మన్యంలో నేలలో అపార ఖనిజ సంపద.. గిరిజనుల బతుకులు మారేదెప్పుడు..!

Publish Date:Aug 10, 2026

Advertisement

 

మన్యం నేలలో నిధులు.. మారని మన్యం బిడ్డల రాత..!

కొండల్లో కోటానుకోట్ల విలువైన ఖనిజ సంపద... కాళ్ళ కిందే అపరిమితమైన బంగారు గని లాంటి బాక్సైట్ నిల్వలు..! కానీ, ఆ మట్టిపై తాతల ముత్తాతల నుంచి బతుకుతున్న గిరిజనుడి జీవితంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, ఇంకా అడవి తల్లి ఒడిలోనే పేదరికంతో, రోగాలతో, సరైన ఉపాధి లేక అలమటిస్తున్న మన్యం బిడ్డల కన్నీటి గాథ ఇది. అపరిమిత సంపద ఉన్న ప్రాంతంలో పుట్టి కూడా, దిక్కులేని బతుకులు ఈడుస్తున్న వారి స్థితిగతులు నేటికీ సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని పలు అంశాలపై తెలుగు వన్‌ ఎండీ కంఠమనేని రవిశంకర్, ఏపీ మాజీ గనుల డైరెక్టర్ డాక్టర్ వి.డీ రాజగోపాల్ మధ్య ఆసక్తికర విశ్లేషణ జరిగింది


దళారుల దోపిడీ నుంచి కట్టెల మోపుల వరకు... ఆరని ఆవేదనతరతరాలుగా కొండల్లో లభించే అటవీ ఉత్పత్తులను మోసుకొచ్చి వారపు సంతల్లో అమ్ముకోవడమే మన్యం ప్రజల ప్రధాన బతుకు దెరువు. గతంలో దళారులు ఆ అమాయక గిరిజనులను ఏ స్థాయిలో దోచుకున్నారో అందరికీ తెలిసిందే. పది రూపాయల విలువైన వస్తువును కేవలం పది పైసలకే కొట్టేసి, వారి రెక్కల కష్టాన్ని నట్టేట ముంచేవారు. ఆ తర్వాత గిరిజన సహకార సంస్థ (GCC) వంటివి అందుబాటులోకి వచ్చి కొంతవరకు మద్దతు ధర అందించినప్పటికీ, గిరిజనుల జీవితాల్లో రావాల్సిన పూర్తిస్థాయి ఆర్థిక విప్లవం ఇంకా రాలేదు. 

నేటికీ 70 ఏళ్ల వయసొచ్చిన పసితనం చావని తాతలు, అవ్వలు కొండల్లో కట్టెల మోపులు తలపై పెట్టుకుని కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ బతుకీడుస్తున్న దృశ్యాలు మన్యంలో గుండెలను పిండేస్తుంటాయి. మైనింగ్ భయాలు vs ప్రగతి అవకాశాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని బాక్సైట్ నిల్వలను సమర్థవంతంగా, పర్యావరణానికి భంగం వాటిల్లకుండా వినియోగిస్తే అక్కడ అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయి. మైనింగ్ అనగానే కేవలం పర్యావరణ విధ్వంసమనో, గిరిజనులను వెళ్లగొడతారనో భయపెట్టే రాజకీయాలే తప్ప... పర్యావరణ పరిరక్షణతో పాటు వారి బతుకుల్లో వెలుగులు నింపేలా ఆలోచించే నాయకత్వం కరువైంది.

