మధ్యవర్తిత్వం ముసుగులో పాకిస్థాన్ ద్వంద్వ నీతి!

Publish Date:Apr 23, 2026

Advertisement

ఇస్లామాబాద్  మధ్యవర్తిత్వం.. ఇరాన్, అమెరికా సమీకరణాలను సంక్షిష్టం చేశాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో హెర్మూజ్ జలసంధి తెరుచుకునే దారులు ఉన్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ఎగసిపడుతున్న వేళ, పాకిస్థాన్ చర్యలు ఇరాన్, అమెరికా  మధ్య పరస్పర విశ్వాసాన్ని మరింత   బలహీనపరిచాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాక్ తీరును డబుల్ క్రాస్ గా అభివర్ణిస్తున్నారు.  ఇస్లామాబాద్ ఒకవైపు మధ్యవర్తిత్వం మాటలు చెబుతూనే..  ఇరు దేశాల మధ్యా అగాధాన్ని మరింత పెద్దది చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  హోర్ముజ్  కేవలం ప్రాంతీయ సమస్య కాదు.. ఆ జలసంధి మూసుకుపోవడం అంటే..  ప్రపంచ ఇంధన వ్యవస్థకు నేరుగా షాక్ తగలడమే. 

ఈ పరిస్థితుల్లో అన్ని వైపుల నుంచీ పాకిస్థాన్ పై తీవ్ర ఆరోపణలు వినవస్తున్నాయి.  పాకిస్థాన్ తీసుకున్న కొన్ని దౌత్యపర చర్యలు ఇరాన్ కు అనుకూలమని కనిపించినా..  వాస్తవానికి ఇరాన్, అమెరికా మధ్య ఉన్న సున్నిత సమతౌల్యాన్ని అవి దారుణంగా దెబ్బతీశాయని అంటున్నారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై అనుమతి షరతులు, పాక్ నౌకలకే ప్రత్యేక అనుమతులు, అలాగే ఇస్లామాబాద్ లో ఇరాన్–అమెరికా చర్చలపై వస్తున్న వార్తలు.. ఇవన్నీ కలిసి పాకిస్థాన్  దౌత్యం నమ్మకం మీద ఆధారపడినదిగా కాకుండా, లావాదేవీల మీద ఆధారపడినదిగా మార్చేశాయి. ఇది కేవలం ఒక దేశం తీసుకున్న వాణిజ్య లేదా భద్రతా నిర్ణయం కాదు. ఇది ప్రాంతీయ విశ్వాసాన్ని, మధ్యవర్తిత్వం పేరుతో పని చేసే దేశాల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి.  

హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో అత్యంత కీలక మార్గాల్లో ఒకటి. ఇరాన్ దాన్ని పూర్తిగా మూసివేయలేదని చెబుతున్నప్పటికీ, ముందస్తు అనుమతి లేకుండా ప్రయాణాన్ని నిరోధించడం, నౌకలను వెనక్కి పంపించడం వంటి చర్యలు గ్లోబల్ మార్కెట్లను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పాక్ జెండా నౌకలకు మాత్రమే ఇచ్చిన ప్రత్యేక అనుమతులు కూడా ఈ మార్గం ఎంత రాజకీయంగా మారిందో చూపిస్తున్నాయి. అమెరికా లేదా ఇరాన్ దేశాలలో ఏది  తప్పు లెక్క వేసినా.. దాని ప్రభావం కేవలం మధ్య ప్రాచ్యానికే  పరిమితం కాదు.. మొత్తంగా చమురు  ధరలు, బీమా ఖర్చులు,  రవాణా చైన్, ఆసియా దిగుమతిదారుల ఒత్తిడి పెంచుతుంది. ఇవన్నీ ప్రపంచదేశాలన్నిటిపైనా ప్రభావం చూపుతాయి.  

ఈ సంక్షోభంలో అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ వైఖరి కీలకంగా కనిపిస్తోంది.  కఠిన హెచ్చరికలు, నావికా ఆంక్షలు, నరకం చూపిస్తా  తరహా భాషాప్రయోగం ఇవన్నీ.. కానీ  ఉద్రిక్తతలు పెంచేవిగానే ఉన్నాయి. అదే సమయంలో  యుద్ధాన్ని మరింత ముదరకుండా ఒక నిష్క్రమణ మార్గాన్ని కూడా అట్టేపెట్టుకోవడం కూడా కనిపిస్తోంది.

