వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు.!

Publish Date:Aug 20, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. వైఎస్ వివేకా కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆయన నివాసాలు, కార్యాలయాలు, అలాగే ఆయన ముఖ్య అనుచరుల నివాసాలలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌,   కడప, పులివెందులలోని  ప్రాంతాల్లో దాదాపు 10 ప్రదేశాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలను చేపట్టాయి.  శుక్రవారం (ఆగస్టు 21)  తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఈ సోదాల సందర్భంగా కేంద్ర బలగాల  భారీగా మోహరించి భద్రత కల్పిస్తున్నారు. అవినాష్ రెడ్డి తండ్రి  వైఎస్ భాస్కర్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డికి   సన్నిహితులైన పలువురు కీలక అనుచరుల  డి. శివశంకర్ రెడ్డి,  సునీల్ యాదవ్, ఇతర అనుచరుల నివాసాల్లోనూ ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి   హత్య కేసుకు సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసు దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్ల చెబుతున్నారు.  ఈ కేసుకు సంబంధించి సిబిఐ   ఎఫ్ఐఆర్,  3 అనుబంధ చార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ   2025 ఆగస్టులో లో ఈసిఐఆర్   కేసు నమోదు చేసి  దర్యాప్తును చేపట్టిన సంగతి తెలిసిందే.  

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చిన 11ప కడప జిల్లాలోని ఆయన స్వగృహంలోనే హత్యకు గురైన సంగతి విదితమే.   ఆ తర్వాత మార్చి 11, 2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేసింది.  వివేకానందరెడ్డి హత్య వెనుక రాజకీయ, ఆర్థిక కోణాలు, కుట్రలతో పాటు   40 కోట్ల రూపాయలకు పైగా  ఆర్థిక లావాదేవీల ప్రతిపాదనలు ఉన్నట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. హత్యకు ముందు, తర్వాత జరిగిన సందేహాస్పద నగదు బదిలీలు, ఆస్తుల కొనుగోళ్లు, హవాలా మార్గాలు,  బెదిరింపుల ఆధారాలను వెలికితీసేందుకు  ఈడీ  రంగంలోకి దిగింది.  

శుక్రవారం (ఆగస్టు 21) తెల్లవారుజాము చేపట్టిన ఈడీ తనిఖీల్లో   కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంక్ ఖాతాల రికార్డులు, డిజిటల్ సాక్ష్యాలు, హార్డ్ డిస్క్ లు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.   వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించే కాకుండా,  ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కోణాలపై కూడా ఈడీ బృందాలు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో  16 మంది అరెస్టు, పలు దఫాల విచారణల తరువాత  ఈడీ నేరుగా ఎంపీ నివాసాలపై  నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది.  

ED Raids in Telugu States, YS Avinash Reddy, YSRCP MP, Vivekananda Reddy Case, ED Searches Hyderabad, PMLA Investigation

By
en-us Political News

  
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు 11 21, 21 15, 17 21తో వాంగ్ జి యి చేతిలో ఓడిపోగా, సాత్విక్ చిరాగ్ మరియు ట్రీసా గాయత్రి జోడీలు సంచలన విజయాలతో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి. తదుపరి మ్యాచ్ వివరాలు ఇవే
ఏఎఫ్సీ విమెన్స్‌‌ చాంపియన్స్ లీగ్‌లో ఈస్ట్‌‌ బెంగాల్‌‌ ఎఫ్‌‌సీ 12 0 తేడాతో రోవర్స్‌‌ ఎఫ్‌‌సీపై చారిత్రాత్మక విజయం సాధించింది. 40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఆసియా పోటీల్లో ఇండియన్ క్లబ్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే!
మేటా స్మార్ట్ గ్లాసెస్‌పై UK సినిమా థియేటర్లలో నిషేధం విధించే ఆలోచన మొదలైంది. ప్రైవసీ ఆందోళనలతో పాటు రహస్యంగా సినిమాలు రికార్డు చేసి పైరసీ చేసే ప్రమాదం ఉండటంతో ఈ సంచలన నిర్ణయం వైపు అడుగులు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
ది బిగ్ బ్యాంగ్ థియరీ పాపులర్ స్పిన్ ఆఫ్ సిరీస్ స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ సీజన్ 2 పై క్రియేటర్స్ చక్ లోరే, జాక్ పెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షో భవిష్యత్తు ప్రణాళికలు మరియు HBO Max నిర్ణయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రపంచ దిగ్గజ సంస్థలైన సిస్కో, శామ్‌సంగ్, AWS లను వణికించిన భారీ సప్లై చైన్ సైబర్ దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. LiteLLM టూల్ ద్వారా 2,500 కి పైగా కంపెనీల రహస్య క్లౌడ్ డేటా, కీలు ఎలా లీక్ అయ్యాయో చూడండి.
ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ ఇప్పుడు హౌస్ ఆఫ్ ఏసర్గా అవతరిస్తోంది. ల్యాప్‌టాప్‌లకే పరిమితం కాకుండా అక్షయ్ కుమార్‌ను అంబాసిడర్‌గా పెట్టి గృహోపకరణాలు, లగేజ్, టీవీలు, స్మార్ట్ రింగ్స్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ గాజా క్యాపిటల్ ఐపీఓ చివరి రోజు నాటికి 2.52 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. జీఎమ్‌పి, లిస్టింగ్ గెయిన్స్, లాట్ సైజు మరియు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్ పూర్తి సమాచారం తెలుసుకోండి.
రంగారెడ్డి జిల్లా ఎమ్మార్వో దేశం శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ. 100 కోట్ల అక్రమాస్తులు వెలుగుచూశాయి. కేజీకి పైగా బంగారం, స్థలాలు, భవనాలు మరియు బార్‌లో పెట్టుబడులకు సంబంధించిన విస్తుపోయే నిజాలు ఈ కథనంలో చదవండి.
భారతదేశంలో ఇంటర్నెట్ సౌకర్యం లేని సుదూర గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తామని ఎలన్ మస్క్ హామీ ఇచ్చారు. 11 వేలకు పైగా గ్రామాల్లో 4G నెట్‌వర్క్ లేని పరిస్థితుల్లో, స్పేస్‌ఎక్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం మరియు భారతీయ నిబంధనల సవాళ్లపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై అప్లైడ్ ఏఐ స్టూడియో ఫౌండర్ బాల పన్నీర్ సెల్వం చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 17 కిలోమీటర్లకు 2 గంటల సమయం పడుతోందని, ఉద్యోగుల ప్రయాణ నరకంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టీటీడీకి నెయ్యి సరఫరా విషయంలో సజ్జల తమ సంస్థ సంగం డెయిరీపై   అసత్య ఆరోపణలు చేశారంటూ 10 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేసింది. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు న్యాయస్థానంలో సంగం డెయిరీ యాజమాన్యం ఈ మేరకు  పిటిషన్ దాఖలు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.