వానళ్లు కురవాలి వానదేవుడా... అంటే కర్నాటకలోని ఓ గ్రామంలో వినూత్నంగా వరుణ దేవుడిని పూజించారు. ఆ గ్రామమంతా పెళ్లి సందడి నెలకొంది. పిల్లా, పెద్దా, ఆడా, మగా అందరూ కలిసి వరుణుడిని ప్రసన్నం చేసుకోవడానికి గార్ధభాలకు అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడలగి తాలూకా మున్యాళ గ్రామంలో ఈ అరుదైన వివాహం నిజంగానే జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామస్థులు గాడిదలకు ఘనంగా వివాహం జరిపించారు. ఈ ఆచారం ఆ గ్రామంలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని స్థానికులు చెప్పారు. ఆధునిక కాలంలోనూ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిర్వహించిన ఈ వినూత్న వివాహం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్గా మారింది.
గ్రామస్థులు మగ గాడిదకు కాంతేశ్, ఆడ గాడిదకు కస్తూరి అని పేర్లు పెట్టి, నిజమైన పెళ్లి వేడుకను తలపించేలా, ఇంకా చెప్పాలంటే తలదన్నేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. పెళ్లి వేడుకలో మహిళలు మంగళహారతులు పట్టగా, గ్రామ యువకులు డప్పుల చప్పుళ్లతో సందడి చేశారు. నవ దంపతులను ఆశీర్వదిస్తూ గ్రామస్థులు హర్షధ్వానాలు చేశారు.
వివాహం అనంతరం గ్రామానికి వచ్చిన అతిథులందరికీ ఘనంగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గాడిదల పెళ్లి ఊరేగింపు, సంప్రదాయ పద్ధతిలో జరిగిన తంతు అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో వర్షాలు సరిగా కురవక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పూర్వీకుల కాలం నుంచి వస్తున్న విశ్వాసం ప్రకారం గాడిదలకు వివాహం జరిపిస్తే వర్షదేవుడు ప్రసన్నమై మంచి వర్షాలు కురుస్తాయని నమ్మకం ఉందన్నారు. ఆ విశ్వాసంతోనే గ్రామ ప్రజలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/donkeys-marriage-in-karnataka-36-225222.html
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్లైన్లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.