వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు.!
Publish Date:Aug 20, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. వైఎస్ వివేకా కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆయన నివాసాలు, కార్యాలయాలు, అలాగే ఆయన ముఖ్య అనుచరుల నివాసాలలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, కడప, పులివెందులలోని ప్రాంతాల్లో దాదాపు 10 ప్రదేశాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలను చేపట్టాయి. శుక్రవారం (ఆగస్టు 21) తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఈ సోదాల సందర్భంగా కేంద్ర బలగాల భారీగా మోహరించి భద్రత కల్పిస్తున్నారు. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డికి సన్నిహితులైన పలువురు కీలక అనుచరుల డి. శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఇతర అనుచరుల నివాసాల్లోనూ ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసు దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్ల చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఎఫ్ఐఆర్, 3 అనుబంధ చార్జ్షీట్ల ఆధారంగా ఈడీ 2025 ఆగస్టులో లో ఈసిఐఆర్ కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చిన 11ప కడప జిల్లాలోని ఆయన స్వగృహంలోనే హత్యకు గురైన సంగతి విదితమే. ఆ తర్వాత మార్చి 11, 2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేసింది. వివేకానందరెడ్డి హత్య వెనుక రాజకీయ, ఆర్థిక కోణాలు, కుట్రలతో పాటు 40 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక లావాదేవీల ప్రతిపాదనలు ఉన్నట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. హత్యకు ముందు, తర్వాత జరిగిన సందేహాస్పద నగదు బదిలీలు, ఆస్తుల కొనుగోళ్లు, హవాలా మార్గాలు, బెదిరింపుల ఆధారాలను వెలికితీసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. శుక్రవారం (ఆగస్టు 21) తెల్లవారుజాము చేపట్టిన ఈడీ తనిఖీల్లో కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంక్ ఖాతాల రికార్డులు, డిజిటల్ సాక్ష్యాలు, హార్డ్ డిస్క్ లు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించే కాకుండా, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కోణాలపై కూడా ఈడీ బృందాలు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో 16 మంది అరెస్టు, పలు దఫాల విచారణల తరువాత ఈడీ నేరుగా ఎంపీ నివాసాలపై నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది. ED Raids in Telugu States, YS Avinash Reddy, YSRCP MP, Vivekananda Reddy Case, ED Searches Hyderabad, PMLA Investigation
http://www.teluguone.com/news/content/ed-raids-in-telugu-states-36-229404.html





