ఈడీనా..బీజేపీ శాఖోప‌శాఖ‌?

Publish Date:Aug 5, 2022

Advertisement

గ‌తంలో సిబిఐని పంజ‌రంలో బంధించ‌బ‌డి, అయ్య‌వారి ప‌లుకుల‌నే ప‌లికే చిలుక అని ఏకంగా సుప్రీం కోర్టు పేర్కొన్న‌ది. స‌రిగ్గా ప‌దేళ్ల త‌ర్వాత స్వేచ్ఛ‌పొందిన ఆ చిలుక‌లు.. అదే కేంద్ర ఏజెన్సీ లు..సిబిఐ, ఈడీ, ఐటీ.. వాటి య‌జమానుల ప‌లుకులు ప‌ల‌క‌డ‌మేగాకుండా త‌మ య‌జ‌మాని ఆదేశాల‌ను తిర‌స్క‌ రించిన వారి భ‌ర‌తం ప‌డుతున్నాయి. దుర‌దృష్ట‌మేమంటే,  అవి వాటి ప్ర‌త్యేక‌త‌ల్ని కోల్పోయి రాజ‌కీయ అస్త్రాలుగా మారి, కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌ను మాత్ర‌మే రామాజ్ఞ‌లా పాటిస్తున్నాయి. 

కేంద్రం చేతిలో కీలుబొమ్మ‌ల్లా మారిన వాటిలో ఈడీ ఇటీవ‌ల బీజేపీకి బ్ర‌హ్మాస్త్రంలా మారింది. కాగా సిబిఐ త‌మ విచార‌ణ చేప‌ట్ట‌డానికి  ఇంకా రాష్ట్ర ప్ర‌భుత్వాల  అనుమ‌తిని  కోరాల్సివ‌స్తోంది. మ‌నీలాండ‌రింగ్ ప్రివెన్ష‌న్ చ‌ట్టం-2002 క్రింద ఈడీ ఆ చ‌ట్టం అమ‌లు విష‌యంలో స్ప‌ష్ట‌మైన విచార‌ణ చేప‌ట్ట‌డంలో అనేక అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అడ్డంకుల‌ను తొల‌గించింది. 2022 జులై  26న రాజ్య‌స‌భ‌లో ఒక  స‌భ్యుని ప్ర‌శ్న‌కు  ఆర్ధిక మంత్రి స‌మా ధానం చెబుతూ,  గ‌త ప్ర‌భుత్వంలో సుప్రీం కోర్టు 112 కేసులు చేప‌ట్టింద‌ని, 2014లో బీజీపే ప్ర‌భు త్వం వ‌చ్చిన  త‌ర్వాత  తొలి ఎనిమిదేళ్ల‌లో 3,010 కేసులు చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హ‌మ‌ని అన్నారు. 

భార‌త‌దేశంలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో కోర్టులో కేసు విచార‌ణ‌కంటే ముందే శిక్ష అమ‌లు జ‌రిగిపో తోవ‌డం స‌మ‌స్య‌ల‌కు ఒక స‌మాధానంగా క‌న‌ప‌డుతోంది.  అస‌లు కేసు విచార‌ణ కాల‌మే శిక్ష‌గా మార‌డ‌మే శిక్ష‌ల రేటు త‌గ్గ‌డానికి కార‌ణమ‌వుతోంది. నిత్యం కాక‌పోయినా, పాక్షికంగా చేప‌ట్టిన విచార‌ణ ఆధారంగా, వాస్త‌వాల‌ను స‌రిగా చూప‌లేక‌పోవ‌డం పైనా ఛార్జీషీటు ఆధార‌ప‌డి ఉంటోంది. ఈ ర‌కంగా ప్ర‌తిప‌క్షాల‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టానికి వీల‌వుతోంది. విచార‌ణ పూర్త‌య్యే స‌మ‌యానికే జ‌ర‌గా ల్సిన న‌ష్టం జ‌రిగిపోతోంది. 

ఇటీవ‌లి  మ‌హారాష్ట్రా రాజ‌కీయ ప‌రిణామాల్లో అనేక‌మంది ఎమ్మెల్యే లు, ఎంపీలు చాలామందిపై  ఈడీ ఛార్జీలు ఎదుర్కొంటున్నందువ‌ల్ల‌నే అవ‌త‌ల‌కి దాటేసేరు. అలాగే అనేకమంది ఎంపీలు కూడా ఈడీ చ‌ర్య ల ప‌ట్ల కాస్తంత భ‌య‌ప‌డ్డారు. అంతెందుకు, శివ‌సేన మాజీ ఎమ్మె ల్యే అర్జున్ ఖోట్క‌ర్ ఏకంగా  మీడియా స‌మావేశంలో క‌న్నీళ్ల‌ప‌ర్యంతమయ్యారు. కార‌ణం ఏక్ష‌ణాన్నయినా అరెస్టు చేస్తారేమోన‌ని, ఫ‌లితంగా త‌న కుటుంబం రోడ్డు మీద‌కి వ‌స్తుంద‌న్న భీతి ఆయ‌న్ను క‌ల‌వ‌ర పెట్టిం ది. ఆయ‌న ఆస్తులు ఈడీ లాగేసు కుంది. దీంతో  ప్ర‌త్య‌ర్ధికి  మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. 

