నటి త్రిషపై షాకింగ్ కామెంట్స్.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్..!

Publish Date:Jul 3, 2026

Advertisement

 

తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి.జోసెఫ్ విజయ్, అలాగే ప్రముఖ సినీ నటి త్రిషలపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను తమిళనాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 

స్థానిక టీవీకే కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై పరువు నష్టం, ప్రజల్లో ఘర్షణలను ప్రేరేపించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం రాధాకృష్ణన్ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఈ వివాదం వెనుక ఉన్న అసలు వివరాల్లోకి వెళ్తే.. గత జూన్ 20వ తేదీన మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతి ఉత్సవాల సందర్భంగా తిరుచెందూర్ సమీపంలోని ఆత్తూర్‌లో ఒక బహిరంగ సభ జరిగింది. ఈ సభలో డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యక్తిగత దూషణలకు దిగారు. విజయ్ శారీరక రూపాన్ని ఎగతాళి చేయడంతో పాటు, ఆయన సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి రావడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో మరియు విజయ్ అభిమానుల్లో తీవ్ర దుమారం రేగింది.

అక్కడితో ఆగకుండా, శాంతిభద్రతలపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా కూడా రాధాకృష్ణన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నటితో సంతోషంగా ఉండే విజయ్, ఇప్పుడు అసెంబ్లీ అనే ఊబిలో చిక్కుకుపోయారని, నలువైపులా ఇరుక్కుపోయాననే మానసిక ఆందోళనలో ఆయన ఉన్నారని వ్యాఖ్యానించారు. సినిమా షూటింగులు వేరు, రాష్ట్ర పాలన వేరంటూ ఎద్దేవా చేశారు.

 తాను ఒక వ్యాపారినని, ఒక వ్యక్తి దుకాణంలోకి వచ్చినప్పుడు అతను కొనడానికి వచ్చాడా లేక అప్పు అడగడానికి వచ్చాడా అనేది ముఖం చూసి చెప్పగలనని, అదేవిధంగా అసెంబ్లీలో సీఎం విజయ్ ముఖంలో కనిపిస్తున్న గందరగోళాన్ని చూస్తే ఆయన అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చానని భావిస్తున్నట్లు స్పష్టమవుతోందని వ్యంగ్యంగా మాట్లాడారు. తనకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అన్నట్లుగా విజయ్ ప్రవర్తన ఉందని రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు టీవీకే శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసాయి.

మరోవైపు ఈ అరెస్టు పట్ల అధికారిక డీఎంకే పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రతిపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అణచివేత వ్యూహాలను అవలంబిస్తోందని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆమె 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా విమర్శించారు. 

డీఎంకే ఇటువంటి అణచివేత చర్యలకు ఎప్పటికీ భయపడదని, తలొగ్గబోదని స్పష్టం చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని డీఎంకే ఆరోపిస్తుండగా, పరువు నష్టం మరియు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తప్పవని టీవీకే శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ అరెస్టుతో తమిళనాడులో డీఎంకే, టీవీకే పార్టీల మధ్య రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

By
en-us Political News

  
సొంత సర్వేతోనే జగన్‌కు షాక్?.. ‘మావిగన్’ వ్యూహంపై పార్టీలో అసంతృప్తి..?
తెలంగాణ అప్పులపై చర్చకు సిద్దమని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం, హత్య ఉదంతం కేసులో దర్యాప్తు సంస్థలకు అత్యంత కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి.
అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌కు అండగా నిలిచే ఇస్లామిక్ మిత్రదేశమే ఈ విధంగా పాక్ బయాయిలను ముక్కుపిండి మరీ వసూలు చేయడానికి సిద్ధం కావడంతో పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో పడింది. అప్పులు తీసుకోవడం, వాటిని సకాలంలో తీర్చకుండా కాలయాపన చేయడం పాకిస్థాన్ కు మామూలే. అయితే ఈ సారి మాతరం యూఏఈ కాలయాపనను ఇసుమంతైనా సహించేది లేదని అల్టిమేటం ఇవ్వడంతో పాకిస్థాన్ కు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
సాయి కృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సీఐ నాగరాజు కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారనీ, కస్టడీ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయనా లేఖలో కోరారు.
ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించి స్థలంలో అత్యాధునిక హంగులతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది ఈ భవనం దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పరిపాలన, అత్యున్నత స్థాయి ఆతిథ్య కేంద్రంగా సేవలందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది.
వైసీపీ హయాంలో చారిత్రాత్మక రుషికొండకు బోడిగుండు కొట్టి, పర్యావరణ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ.. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న విషయంలో గత రెండేళ్లుగా మల్లగుల్లాలు పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ధీరజ్ సేథ్ తండ్రి భారత సైన్యంలో త్రీస్టార్ జనరల్ గా సేవలందించి పదవీ విరమణ చేశారు. ఆయన కుమారుడు ఆయన కంటే ఉన్నత స్థాయికి చేరుకుని ఇండియన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
పెళ్లి బృందంతో వెడుతున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర 57 రోజుల సాగనుంది. శుక్రవారం (జులై 3) ప్రారంభమైన ఈ యాత్ర రాబోయే వచ్చే నెల 28 వరకు కొనసాగుతుంది.
భారీ వర్షాలకు తోడు 50 కిలోమీటర్లకంటే ఎక్కువ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.