బాక్సైట్ వంటి రా మెటీరియల్ ఆధారంగా స్థానికంగానే అల్యూమినియం కేబుళ్లు, విండో ప్యానెళ్లు, ఫాయిల్స్ తయారు చేసే సమగ్ర పరిశ్రమలను నెలకొల్పితే, మన గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి అక్కడే ఉపాధి కల్పించవచ్చు. అంతేకాకుండా, మైనింగ్ నిర్వహించే కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత (CSR) నిధులతో గిరిజన గూడేలలో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రులు నిర్మించవచ్చు. శారీరక కష్టం చేయలేని వయోవృద్ధులకు ప్రతి నెలా గౌరవప్రదమైన పెన్షన్లు అందించే వెసులుబాటు కలుగుతుంది. పర్యావరణ పరిరక్షణ  జల వనరులుమైనింగ్ పూర్తయిన తర్వాత రీఫారెస్టేషన్ (అడవుల పెంపకం) చేయడం  ఏర్పడే పెద్ద గుంతలను నీటి నిల్వ జలాశయాలుగా మార్చడం ద్వారా భూగర్భ జలాలను పునరుద్ధరించవచ్చు. 

గతంలో విజయనగరం ప్రాంతంలో అబాండన్డ్ మ్యాంగనీస్ గనుల్లో పడిఉన్న నీటిని పంపింగ్ చేసి పంట పొలాలకు అందించినట్లే, సరైన ప్రణాళిక ఉంటే మైనింగ్ తర్వాత ఏర్పడే జల వనరులను చుట్టుపక్కల వ్యవసాయానికి, తాగునీటికి వినియోగించుకోవచ్చు. మన్యం బిడ్డలు కేవలం ఎన్నికలప్పుడు వాడుకునే ఓటు బ్యాంకుగా మిగిలిపోకూడదు. అమాయక గిరిజనులకు నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో వివరించి, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూనే వారిని ప్రగతి బాట పట్టించాల్సిన బాధ్యత మన పాలకులు, సమాజంపై ఉంది. ఆ పచ్చటి కొండల వెనుక దాగివున్న సంపద ఫలితాలు మన్యం గూడేలలోని ప్రతీ ఇంట చిరునవ్వులు పూయించినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుంది. పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

 

 

AP Bauxite Mining, AP Tribal Development,  Agency Area Bauxite Wealth, AP Mineral Resources,
Tribal Livelihood AP, Tone News Intellectual Talks, Tribal CSR Funds, Visakhapatnam Agency Bauxite

By
en-us Political News

  
తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు..పోలీస్ బాస్ ఆగ్రహం..!
ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు..ఏపీలో మాయమవుతున్న పత్రికా స్వేచ్ఛ..!
పాతబస్తీలోని చారిత్రాత్మక అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవా ల్లో కీలక ఘట్టమైన ఘటం ఊరేగింపు సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
“హలో సార్.. మేడమ్.. మేము ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు తక్కువ వడ్డీకే భారీ లోన్ మంజూరైంది
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం
శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్‌ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఒకప్పుడు మావోయిస్టు లకు కంచుకోటగా, సేఫ్‌ షెల్టర్‌ జోన్‌గా ఉన్న కర్రెగు ట్టలు ఇప్పుడు తెలంగాణ పోలీసుల పటిష్ట భద్రతలోకి వచ్చాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో కంటతడి పెట్టిన హరీశ్ రావు..!
మద్యం మత్తులో ఇంజెక్షన్..! విద్యార్థిని ప్రాణాలు తీసిన ఆర్ఎంపీ..!
మద్యం మత్తులో కారు డ్రైవర్ భీభత్సం.. ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి..!
జేపీఎస్సీ పేపర్ లీక్ దుమారం.. విద్యార్థులపై పోలీసుల వాటర్ క్యాన్స్ ప్రయోగం..!
ళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన పనులలో ఇప్పుడు కదలిక రావడమే కాకుండా వేగం పుంజుకున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ, విశాఖ రైల్వే ప్రాజెక్టులు రెండూ కలిపి 21వేల 616 కోట్ల భారీ అంచనా వ్యయంతో, 84.63 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.
మీ స్మార్ట్‌ఫోన్ మరియు డిజిటల్ డేటాను హాకర్లు, డేటా చోరీ నుండి ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకోండి. నార్టన్, 1పాస్‌వర్డ్, ప్రొటాన్ మెయిల్ మరియు అథెంటికేటర్ యాప్‌లతో అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ గైడ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.