రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్.. ఎందుకంటే..?
Publish Date:Jul 30, 2026
Advertisement
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జ్షీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు సమన్లు జారీ చేసిన తర్వాత కేటీఆర్ తొలిసారి కోర్టు ముందు హాజరు కానుండటం ప్రాధాన్యత సంతరించు కుంది. రేపు ఉదయం 9 గంటలకు నార్సింగిలోని తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరనున్నట్లు సమాచారం. అనంతరం ఉదయం 10.15 గంటలకు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు. మాజీ మంత్రి కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో ఆయన పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కోర్టు పరిసరాల్లో కూడా భద్రతా ఏర్పాట్లు చేపట్టే అవకాశం ఉంది.హైదరాబాద్లో ఫార్ములా-ఈ కారు రేస్ నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వ్యవహా రాలపై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగింది. రేస్ నిర్వహ ణకు సంబంధించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల నుంచి సుమారు రూ.55 కోట్లు చెల్లించడంలో నిబంధనలు పాటించ లేదని ఏసీబీ ఆరోపించింది. అవసరమైన అనుమతులు, ఆర్థిక విధానాలను అనుసరించకుండా చెల్లింపులు జరిగాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది. దర్యాప్తు అనంతరం ఏసీబీ నాంపల్లి ఏసీబీ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. చార్జ్షీట్లో కేటీఆర్ను ఏ-1గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ను ఏ-2గా, మాజీ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ-3గా పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అధికార దుర్వినియోగం, నిధుల వినియోగంలో నిబంధనల ఉల్లంఘన, కుట్ర తదితర అంశాలపై ఏసీబీ ఆరోపణలు చేసింది. చార్జ్షీట్ను పరిశీలించిన అనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో కేటీఆర్ జూలై 31న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో రేపటి విచారణ కీలకంగా మారనుంది. చార్జ్షీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత కేటీఆర్ వ్యక్తిగతంగా హాజరుకావడం ఇదే తొలిసారి కావడంతో తదుపరి న్యాయ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. ఇక మరోవైపు ఫార్ములా-ఈ కేసు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా, ప్రజా నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై చట్ట ప్రకారం దర్యాప్తు జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఏసీబీ చార్జ్షీట్లో చేసిన ఆరోపణలు విచారణలో నిరూపించాల్సి ఉంటుంది. కోర్టు విచారణలో సాక్ష్యాలు, ఆధారాల ఆధారంగా తదుపరి నిర్ణయాలు వెలువడను న్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం నార్సింగి నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరి నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకా నుండటంతో ఫార్ములా-ఈ కేసులో తదుపరి పరిణామాలపై రాజకీయ, న్యాయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. Formula-E car race case, KTR, Nampally ACB Court, ACB chargesheet, IAS officer Arvind Kumar, BLN Reddy, BRS Party, KCR
http://www.teluguone.com/news/content/formulae-car-race-case-36-227561.html





