హీరోయిన్ సమంత కు సంబంధించి ఏ వార్త వచ్చినా అది సంచలనమే. అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం ఆమె సినీ కెరీర్ రేసు గుర్రంలా పరుగెడుతోందని చెప్పాలి. వరుస సినిమాలతో సందడి చేస్తున్న సమంత ఇప్పుడు రాజకీయాల వైపు దృష్టి సారించిందని అంటున్నారు.
ప్రస్తుతం ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సద్ధంగా ఉన్నాయి. యశోద, శాకుంతలం సినిమాలపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ప్రస్తుతం ఆమె నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. సామాజిక మాధ్యమంలో యాక్టివ్ గా ఉండే సమంత గత కొన్ని రోజులుగా కొత్తగా ఎటువంటి పోస్టులూ చేయడం లేదు. కారణమేమిటా అని అభిమానులు పలు ఊహాగాన సభలు చేస్తున్నారు.
ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఇంత బిజీలో కూడా రాజకీయాలవైపు దృష్టి సారించిందని అంటున్నారు. ఈ వార్తలకు కారణం ఆమె స్వయంగా తాను మేడీకి పెద్ద ఫాన్ నని చెప్పడమే కాకుండా ఆయనకు ఎప్పటికీ సపోర్టర్ గా ఉంటానని మీడియా ముందే చెప్పారు. దీంతో నెటిజన్లు ఆమె త్వరలో కమలం గూటికి చేరనున్నారని అంటున్నారు. పరిశీలకులు కూడా బీజేపీ పెద్దలు త్వరలో ఆమెను అప్రోచ్ అవుతారనీ, బీజేపీలోకి ఆహ్వానిస్తారని చెప్పారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ సినీ గ్లామర్ ను పార్టీలోనికి తీసుకురావడానికి అత్యంత ఉత్సాహం చూపుతున్న సంగతి విదితమే.
ఇటీవల అమిత్ షా హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నసంగతి విదితమే. జూనియర్ ఎన్టీఆర్ కమలం గూటికి చేరడంపై ఎన్నో వదంతులు ప్రచారంలోకి వచ్చినా అవేవీ వాస్తవరూపం దాల్చలేదు. అయితే ఆ తరువాత సినీనటుడు నితిన్ ను బీజేపీ సంప్రదించింది. నితిన్ వచ్చే ఎన్నికలలో బీజేపీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులే చెబుతున్నాయి. అలాగే మరి కొందరు సినీ నటులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే అనూహ్యంగా సమంత కమలం గూటికి చేరుతుందంటూ వార్తలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తనుండటం మాత్రం ఆసక్తి కలిగిస్తోంది. కెరీర్ పీక్ లో ఉండగా సమంత ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవని ఆమె అభిమానులు అంటుండగా.. కేరీర్, రాజకీయాలూ రెంటినీ సమన్వయం చేసుకోగలిగే సామర్థత సమంతలో మెండుగా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద సమంత బీజేపీ గూటికి చేరనున్నట్లుగా వస్తున్న వార్తలలో వాస్తవం సంగతి పక్కన పెడితే.. ఈ వార్త మాత్రం అటు సినీ వర్గాలలో, ఇటు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/heroine-samantha-to-join-bjp-25-143237.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.