విశాఖపట్నంలోని అత్యంత వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ విషయంలో ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో చారిత్రాత్మక రుషికొండకు బోడిగుండు కొట్టి, పర్యావరణ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ.. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న విషయంలో గత రెండేళ్లుగా మల్లగుల్లాలు పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ఈ మంత్రుల కమిటీ పలుమార్లు సమావేశమై, వివిధ ప్రత్యామ్నాయాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. ఈ ప్యాలెస్ను అంతర్జాతీయ స్థాయి సంస్థలకు లీజుకు ఇవ్వడమే ప్రభుత్వానికి లాభదాయకమని తుది నిర్ణయానికి వచ్చింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రుషికొండ ప్యాలెస్ తో పాటు దానికి ఆనుకుని ఉన్న 9 ఎకరాల అదనపు భూమిని లీజు, ఆపరేషన్, మేనేజ్మెంట్, అభివృద్ధి కోసం అధికారికంగా అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ టెండర్ నోటిఫికేషన్ను జారీ చేసింది.
ఈ టెండర్ల దాఖలుకు ఈ నెల 10 తుది గడువుగా నిర్ణయించింది. రుషికొండ ప్యాలెస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లగ్జరీ రిసార్ట్ లేదా, ఫైవ్ స్టార్ హోటల్గా మార్చాలని ఏపీ టూరిజంభావిస్తోంది. గతంలో ఈ కొండపై ఉన్న టూరిజం రిసార్ట్స్ ద్వారా ఏడాదికి ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించేది. గత ప్రభుత్వం వాటిని తొలగించి ఈ భారీ ప్యాలెస్ను నిర్మించింది. అప్పటి నుంచి ఆదాయం లేకపోగా, ఈ ప్యాలెస్ మెయింటేనెన్స్ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.
ఈ నేపథ్యంలోనే రుషికొండ ప్యాలెస్ ను పర్యాటక రంగంలో సరికొత్త గ్లోబల్ ఐకాన్గా తీర్చిదిద్దడం ద్వారా అటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతో పాటు, వైజాగ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ టెండర్ ప్రకటనతో గత కొద్ది రోజులుగా రుషికొండ భవనాల భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలికినట్లైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/global-tender-for-rushikonda-palace-36-224941.html
సొంత సర్వేతోనే జగన్కు షాక్?.. ‘మావిగన్’ వ్యూహంపై పార్టీలో అసంతృప్తి..?
తెలంగాణ అప్పులపై చర్చకు సిద్దమని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం, హత్య ఉదంతం కేసులో దర్యాప్తు సంస్థలకు అత్యంత కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి.
అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్కు అండగా నిలిచే ఇస్లామిక్ మిత్రదేశమే ఈ విధంగా పాక్ బయాయిలను ముక్కుపిండి మరీ వసూలు చేయడానికి సిద్ధం కావడంతో పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో పడింది. అప్పులు తీసుకోవడం, వాటిని సకాలంలో తీర్చకుండా కాలయాపన చేయడం పాకిస్థాన్ కు మామూలే. అయితే ఈ సారి మాతరం యూఏఈ కాలయాపనను ఇసుమంతైనా సహించేది లేదని అల్టిమేటం ఇవ్వడంతో పాకిస్థాన్ కు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది.
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిణామం చోటుచేసుకుంది.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
సాయి కృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సీఐ నాగరాజు కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారనీ, కస్టడీ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయనా లేఖలో కోరారు.
ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించి స్థలంలో అత్యాధునిక హంగులతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది ఈ భవనం దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పరిపాలన, అత్యున్నత స్థాయి ఆతిథ్య కేంద్రంగా సేవలందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది.
ధీరజ్ సేథ్ తండ్రి భారత సైన్యంలో త్రీస్టార్ జనరల్ గా సేవలందించి పదవీ విరమణ చేశారు. ఆయన కుమారుడు ఆయన కంటే ఉన్నత స్థాయికి చేరుకుని ఇండియన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
పెళ్లి బృందంతో వెడుతున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర 57 రోజుల సాగనుంది. శుక్రవారం (జులై 3) ప్రారంభమైన ఈ యాత్ర రాబోయే వచ్చే నెల 28 వరకు కొనసాగుతుంది.
భారీ వర్షాలకు తోడు 50 కిలోమీటర్లకంటే ఎక్కువ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.