వ‌రంగ‌ల్‌లో ఫెక్సీల ర‌గ‌డ‌.. హ‌న్మ‌కొండ‌లో బండి సమావేశం

Publish Date:Aug 27, 2022

Advertisement

వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల రగడ మళ్లీ మొద లైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు స్వాగతం పలుకుతూ బీజేపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు సంఘటనా స్థలంలో ఆందోళన చేస్తున్నారు. ఫ్లెక్సీల చించివేత టీఆర్ఎస్ పనేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వరంగల్ లో హై టెన్షన్ వాతావరణం నెల కొంది. ఆందోళన చేస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మూడ‌వ విడ‌త ప్ర‌జాసంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా హ‌న్మ‌కొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ప్ర‌త్యేక స‌భ జ‌ర‌గ‌నుంది. దీనికి బీజేపీజాతీయ అద్య‌క్షుడు న‌డ్డాతో పాటు ముఖ్య‌నేత‌లు హాజ‌రుకానున్నారు.  జనగామ జిల్లా పాంనూర్‌ వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజాసంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. మూడు రోజుల విరామం తర్వాత హైకోర్టు అనుమతితో యాత్ర ఆగిన చోట నుంచే తిరిగి మొదలైంది. 

ఈ క్రమంలోనే వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ సీపీ తరుణ్‌జోషి ఉత్తర్వులను జారీ చేయడం, ఆర్ట్స్‌ కళాశాలలో సభ నిర్వహణకు ప్రిన్సిపాల్‌ అనుమతి నిరాకరించడంతో.. బీజేపీ బహిరంగ సభ నిర్వహణపైనా అనిశ్చితి నెలకొన్నది. అయితే, బీజేపీ నేతలు హై కోర్టును ఆశ్రయించి.. సభకు అనుమతి సాధించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. కళాశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించింది. దీంతో బీజేపీ నాయకత్వం రెట్టించిన ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిష్ఠాత్మ కంగా సభహనుమకొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 21న  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటించి రాష్ట్రంలో రాజకీయ అలజడికి తెరలేపగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేపీ నడ్డా ఎలాంటి కీలక సందేశం పార్టీ శ్రేణులకు ఇవ్వబోతున్నార న్నది ఆసక్తికరంగా మారింది. 

 ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ముఖ్యనేతలతోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, పలువురు సీనియర్‌ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జిగా నియమితులైన సునీల్‌ బన్సల్‌ శుక్రవారమే వరంగల్‌ చేరుకున్నారు. బన్సల్‌తో పాటు పార్టీ రాష్ట్ర మరో ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తదితర సీనియర్‌ నేతలు ఈ బహిరంగసభలో పాల్గొననున్నారు

By
en-us Political News

  
త్రినయని సీరియల్ లో తిలోత్తమగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆమె మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ వేకువ జామున పవిత్ర ప్రయాణిస్తున్న కారు హైవే నెం.44పై భూత్ పూర్ సమీపంలోని శేరిపల్లి వద్ద రోడ్డు డివైడర్ ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఇదే కారులో పవిత్ర కుటుంబ సభ్యులు, మరో నటుడు చంద్రకాంత్ కూడా ఉన్నారు. పవిత్ర మృతి చెందగా, కుటుంబ సభ్యులకు, చంద్రకాంత్ కు గాయాలయ్యాయి. 
పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పోలింగ్ బూత్ లోకి మొబైల్స్, ఇతర వస్తువులను అనుమతించరు. కాబట్టి వీటిని ఇంటివద్దే వదిలివెళ్ళండి. ఓటర్ ఐడీ లేదా ఇతర ఫోటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్ మీ వద్ద ఉంచుకోవాలి.
గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన వైకాపా నేత వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో గులకరాయి నాటకం ఆడి అట్టర్ ప్లాప్ అయ్యారు. సరిగ్గా పోలింగ్  కు ఒక రోజు ముందు  ఫేక్ ఆడియోలను రిలీజ్ చేస్తూ అధికారంలో రావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఒటమి కన్ఫర్మ్ కావడంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌ని చాలా వ్యతిరేకిస్తున్నారు. తమ వ్యతిరేకతను ఓట్ల రూపంలో రేపు చూపించబోతున్నారు. ప్రజలు చంద్రబాబుకు అనుకూలంగా వున్నారు. అయితే చంద్రబాబు మీద అనుకూలత కంటే జగన్ మీద వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా వుంది.
ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25లోకసభ ఎన్నికలు ఒకే సారి నిర్వహిస్తుండగా తెలంగాణలో మాత్రం కేవలం 17  లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామిభక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్లచావు వాళ్లు చావని అనేలా వదిలేశారు. 
బొత్సలాంటి బేవకూఫ్‌లు జగన్ పక్కన వుండటం వల్లే జగన్ ఇలా నాశనం అయిపోయాడు. గతంలో జగన్‌కి మద్దతుగా నిలిచిన వాళ్ళని కృతజ్ఞత లేకుండా నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. ఇదే వాళ్ళ కేరక్టర్లు ఏమిటో చెబుతూ వుంటుంది.
ఈసారి ఎన్నికలలో ప్రజల నుంచి జగన్ గుణపాఠం నేర్చుకోబోతున్నారు.. జగన్ భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తూ, జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ మ‌హిళ త‌న ఇంటినే వ్య‌భిచార కొంప‌గా మార్చివేసింది. త‌న వ్యాపారం కోసం ఆమె 14 ఏళ్ళ క్రితంమే ఓ ఆడ‌బిడ్డ‌ను తెచ్చుకుని పెంచుకుంది. బడికీ పంపింది. అయితే పెంపుడు కూతురు అనే సంగతి బాలికకు చెప్పకపోవడంతో ఆమే తన తల్లి అని, చిన్నారి భావిస్తూ వచ్చింది.
ఈ వాలంటీర్ల వ్యవస్థ ఐడియా జగన్‌కి నేను ఇచ్చానని చాలామంది అనుకుంటూ వున్నారు. కానీ, ఈ పాపంతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
ఈ జూన్ 4న జగన్మోహన్‌రెడ్డి ప్రజల చేతిలో పెద్ద షాక్ తినబోతున్నారు. జగన్ ప్రజల నుంచి గుణపాఠం నేర్చుకోబోతున్నారు. ఆ గుణపాఠం కూడా అత్యంత దారుణంగా వుండబోతోంది అని ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పారు.
కోడి క‌త్తి డ్రామా ఘ‌ట‌న‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశ‌వ్యాప్తంగా ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తిఒక్క‌రికి సుప‌రిచిత‌మే. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో సీఎం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఈ ఘ‌ట‌న కూడా ఒక‌టి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.