జావో జగన్.. ఆవో బాబు..!

Publish Date:May 12, 2022

Advertisement

2024 ఎన్నికలు. ఏపీ ఎలా జరగబోతున్నాయి..? గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన జగన్ పార్టీ వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఏపీ జనాలు ఎలాంటి సీన్ చూపించబోతున్నారు..? జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడేం చేయబోతున్నారు? కొన్ని మెట్లు దిగి అయినా పొత్తులతో మళ్లీ జయపతాకం ఎగరేస్తారా? గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా ప్రజా సమస్యలపై స్పందిస్తూ జనాల్లో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏం చేయబోతున్నారు..? ఏపీలో ఎప్పుడూ గుర్తింపు పొందని జాతీయ పార్టీ బీజేపీ మద్దతు ఎవరికి..?

ఏపీలో వైసీపీకి గానీ.. సీఎం జగన్ కి గాని 2019 నాటి క్రేజ్ ఇప్పుడు లేదనేందుకు అనేక అంశాలు, సంఘటనలూ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మూడేళ్లకుపైగా అధికారంలో ఉన్న జగన్ పాలనతో ఆయన సత్తా ఏంటో.. వైసీపీ రంగేంటో జనానికి బాగా తెలిసింది. జగన్ వల్ల అభివృద్ధి శూన్యమని.. ధరలు పెరిగిపోయని సామాన్యులు, మధ్యతరగతి జన జీవనం దుర్భరంగా మారినా పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలున్నాయి. జగన్ అనుభవ రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనంత దుర్భరం అయింది. కొత్త ప్రాజెక్టులు రావు.. ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావు.. ఏ పని ఎందుకు చేస్తున్నారో తెలియని అయోమయం.

జగన్ సీఎం అయినప్పటి నుంచీ ఏపీ రాజధానిపై గందరగోళం కొనసాగుతోంది. ఉన్న జిల్లాలతో పాలన సరిగా లేకపోయినా కొత్త జిల్లాలు ఏర్పాటు ఎందుకో అంటున్నారు. మంత్రివర్గ పునర్నిర్మాణం.. కొత్త కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు చూస్తే ‘అసలు తక్కువ.. హంగామా ఎక్కువ’ అన్నట్లు ఉందంటున్నారు. జగన్ ఇచ్చే ఉచితాలు లబ్ధిదారులకు కూడా వెగటు కలిగిస్తున్నాయట. జగన్ రెడ్డి సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాలో సొమ్ములు నిండుకున్నాయి. ధరల పెరుగుదల జనం నెత్తిన పిడుగులా మారింది. విద్యుత్ సంక్షోభం.. క్షీణించిన శాంతి భద్రతలు.. మహిళలకు రక్షణ లేకపోవడం.. ఫలితాలివ్వని సచివాలయ వ్యవస్థ.. చెత్త పన్ను.. ఎమ్మెల్యేలు.. వైసీపీ నేతల ఆగడాలు లాంటి ఎన్నో మైనస్ లతో.. పూర్ ట్రాక్ తో వైసీపీ ఎన్నికల్ని ఫేస్ చేయాల్సి ఉంది.

 అధికారంలోకి రాక ముందు ఓదార్పు యాత్రతో జనాల్లో తిరిగిన జగన్ దర్శనం సీఎం అయ్యాక కరవైపోయింది. కరోనా.. తుపాను లాంటి అత్యవసర సందర్భాల్లో కూడా జనానికి జగన్ అందుబాటులో ఉన్న సందర్భాలే లేవు. ఇలాంటి ధోరణుల వల్లే జనానికి- జగన్ కి మధ్య దూరం పెరిగిపోయిందనేది వాస్తవం. జగన్ ఏలుబడి పట్ల, వైసీపీ పాలన పట్ల జనానికి ముఖం మొత్తేసిందటున్నారు. మొన్నటికి మొన్న తిరుపతిలో జగన్ సభకు బలవంతంగా తీసుకువచ్చిన డ్వాక్రా మహిళలు సహా అనేక మంది సభా ప్రాంగణం ఫెన్సింగ్ దూకి మరీ పారిపోవడం లాంటి దృశ్యాలు ఇందుకు ఉదాహరణ.

2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో టీడీపీ అధినేత జనం మధ్యలోనే తిరుగుతున్నారు. వైసీపీ సర్కార్ తప్పుల్ని ఎత్తిచూపడంలో, సమస్య వచ్చినప్పుడు తానే రంగంలోకి దిగడం, పార్టీని నడిపిస్తున్న తీరు ఏపీలో మళ్లీ టీడీపీకి పూర్వపు వైభవం వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. వయసు పైబడినా.. సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి చంద్రబాబు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఏపీలో విద్యుత్ సమస్యలపై పోరాడినా.. ఆర్థిక సమస్యల గురించి మాట్లాడినా.. ప్రాజెక్టులపై గళమెత్తినా.. శాంతి భద్రతలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై స్పందించినా.. రహదారుల దుస్థితిపై నినదించినా.. ఆయన ఎక్స్ పీరియన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు తాజాగా చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి జనం నుంచి భారీ స్పందన వస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనం ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో స్పష్టం అవుతోందంటున్నారు విశ్లేషకులు.

పవన్ కళ్యాణ్ కు జనంలో విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్ మాటలు జనాన్ని ఆకట్టుకుంటాయి. సమస్యలపై పోరాటాలూ చేస్తారు. ఇవి పవన్ కళ్యాణ్ ప్లస్ పాయింట్లు. 2019లో తనను జనం ఆమోదించకపోయినా వచ్చే ఎన్నికలకు షాట్ రెడీ చేసుకుంటున్నారు పవన్. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ పిలుపు వచ్చే ఎన్నికల్లో కీలకం అంటున్నారు.

2024 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుందనుకున్నా పొత్తు కుదుర్చుకుంటే బీజేపీతో జగన్ వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ జగన్ తో చేతులు కలిపే సంకేతాలు బీజేపీ నుంచి లేవు. పవన్ మాటలతో టీడీపీ- జనసేన పొత్తుపై కొత్త ఆశలు కలుగుతున్నాయి. జనసేనతో ఇప్పటికే పొత్తున్న బీజేపీ రేపు చంద్రబాబుకు పవన్ దగ్గరైతే ఎలా స్పందిస్తుందో చూడాలి. అదే జరిగితే బాబుతో బీజేపీ మరోసారి దోస్తీకి సిద్ధపడినట్టే. అప్పుడు వైసీపీ అధినేతకు దబిడి దిబిడి తప్పదంటున్నారు విశ్లేషకులు.

By
en-us Political News

  
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.