Publish Date:Apr 18, 2026
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17 ఒక చీకటి రోజుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు ప్రతిరూపమైన మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా విపక్షాలు దేశంలోని ప్రతి తల్లిక, అక్కాచెల్లెళ్ల ను అవమానించాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. మహిళా హక్కుల విషయంలో విపక్షాల అసలు రంగు బయటపడిందన్నారు.
మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ త కూట మి విషాన్ని కక్కిందన్న బండి సంజయ్.. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగకూడదన్నదే ఆ పార్టీల అసలు ఉద్దేశమని ఆరోపించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయ స్వార్థం కోసం మహిళా హక్కులను కబళించడం క్షమించరాని పాపమనీ విమర్శించారు. దేశ మహిళలను ఓడించినందుకు ఈ కూటమి నేతలు సంబరాలు చేసుకుంటారా? అని నిలదీశారు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు త్వరలో ప్రజలే ఇండియా కూటమికి బుద్ధి చెబుతారన్నారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ముమ్మాటికీ మహిళా ద్రోహులన్న బండి సంజయ్.. . అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని ఈ పార్టీలు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహిళా వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందన్న ఆయన.. గతంలో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని కాలయాపన చేస్తూ వంచించారని, ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఛీ కొడుతున్నా ఇండియా కూటమి నేతలకు జ్ఞానోదయం కలగడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మహిళల పట్ల ఇదే విధమైన వివక్షను ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు.
మహిళా శక్తి అంటే ఏమిటో చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్న బండి సంజయ్.. రాబోయే ఎన్నికల్లో.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు మహిళలు మహిళా రిజర్వేషన్ ను వ్యతిరేకించిన పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందనీ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా రిజర్వేషన్ల సాధన దిశగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dark-day-in-the-history-of-indian-democracy-36-217651.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.