చూడు.. చూడు.. రాజధానిలో రోడ్ల తడాఖా!
Publish Date:Sep 8, 2012
Advertisement
సంపూర్ణ ఆరోగ్యవంతులకు సవాల్! ఇదేమిటి అనుకుంటున్నారా! నాకు ఇప్పటివరకు వళ్ళునొప్పులంటే ఎరుగను...అని ఎవరైనా సవాల్ చేస్తే.. వెంటనే మన రహదారులపై ప్రయాణించమనండి... భవిష్యత్లో మళ్ళీ అటువంటి సవాల్ చెయ్యరు... ఇదీ మన రహదారుల తడాఖా!
రాష్ట్రంలో రహదారుల వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు వాటి ఆనవాళ్ళు కోల్పోతున్నాయి. సాధారణంగా జాతీయ, రాష్ట్ర రహదారులు మరమ్మతులు చేయాలన్నా, కొత్త రోడ్లు వేయాలన్నా వర్షాకాలం రాకముందే పని చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్ అండ్ బి మాత్రం అందుకు విరుద్ధంగా వర్షాకాలం మొదలైన తర్వాత కొన్ని జిల్లాల్లో మరమ్తతులు, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టింది. రాజధానిలో రోడ్ల పరిస్థితి గురించి ఆయా అధికారులను కదిలిస్తే జీవవైవిధ్య సదస్సు జరిగే సమయానికి కొత్త రోడ్లు వేయాల్సి ఉందని, అందుకే ఇప్పుడు వేయటం లేదని సమాధాన మిస్తున్నారట. కనీసం రోడ్లకు మరమ్మతులైనా చేస్తే పరిస్థితి కొంతవరకైనా మెరుగుపడే అవకాశం ఉంటుంది. గుంతలు పడిన రోడ్లపై ప్రయాణిస్తున్నవారిలో కొందరికి నడుం నొప్పి వస్తుంటే, ఇంకొందరు వెన్నెముకలోని డిస్క్లు దెబ్బతింటున్నాయి. 25`30 సంవత్సరాల మధ్య వయసు వారు ఎక్కువగా నడుంనొప్పితో తన దగ్గరికి వస్తున్నారంటూ ఓ ఆర్థోపెడిక్ వైద్యుడు తెలిపారంటే రహదారుల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ప్రతీదీ వ్యాపారం అయిపోయింది. రోడ్లేయడంకూడా వ్యాపారమే. వర్షాకాలంలో రోడ్లేస్తారు, సీజన్ పూర్తయ్యేసరికి ఆ రోడ్లు కనిపించకుండా పోతాయ్. మళ్ళీ టెండర్లు గట్రా మామూలే.. మళ్ళీ వర్షాకాలంలోనే కొత్త రోడ్లొస్తాయ్. బ్రిటీషోళ్లేసిన వందల యేళ్ళనాటి వంతెనలు నేటికి చెక్కుచెదరకుండా ఉంటే కొత్తగా కట్టిన వంతెనలు మాత్రం కుప్పకూలుతున్నాయ్. మన రోడ్లమీద గర్బిణీ ఆసుపత్రికి బయలుదేరితే.. దారిలోనే ప్రసవమైపోతుంది. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే నేతలు కనిపించినట్టు, వర్షాకాలంలోనే వర్షాకాలంలో మాత్రమే రోడ్లేసేవాళ్లు కనిపిస్తారు. ఆ తర్వాత పరిస్థితి మళ్ళీ మామూలే! ప్రభువులు అలాగే ఉంటారు. ప్రజలు ఇలాగే బాధలు పడుతుంటారు. రోడ్లు కనిపించినంత కాలం కనిపించి మాయమైపోతుంటాయ్.
http://www.teluguone.com/news/content/hyderabad-raods-24-17220.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





