పరారీలో వైసీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని.!?

Publish Date:Jul 20, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరారీలో ఉన్నారు. కుటుంబంతో సహా సోమవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు కారులో తన ఇంటి నుంచి కుటుంబంతో సహా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.  శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చిన  4 కోట్ల రూపాయల విలువైన   భూమిని అక్రమంగా కాజేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై కేసు నమోదు కావడంతో..  అరెస్టు ఖాయమని నిర్ధారించుకున్న తమ్మినేని సీతారాం తన కుటుంబంతో సహా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.  

  తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి,  కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌లపై  భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత తమ్మినేని కుటుంబం ఆముదాల వలసలో తాము ఉంటున్న నివాసం నుంచి పరారైపోయారు.  స్వంత వాహనాలు నివాసం వద్దే వదిలేసి, తమ కదలికలను మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ట్రాక్ చేసే అవకాశం లేకుండా ఫోన్లు కూడా ఇంట్లోనే వదిలేసి ఓ  ప్రైవేటు కారులో వెళ్లిపోయారు.   

తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారు కావడానికి కారణమైన  భూకబ్జా వ్యవహారం వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం చాపురం పంచాయతీ పరిధిలోని బలగ ప్రాంతంలో ఉన్న  స్థలానికి సంబంధించిన అసలు యజమాని   బతికే ఉన్నప్పటికీ..  ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. ఆ తర్వాత ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక మహిళను ఆ ఆస్తికి ఏకైక చట్టబద్ధమైన వారసురాలిగా చూపిస్తూ, సదరు భూమిని తమ్మినేని సీతారాం కుమారుడి పేరిట   రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై ఆధారాలు  సేకరించిన పోలీసులు, దీని వెనుక ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ నెట్‌వర్క్ నెరిపిన దందాను బహిర్గతం చేశారు.

ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల కుట్రలో భాగస్వాములైన 13 మంది నిందితులలో హిరమండలం సబ్ రిజిస్ట్రార్ సహా 8 మంది కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ప్రధాన నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం ఆయన కుటుంబం తమ నివాసంలోనే అందుబాటులో ఉన్నప్పటికీ, పోలీసులు వారిని వెంటనే అరెస్టు చేయడంలో కాలయాపన చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.    ఈ ఆలస్యాన్ని ఆసరాగా చేసుకుని, తమ్మినేని కుటుంబం చట్టపరమైన న్యాయ సలహాలు స్వీకరించి, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే పరారయ్యారని తెలుస్తోంది.  

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం,  ఆయన కుటుంబంపై భూకబ్జా ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమదాలవలసలోని టీఎస్ఆర్ కాలేజీ పక్కన ఉన్న 8 సెంట్ల   ఆస్తిని ఆక్రమించారనే ఆరోపణలు రాగా, ఇటీవలె రెవెన్యూ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని బాధితులకు తిరిగి అప్పగించారు. వీటితో పాటు, టెక్కలి మండలం చింతామణి గ్రామంలోని 23 ఎకరాల భూమిని బెదిరించి తన కుమారుడి పేరిట రాయించుకున్నారని, అలాగే ఒక మృతుడి కుటుంబానికి చెందిన ఇంటిని  ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

అదలా ఉంటే తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీ అయిన నేపథ్యంలో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమ్మినేని సీతారాం కుటుబంతో సహా  పొరుగు రాష్ట్రాలకు వెళ్లి  ఉంటారనే అనుమానంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలకి దింపి  సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనం ప్రయాణించిన మార్గాలను సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పరిశీలిస్తున్నారు. 

Srikakulam Land Grab Case, YCP Senior Leader, Fake Registration Scam, AP Police Investigation

By
en-us Political News

  
15 ఏళ్ల భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. జింబాబ్వే టీ20 సిరీస్ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్‌తో జరిగిన ఆసక్తికరమైన ముచ్చట, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బంతికే కొట్టిన సిక్సర్ విశేషాలు ఇక్కడ చదవండి.
ఐసీసీ విడుదల చేసిన లేటెస్ట్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ నంబర్ వన్ స్థానానికి కేవలం ఒక రేటింగ్ పాయింట్ దూరంలో నిలిచాడు. టాప్ 4లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో సహా టీమిండియా డామినేషన్ మరియు ఇతర ప్లేయర్ల లేటెస్ట్ ర్యాంకింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
అంతర్జాతీయ డిమాండ్ మరియు ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో బంగారం ధర మళ్లీ భగ్గుమంది. 10 గ్రాముల బంగారం రూ.1.50 లక్షలకు చేరువ కాగా, వెండి ధర కూడా భారీగా పెరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులు, యువతకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వానికి కీలక లేఖ రాశారు
నవ ఢిల్లీలోని చారిత్రాత్మక నిరసన వేదిక జంతర్ మంతర్ కేంద్రంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం దేశ రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవన ద్రోణి చురుగ్గా కదులుతుండటంతో రాగల రెండు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొట్టనున్నాయి.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతి రేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు.
నీట్ వివాదం వేళ విద్యాశాఖ మంత్రి పాత పోరాటాలు..!
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన శాంతియుత నిరసనలు, పోలీసుల లాఠీఛార్జ్ వ్యవహారం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం మెట్లుక్కింది.
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో మరియు జాతీయ పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న వరుస అక్రమాలు, అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాలు పోరాటబాట పట్టాయి.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం..!
10 ఏళ్లలో 152 లీకేజీలు..రాహుల్ సంచలన ఆరోపణలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.