Publish Date:May 12, 2022
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం జగన్ సర్కార్ కు లేదని వరసగా జరుగుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం కోసం జగన్ సర్కార్ ఏకంగా సుప్రీం తీర్పును కూడా ఉల్లంఘించి పర్యవసానాలను ఎదుర్కొనడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నది.
తన నిర్ణయాలను తప్పుపడితే కోర్టులపై కూడా విమర్శలు గుప్పించి, జడ్జీలకు ఉద్దేశాలను ఆపాదించడం జగన్ సర్కార్ కు ఒక అలవాటుగా మారింది. ఈ విషయంలో న్యాయస్థానాలు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా జగన్ సర్కార్ తీరు మారడం లేదు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో కూడా ఏపీ సర్కార్ నేరుగా సుప్రీం కోర్టు ఆదేశాలనే బేఖాతరు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. సీనియర్ ఐపీఎస్ ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ముగిసిందని ఆయనకు తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు విస్పష్ట ఆదేశాలిచ్చి రెండు వారాలు గడిచినా, ఇంత వరకూ ప్రభుత్వం ఆ ఆదేశాల అమలుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
పైపెచ్చు తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సీఎస్ ను కలిసిన వెంటకేశ్వరరావుకు అవమానమే ఎదురైంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఓ సారి చీఫ్ సెక్రటరీని కలిసి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చయాలని కోరిన ఏబీవీకి ప్రాసెల్ లో పెడతామన్న సమాధానం వచ్చింది. అయితే ఆ తరువాత తర్వాత సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలు జరిగినప్పుడు కనీసం సర్వీసులోకి తీసుకున్నట్లుగా ఆదేశాలు రాలేదు.
ఈ నేపథ్యంలోనే తనకు పోస్టింగ్ ఇవ్వాలని అడిగేందుకు మరోసారి ఆయన సచివాలయానికి వెళ్లారు. సీఎస్ అందుబాటులో లేకపోవడంతో, మరోసారి బుధవార వెళ్లారు. అయతే ఈ సారి అవమానకరంగా ఆయనను వెయిటింగ్ రూములో ఉంచి సీఎస్ బయటకు వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్గా పని చేసిన ఏబీవీపై కక్షసాధింపులో భాగంగానే సర్కార్ ఇలా వ్యవహరిస్తున్నదన ఆరోపణలున్నాయి. వైసీపీ అధికారం చేపట్టగానే ఆయనపై కేసులు పెట్టి సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వడానికి జగన్ సర్కార్ ససేమిరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. సర్కార్ తీరు సివిల్ సర్వీస్ అధికారులలో ఆందోళన రేకెత్తిస్తున్నది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన కారణంతో దాదాపు పది మంది అధికారులు శిక్షకు గురైన సంగతి తెలిసిందే. తొలుత జైలు శిక్ష విధించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆ తరువాత అధికారుల విజ్ణప్తిపై ఆ శిక్షను సామాజిక సేవా శిక్షగా మార్చింది. ఇప్పుడు సుప్రీం ఆదేశాల ఉల్లంఘన పై సీఎస్ ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన వలసి వస్తుందోనన్న చర్చ అధికారులలో జరుగుతోంది. ప్రభుత్వ తప్పిదాలకు సివిల్ సర్వీసెస్ అధికారులు శిక్షలకు గురి కావడం ఇప్పుడు ఏపీలో సర్వసాధారణ విషయంగా మారిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-ignore-supreme-cerdict-on-abvs-posting-25-135779.html
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.