బాబోయ్ పెద్ద పులి.. జంగారెడ్డి గూడెం పరిసర గ్రామాల్లో భయం భయం.!

Publish Date:Aug 3, 2026

Advertisement

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.  గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి.. పశువులపై దాడులు చేస్తూ  అటు గ్రామస్థులు, ఇటు అటవీ శాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది.  పులిని బంధించేందుకు అటవీ శాఖ రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోతోంది. 

మహారాష్ట్రలోని వార్ధా నుండి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందంతో పాటు సుమారు 30 మందికి పైగా అటవీ సిబ్బంది పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు.  పులి సంచరిస్తున్న మార్గాల్లో సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, బోన్లు, ఎరలు సిద్ధం చేశారు.  దట్టమైన అటవీ ప్రాంతం కావడం, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పులి ట్రాకింగ్ కు తీవ్ర విఘాతం కలుగుతోంది. పులి సంచారంతో   స్వర్ణవారిగూడెం, లక్ష్మణుడుగూడెం, కొయ్యలగూడెం, పండుగూడెం తదితర  గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. 

వర్షాకాలం ప్రారంభమై పొలం పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పెద్దపులి భయం వెంటాడటంతో చేలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు భయపడుతున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు  తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.  పులి సంచారం కారణంగా జంగారెడ్డిగూడెం డివిజన్ అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రిపూట బయటకు రావద్దనీ,  పశువులను మేత కోసం అడవికి తోలొద్దనీ హెచ్చరించారు.  ప్రమాదకర ప్రాంతాల్లో అటవీ శాఖ సిబ్బంది డప్పు చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.  సాధ్యమైనంత త్వరలో పెద్దపులిని పట్టుకుంటామనీ అంత వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, అధికారులకు సహకరించాలని అటవీశాఖ కోరుతోంది. 

Fear grips  villages around Jangareddygudem, Tiger, animals, forest dpartment, 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన వ్యాఖ్యల వ్యవహారంలో ప్రతిపక్ష నేత డీఎంకే వర్కింగ్ ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.
చండీపురా వైరస్ తో 25 మంది చిన్నారులు ప్రాణాల కోసం పోరాడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు వెంటిలేటర్ పై ఉన్నారు.
బహుశా..ఏపీ పోలీసు హిస్టరీలో, ఏపీ ఏమిటి ఇండియాలోనే ఈ తరహా కేసు గతంలో ఎన్నడూ జరిగి ఉండదన్న ఏబీ వెంకటేశ్వరరావు.. కాదంబరి జత్వానీ కేసు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాల్సిన కేసు అని వ్యంగ్యంగా అన్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించి ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నూజివీడు పోలీసులు, గుజరాత్ వెళ్లి మరీ అరెస్టు చేశారు.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో నడుస్తున్న ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఒక వీడియో దాదాపు ఐదు గంటల పాటు అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ కమిటీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి కారణాలను పది రోజుల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని మెటా యాజమాన్యాన్ని కమిటీ ఆదేశించింది.
ఆయన తీసుకున్న టారిఫ్ ల నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలోనే తిరుగుబాటు మొదలైంది. ప్రపంచ వ్యాపార రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ టెర్రర్ కు వ్యతిరేకంగా అమెరికాలోని పాతిక రాష్ట్రాలలో వ్యతిరేక గళం బలంగా వినిపిస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ లో ఉంటూ.. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా అక్కడ ఆశ్రయం కల్పించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు కిరణ్ కుమార్ రెడ్డి.. సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న పేరాశతో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసి రెడ్డితో చేతులు కలిపాడని సిట్ దర్యాప్తు లో తేలింది. 
యాపిల్ ప్లాట్‌ఫామ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించేలా సున్నితమైన కంటెంట్ టెలిగ్రామ్‌లో కనిపించడమే టెలిగ్రామ్ ను యాపిల్ స్టోర్ నుంచి తొలగించడానికి కారణమని తెలిసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ టెలిగ్రామ్ ఛానెళ్లలో వ్యాప్తి చెందినట్లు యాపిల్ బృందం గుర్తించింది.
సెబీ మార్గదర్శకాలతో భారత స్టాక్ మార్కెట్లో అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS వివరాలు, ఎఫ్&ఓ షేర్ల నూతన ట్రేడింగ్ వేళలు మరియు ముగింపు ధర నిర్ణయించే ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అమేజాన్ ఆస్ట్రేలియాలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 42mm, GPS పై ఏకంగా 37% దాకా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. AU$252 ఆదా అయ్యే ఈ రికార్డు ఆఫర్ డీల్ వివరాలు, బ్యాటరీ లైఫ్ మరియు బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సహా కొత్త హెల్త్ ఫీచర్ల సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
GMKtec NEO X1 వర్క్‌స్టేషన్ పిసి అత్యంత వేగవంతమైన AMD Ryzen 9000HX సిరీస్ ల్యాప్‌టాప్ CPU మరియు NVIDIA RTX 5070 డెస్క్‌టాప్ GPU కాంబినేషన్‌తో లాంచ్ అయింది. 14.6L చిన్న పరిమాణంలో లిక్విడ్ కూలింగ్‌తో వచ్చిన ఈ పవర్‌ఫుల్ పిసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హెచ్‌బీవో మాక్స్ ఫేమస్ సిరీస్ స్టూవర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ ఎపిసోడ్ 3 రిలీజ్ డేట్, ఇండియా స్ట్రీమింగ్ టైమింగ్స్ మరియు మొత్తం 10 ఎపిసోడ్‌ల కంప్లీట్ షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.