తు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు.
డబ్బులు ఇవ్వ కపోతే రేప్ కేసులు పెడతామని బెదిరిస్తూ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.ఈ ముఠా ఇప్పటికే పలువురిని ఇలా బెదరించి లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ.10 లక్షలు, ఓ జ్యోతిష్యుడి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. బెదిరింపు లకు తట్టుకోలేక బాధితులు డబ్బులు ఇచ్చినట్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు నమోదైన కేసులో తనను పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన విజ్ణప్తిని ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.
అమెరికా ఆంక్షలు అమలులోకి వచ్చిన గత కొద్ది రోజుల్లోనే కనీసం 34 ఇరాన్ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటినట్లు సమాచారం. వీటిలో 19 నౌకలు గల్ఫ్ నుంచి వెలుపలికి, మరో 15 లోపలికి ప్రవేశించాయి. ఈ రవాణా ద్వారా ఇరాన్ దాదాపు 10.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విదేశాలకు తరలించినట్లు అంచనా.
దీంతో ఆగ్రహానికి లోనైన మోహన్.. తన తల్లి చంద్రకళ , భార్య హరితను గొంతు నులిమి హత్య చేశాడు. వారిద్దరూ ప్రాణాలు విడిచాక, తన ఇద్దరు పిల్లలు కౌశిక్ , హరిణి ని తీసుకుని ఇంటి నుంచి వేపకుంట రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు.
160 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆరంభంలోనే రిషబ్ పంత్ డకౌట్ కాగా, మిచెల్ మార్ష్ (55) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో లక్నో 18 ఓవర్లలోనే 119 పరుగులకుఆలౌట్ అయింది.
నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ద్రమాండ్‌గంజ్ ఘాట్ రోడ్డు మీదుగా లసోడా వైపు వెళ్తున్న ఓ ట్రక్కుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ అదుపు కోల్పోయిన ఆ వాహనం ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి మధ్యలో ఉన్న ఒక ఆల్టో కారు నుజ్జునుజ్జు కాగా, ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని కూడా వాహనాన్ని ట్రక్కు బలంగా ఢీకొంది.
అసెంబ్లీ ఎన్నికల సమరం.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఈవీఎంలు, భద్రత కట్టుదిట్టం
రెంటు కట్టని వైనం.. కోహ్లీ వన్8 కమ్యూన్‌కు తాళాలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.