తెలంగాణ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్. ఆ పార్టీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ కు తగిలిన ఎదురుదెబ్బ నుంచి తేరుకోక ముందే రాష్ట్ర కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ కుమార్ రాజీనామా నిజంగా శరాఘాతమే. మాజీ మంత్రి దివంగత పీజేఆర్ తనయ విజయారెడ్డి ఇటీవల తెరాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో ఆమెకు వచ్చే ఎన్నికలలో ఖైరతాబాద్ టికెట్ ఇస్తామని పీసీసీ పెద్దలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారని భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్ కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
విజయారెడ్డి చేరికతో తనకు ఖైరతాబాద్ సీటు దక్కదన్న అనుమానంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన దాసోజు శ్రవణ్ పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గంలో చరుకుగా పని చేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకే దక్కుతుందని బావిస్తున్నారు.
అయితే విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరడం, ఆమెకే ఖైరతాబాద్ టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరగుతుండటంతో దాసోజు శ్రవణ్ కుమార్ మనస్తాపం చెంది పార్టీకి గుడ్ బై చెప్పారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. దాసోజు శ్రవణ్ కుమార్ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించారు.
ఆ తరువాత 2014లో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఆయనకు అధికార ప్రతినిథిగా సముచిత స్థానం ఇచ్చి గౌరవించింది. 2018లో ఖైరతాబాద్లో పోటీచేసి ఓడిపోయిన ఆయన ఈసారి ఎలాగైనా గెలవాలని క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారు. అయితే విజయారెడ్డి రాకతో తనకు టికెట్ దక్కే అవకాశం లేదన్న భావనతో కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. నేడో రేపో ఆయన కమలం గూటికి చేరుతారని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dasoju-resigns-to-congress-likely-to-join-bjp-39-141321.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.