అయితే ఇక్కడే..  అమెరికా నిజంగా ఇరాన్ ను ఒప్పందం వైపు నడిపించాలనుకుంటోందా..  లేక ఒత్తిడి పెంచి తన డిమాండ్లను రుద్దాలనుకుంటోందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ కు దూకుడు కొత్తకాదు. పరుషంగా మాట్లాడడమూ అలవాటే..  పశ్చిమాసియా విషయంలో అతి చిన్న తప్పు కూడా బహుళ దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టేయగలదు.  

 చర్చలు ఆగిపోయే చోట యుద్ధం మొదలవుతుంది..  యుద్ధం మొదలయ్యే చోట హోర్ముజ్ కూడా మూసుకుపోవచ్చు. అంటే ప్రస్తుతం..  ఇరాన్, అమెరికా సంబంధాలు ఒక  ప్రతిష్ఠంభణలో ఉన్నాయి.  అణు కార్యక్రమంపై  రెడ్ లైన్ లు, కాల్పుల విరమణపై కాలపరిమితులు, భద్రతా హామీలపై పరస్పర అనుమానాలు.. ఇవి చర్చలకు అవరోధంగా మారాయి.  ఏ పక్షం  చిన్న తప్పు చేసినా, దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని వ్యూహాత్మక ఆస్తిగా చూస్తోంది.  అమెరికా దాన్ని వ్యూహాత్మక ముప్పుగా భావిస్తోంది. ఈ రెండింటి మధ్యా రాజీ కుదరకపోతే..  హోర్ముజ్పై నిర్ణయం కూడా దౌత్యం ద్వారా కాకుండా సంక్షోభం ద్వారా తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.  
దౌత్యం ఇంకా ముగిసిపోలేదు. కానీ దానికి మూడు విషయాలు అవసరం. ఒకటి.. విశ్వసనీయ మధ్యవర్తులు, రెండు.. స్పష్టమైన భద్రతా హామీలు,మూడోది.. ఫేస్ సేవింగ్ కు ఒక మార్గం. ఈ మూడూ లేకపోతే..   పరిష్కారం కనుచూపు మేరలో కూడా కనిపించదు. 

పాకిస్థాన్ ఈ చర్చల్లో నిజమైన మధ్యవర్తిగా నిలవాలంటే..  ఆ మధ్యవర్తిత్వం స్వప్రయోజనాల  లావాదేవీలా కనిపించకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే, ఇస్లామాబాద్   చర్చలతో కాకుండా.. సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేసిన వేదికగా మిగిలిపోతుంది. 

హోర్ముజ్ మూసుకుపోతే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ఇప్పటికే మార్కెట్లు అర్థం చేసుకుంటున్నాయి. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, కరెన్సీ ఒత్తిడి చాలా చాలా త్వరగా  పెరిగిపోతాయి. తీవ్రమౌతాయి. ఇలాంటి సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం.. అది వాషింగ్టన్లో అయినా, టెహ్రాన్లో అయినా..  ఇస్లామాబాద్ లో  అయినా..  గ్లోబల్ సెక్యూరిటీపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మొత్తం మీద ఈ సంక్షోభం ఒకే ప్రశ్న చుట్టూ తిరుగుతోంది.  పెద్ద యుద్ధాన్ని ఆపే దౌత్యం ముందుకు వస్తుందా, లేక పశ్చిమాసియా మరో పెద్ద సంక్షోభం వైపు వెడుతుందా?

References:

https://www.andhrajyothy.com/2026/international/uae/iran-stops-pakistanbound-ship-at-hormuz-over-lack-of-permission-sgr-spl-1507249.html 
https://ntvtelugu.com/news/iran-vs-israel-how-the-two-countries-went-from-friends-to-foes-686714.html 
https://www.instagram.com/ganeshwgl/ 
https://www.ntnews.com/news/iran-let-20-more-pakistani-flagged-ships-through-hormuz-strait-says-pakistans-dar-2343514 
https://www.facebook.com/groups/ssvmkadiri/ 

సంకలనం, సేకరణ: సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.