తెలంగాణ అప్పులపై చర్చకు సిద్దమని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చకు రావాలని ఆహ్వానించారు. "మీరు చెప్పిన అప్పుల లెక్కలే తప్పని తేలితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? లేక ప్రజలకు క్షమాపణ చెబుతారా?" అని మంత్రి ప్రశ్నించారు. వాట్సాప్ ద్వారా కూడా అప్పుల వివరాలను వారికి పంపించినట్లు తెలిపారు. "నేను ఎప్పుడూ తోక ముడవలేదు. వెనక్కి తగ్గే స్వభావం నాది కాదు.
ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోను. ప్రజల ముందు నిజాలు బయటపెట్టడానికి ఎలాంటి చర్చకైనా సిద్ధమే" అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నేను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని రుజువు చేయండి. నా వాదన తప్పని నిరూపిస్తే ఇప్పటికీ రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను" అని జూపల్లి ప్రకటించారు. దీనిపై మాటల యుద్ధం కాకుండా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలను కోరారు. మంత్రి విసిరిన ఈ సవాల్కు బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-jupally-krishna-rao-36-224973.html
హైదరాబాద్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.