మనిషి మనిషిలా బతికేదెన్నాళ్లు

Publish Date:May 18, 2019

Advertisement

 

అనగనగా భగవంతుడు సృష్టిని చేస్తున్నాడు. ముందరగా ఆయన ఓ కుక్కను సృష్టించాడు. ‘చూడూ నీకు ముప్ఫై ఏళ్ల ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను. నువ్వు చేయాల్సిందల్లా, నీది అనుకున్న ఇంటిని కాపలా కాస్తూ ఉండటం. నీ జోలికి ఎవరన్నా వస్తే వారి వెంట పడి అరిచి అరిచి మీదపడి కరవడం. సరేనా!’ అన్నాడు.

 

దానికి కుక్క ‘అరవడం, కరవడం గురించి వింటుంటే సరదాగానే ఉంది కానీ మరీ ముప్ఫై ఏళ్లపాటు అలా గడపడమే కష్టమనిపిస్తోంది. కాబట్టి ఓ పదేళ్లపాటు అలా జీవిస్తే చాలనిపిస్తోంది. మిగతా ఇరవై ఏళ్లూ మీరే ఉంచేసుకోండి’ అనేసింది.
‘సరే, నీ ఇష్టం!’ అంటూ కుక్కను భూమ్మీదకు వదిలాడు భగవంతుడు.

 

అలా కుక్కను సృష్టించిన తరువాత కోతిని సృష్టించాడు. ‘చూడూ నీకు నలభై ఏళ్ల ఆయుష్షుని ఇస్తున్నాను. నువ్వు చేయాల్సిందల్లా, నా కోతి చేష్టలతో జనాల దృష్టిని ఆకర్షించడమే. సరేనా!’ అన్నాడు. దానికి కోతి ‘జనాల దృష్టిని ఆకర్షించడం బాగానే ఉంటుంది. కానీ మరీ నలభై ఏళ్ల పాటు అలా గడపడం అంటే చిరాగ్గా ఉంటుంది. విసుగేసిపోతుంది. కాబట్టి ఓ ఇరవై ఏళ్లు పాటు జీవిస్తే చాలు. మిగతా ఇరవై ఏళ్లూ మీరే ఉంచేసుకోండి’ అనేసింది. ‘సరే, నీ మాటను ఎందుకు కాదనాలి!’ అంటూ కోతిని భూమ్మీదకు వదిలాడు దేవుడు.

 

 

ఈసారి ఆవు వంతు వచ్చింది. ‘నిన్ను సృష్టిస్తుంటే నాకే జాలిగా ఉంది. నీకు అరవై ఏళ్ల జీవితకాలం ఇస్తున్నాను. నువ్వు దూడలను కని పోషించాలి. అవసరమైతే రైతుకి తోడుగా పొలాల్లో పనిచేయాలి. వట్టిపోతే చావుకోసం ఎదురుచూస్తూ కూర్చోవాలి.’ అన్నాడు భగవంతుడు.

 

దానికి ఆవు ‘సరే! మీరు నా నుదుటిన ఎలా రాస్తే అలా జరుగుతుంది. కాకపోతే ఒక్క మేలు చేయండి దేవా! ఇన్నేసి కష్టాలను అన్నేసి ఏళ్లపాటు భరించడం నా వల్ల కాదు. అందుకని ఒక మూడో వంతు జీవితాన్ని మాత్రమే నాకు ఇచ్చి, మిగతా నలభే ఏళ్లూ మీరే తీసేసుకోండి’ అని వేడుకొంది.దానికి భగవంతుడు సరేనంటూ, ఆవుని భూగ్రహం మీదకు వదిలాడు.

 

ఇక మనిషి వంతు వచ్చింది. ‘బాబూ, నీకు 20 ఏళ్ల ఆయుష్షుని ఇస్తున్నాను! తిను, కష్టపడు, నిద్రపో, ఆడు, పాడు.... పండగచేస్కో. ఈ ప్రపంచంలోని జీవులన్నింటికీ నువ్వే యజమానవి’ అని ఆశీర్వదించాడు.

 

 

కానీ మనిషి ఎంతైనా స్వార్థపరుడు కదా! భగవంతుని చేతిలో ఆయుష్షు పోసుకుంటూనే తన స్వార్థాన్ని చూపించేశాడు ‘జీవితాన్ని అనుభవించడానికి మరీ ఇరవై ఏళ్లేనా! కనీసం నిండు నూరేళ్లయినా లేకపోతే అదేం జీవితం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం వందేళ్ల జీవితం కావల్సిందే!’ అని పట్టుపట్టాడు.

 

మనిషి మాటలకు ఏం చేయాలో దేవునికి పాలుపోలేదు. ‘సరే ఒక పని చేస్తాను. నా దగ్గర కుక్కవి ఓ ఇరవై ఏళ్లూ, కోతివి ఓ ఇరవై ఏళ్లూ, ఆవువి ఓ ఇరవై ఏళ్లూ మిగులుగా ఉన్నాయి. వాటన్నింటినీ నీ ఆయుష్షుకి కలిపితే వందేళ్లు పూర్తవుతుంది. కానీ తరువాత జరిగే పరిణామాలకి మాత్రం నాది బాధ్యత కాదు. సరేనా!’ అని అడిగాడు.

 

‘ఓ దానిదేం భాగ్యం. నాకు వందేళ్ల ఆయువు ఉంటే చాలు’ అంటూ భూమ్మీదకి దూకేశాడు మనిషి. అలా మనిషి జీవితం వందేళ్లనుకుంటే అందులో ఇరవై శాతం మాత్రమే తనలా ఉంటాడట. మిగతా ఇరవై శాతం కాలాన్నీ తనది అనుకున్న ఆస్తిని కాపాడుకునేందుకు, తోటి వారి మీద ద్వేషంతో అరుస్తూ కరుస్తూ ఉండేందుకు ఉపయోగిస్తుంటాడు. మరో ఇరవై శాతం జీవితంలో చుట్టుపక్కల ఉన్న జనాలని ఎలాగైనా తనవైపు ఆకర్షించుకునే ప్రయత్నంలో గడిపేస్తూ ఉంటాడు. ఇక మిగిలిన జీవితమేమో బండచాకిరీ చేస్తూ, ఇతరుల కోసమే జీవిస్తూ ఉంటాడు.

 

..Nirjara

By
en-us Political News

  
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.