ఈ సంఘ‌ట‌న‌ల దృష్ట్యా, ప్ర‌తీవారికి బీజేపీ నీడ‌లోకి చేర‌డ‌మే దాదాపు ప్ర‌తీవారికీ శ్రీ‌రామ‌ర‌క్ష‌గా మారింది. పార్టీ అయినా ఎవ‌ర‌యినా నియ‌మ నిబ‌ద్ధంగా ఉంటే రూలుకు క‌ట్టుబ‌డి వ్య‌వ‌హ‌రించి త‌న దారినే పోతుంటే ప్ర‌భుత్వ అధీనంలోని సంస్థ‌లు త‌ప్ప‌కుండా శిక్షిస్తున్నాయి. అదీ చ‌ట్ట‌బ‌ద్ధంగా కాదు, దాడు లు, వేధిం పులు, త‌ప్పుడు ఛార్జీల‌నే అస్త్రాల‌తోనే. మ‌హారాష్ట్ర‌లో రెబెల్స్ అధికార‌ప‌గ్గాలు చేప‌ట్ట‌డానికి బీజేపీ నీడ లోకి వెళ్లాయి. కానీ సంజ‌య్ రౌత్ మాత్రం కేంద్రం ఒడిగ‌డుతున్న దారుణ పాల‌న‌కు ఒగ్గేదే లేద‌న్నట్టు వ్య‌వహ‌రించి ఈడీ దాడికి, అరెస్టుకు గుర‌య్యారు. 

ఆస‌క్తిక‌రవిష‌య‌మేమంటే, బీజీపీ ప‌విత్ర నీడ‌లోకి వ‌చ్చిన‌వారికి వారి గ‌త త‌ప్పిదాల‌ను మాఫీ చేస్తోంది. వారిని స‌చ్ఛీలురుగానూ ప్ర‌క‌టించేస్తోంది. 2014 నుంచి క‌నీసం 609 రాజ‌కీయనాయ‌కుల‌ను వారి కుటుం బాల‌ను ల‌క్ష్యంగా పెట్టుకుని దాడి చేస్తున్నాయి. వీరిలో కేవ‌లం 39 మంది బీజేపీకి చెందిన‌వారు కాగా, 570 మంది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి చెందిన‌వారు. కాంగ్రెస్‌కి చెందిన‌వారు గ‌నుక బీజేపీ తీర్ధంపుచ్చుకుంటే ఈ దాడులు, కేసుల‌కు కొంత దూర‌మై ఊపిరిపీల్చుకోగ‌ల్గుతారు. అస‌లు ఈ దాడులు, కేసుల మోతా హ‌డా వుడి అంతా చిత్రంగా బీజేపీయేత‌ర పార్టీల పాల‌న‌లోని రాష్ట్రాలకే ప‌రిమితం కావ‌డం. ఇలా ఏక‌ప‌క్ష‌, క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా జ‌రుగుతున్న దాడులు క్ర‌మేపీ మ‌రింత ప‌క‌డ్బందీగా కొన‌సాగు తున్నాయి. 

ఇక ఇక్క‌డ స‌మ‌స్య‌ల్లా, 2018లో డైర‌క్ట‌ర్ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి  స‌ర్వీసును మ‌రో ఏడాది పొడిగిస్తే ఏ విధంగా  ప‌దవిలో నిల‌బ‌డ‌గ‌ల్గుతార‌న్న‌ది. వాస్త‌వానికి ఆయ‌న మ‌రో రెండు మూడు రోజుల్లో రిటైరు కానుం డ‌గా ప‌దవీ కాలాన్ని మ‌రో ఏడాది పొడిగించారు. అందుకు సంబంధించి ఆదేశాల‌ను సుప్రీంకోర్టు జారీ చేసింది. అన్నింటికంటే చిత్రమేమంటే ఈడీ చ‌ట్టం అమ‌లు విష‌యం  ఏమంటే, ఇడిసి ఐ నివేదిక బ‌య‌ట‌పెట్ట కుండానే రివ్యూకి ఆట్టే అవ‌కాశం ఉండ‌దు , చ‌ర్య‌లు వేగిరం చేయ‌వ‌చ్చు. ఈ ర‌క‌మైన కొత్త విధానంతో ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం చేకూరే అవ‌కాశాలే ఎక్కువ‌. అందువ‌ల్ల దీని విష‌యంలో విప‌క్షాలు చ‌ట్టం అమ‌లు గురించిన అంశాల్లో పున‌ర్విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతున్నారు. 

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం రూల్ ఆఫ్ లా  స్థానంలో రూల్ బై లా నే ఎక్కువ‌గా అనుస‌రిస్తున్న‌ది. రాజ‌కీయ నాయకులు, జ‌ర్న‌లిస్టులు, వ్యాపార‌స్తుల మీద బీజేపీ ప్ర‌భుత్వం క‌క్ష‌గ‌ట్టిన‌ట్టుగా వేటాడుతోంది. ఇక ప్ర‌తిప‌క్షాల మీద మ‌రింత విరుచుకుప‌డ‌డం, వేధించ‌డం చూస్తుంటే ఇదంతా దీనికి అంతం ఎప్పుడు దేవా అని ప్ర‌జ‌లు కూడా గోడు పెడుతున్నారు. ప్ర‌జాస్వామ్యం, అంతిమంగా మ‌న దేశం ఇందుకు పెను స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్న‌ది. దీన్ని గురించి పార్ల‌మెంటులో అస‌లు చ‌ర్చే లేక‌పోవ‌డం, ప్ర‌శ్నించే వారిని అణ‌చి వేయ‌డం, బాధ్యతా రాహిత్యం అన్నీ వెర‌సీ దేశంలో స్వేచ్ఛాస్వాతంత్య్రాల‌కు అవ‌కాశం లేకుండా పోతుంది. 

By
en-us Political News

  
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.