మొయినాబాద్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు!

Publish Date:Mar 15, 2026

Advertisement

 

హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేయడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో కాల్పులు జరగడం, కొకైన్ స్వాధీనం కావడం సంచలనంగా మారింది. మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మార్చి 14 రాత్రి సుమారు 8 గంటల సమయంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం.డి. నయీముద్దీన్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. అజీజ్‌నగర్ గ్రామంలో ఉన్న వ్యాపారి పంజుగుల రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో కొందరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు మరియు భారీ మొత్తంలో మద్యం వినియోగిస్తూ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చింది. 

ఈ సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసిన ఎస్‌ఐ, NDPS చట్టం ప్రకారం అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి ప్రత్యేక బృందంతో ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. ఈగల్ (TGNAB) బృందం, షాద్‌నగర్ SOT, చేవెళ్ల పోలీస్ బృందాలు, క్లూస్ టీమ్ సభ్యులు మరియు రెండు అధికారిక సాక్షులతో కలిసి పోలీసులు రాత్రి సుమారు 9.40 గంటలకు ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే సిబ్బంది ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టి లోపలికి ప్రవేశించారు. ఈ సమయంలో పోలీసులు తమను పరిచయం చేసుకుని సోదాలు నిర్వహించనున్నట్లు ప్రకటించగా, ఫామ్‌హౌస్ లోపలి నుంచి ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తక్షణమే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ‘మేడ్ ఇన్ జర్మనీ’ అని ముద్రించిన .32 కాలిబర్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రివాల్వర్‌లో ఒక లైవ్ రౌండ్, ఒక ఖాళీ తూటా కవచం ఉండగా, అక్కడి నుంచి మరికొన్ని ఖాళీ తూటా కవర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మగా గుర్తించారు. అతని పక్కనే ఉన్న సిల్వేరి శరత్ కుమార్ వద్ద నుంచి మూడు ఖాళీ తూటా కవచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ పక్కన ఏర్పాటు చేసిన సోఫాల్లో కూర్చుని మద్యం సేవిస్తున్న మరో 9 మంది పురుషులు, ఒక మహిళను పోలీసులు గుర్తించారు. 

వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా శరత్ కుమార్ వద్ద చిన్న ప్యాకెట్‌లో కొకైన్ డ్రగ్ ఉన్నట్లు అతను స్వయంగా ఒప్పుకున్నాడు. ఈ పార్టీలో దొరికిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అయితే అందులో ఆరుగురికి మాత్రం పాజిటివ్ రాగా మరికొందరికి నెగటివ్ వచ్చింది. దీంతో పోలీసులు మరోసారి 11మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించగా మహేష్ కుమార్‌కు డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. 

అయితే మహేష్ కు మొదట నిర్వహించిన యూరిన్ టెస్ట్‌లో మాత్రం నెగిటివ్ వచ్చింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి మరోసారి బ్లడ్ టెస్ట్ నిర్వహించారు.ఈవిచారణలో భాగంగా యూరిన్ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. నీళ్లు కలపడం వల్లే యూరిన్ టెస్ట్‌లో డ్రగ్స్ నెగిటివ్‌గా వచ్చినట్లు తేల్చారు. బ్లడ్ టెస్ట్‌లో మాత్రం మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. వీకెండ్ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్‌లోని తన ఫామ్‌ హౌస్‌లో పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ పార్టీలో వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పోలీసులు సేకరించిన ఆధారాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, కౌశిక్ రవి ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పర్యటనకు వెళ్లిన సమయం లో ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతరం వాటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసు నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న ఏలూరు ఎంపీ పుత్త మహేష్ యాదవ్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనతో పాటు పుట్టా మధు, ప్రియాంక రెడ్డికి కూడా అధికారులు బెయిల్ ఇచ్చారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అవసర మైన న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత వారిని విడుదల చేశారు.
 

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.