Publish Date:Apr 18, 2026
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17 ఒక చీకటి రోజుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు ప్రతిరూపమైన మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా విపక్షాలు దేశంలోని ప్రతి తల్లిక, అక్కాచెల్లెళ్ల ను అవమానించాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. మహిళా హక్కుల విషయంలో విపక్షాల అసలు రంగు బయటపడిందన్నారు.
మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ త కూట మి విషాన్ని కక్కిందన్న బండి సంజయ్.. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగకూడదన్నదే ఆ పార్టీల అసలు ఉద్దేశమని ఆరోపించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయ స్వార్థం కోసం మహిళా హక్కులను కబళించడం క్షమించరాని పాపమనీ విమర్శించారు. దేశ మహిళలను ఓడించినందుకు ఈ కూటమి నేతలు సంబరాలు చేసుకుంటారా? అని నిలదీశారు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు త్వరలో ప్రజలే ఇండియా కూటమికి బుద్ధి చెబుతారన్నారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ముమ్మాటికీ మహిళా ద్రోహులన్న బండి సంజయ్.. . అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని ఈ పార్టీలు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహిళా వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందన్న ఆయన.. గతంలో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని కాలయాపన చేస్తూ వంచించారని, ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఛీ కొడుతున్నా ఇండియా కూటమి నేతలకు జ్ఞానోదయం కలగడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మహిళల పట్ల ఇదే విధమైన వివక్షను ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు.
మహిళా శక్తి అంటే ఏమిటో చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్న బండి సంజయ్.. రాబోయే ఎన్నికల్లో.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు మహిళలు మహిళా రిజర్వేషన్ ను వ్యతిరేకించిన పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందనీ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా రిజర్వేషన్ల సాధన దిశగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dark-day-in-the-history-of-indian-democracy-36-217651.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్తో కలిసి బైక్పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.