వాలంటీర్లకు వైసీపీ ఎసరు!

Publish Date:Jul 6, 2022

Advertisement

ప్రజలలో వ్యతిరేకత వైసీపీపై కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలపై కాదు వ్యతిరేకత అంతా వాలంటీర్లపైనే.. ఇదీ వైసీపీ నేతలు ఇప్పుడు ముక్తకంఠంతో చెబుతున్న మాట. మనం నియమించిన వాళ్లు వాలంటీర్లు ఇప్పుడు వారి వల్లే మనకు ఇబ్బంది ఎదురౌతోందనుకుంటే వాళ్లని తొలగించేద్దాం అదెంత సేపు అన్నదే ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్న మాట. పార్టీ ప్లీనరీలకు ముందు నిర్వహించిన జిల్లాల ప్లీనరీలలో నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇదే విషయం చెప్పారు.

పార్టీ బలోపేతం, పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇలా వేటి గురించీ జిల్లా ప్లీనరీలలో చర్చించలేదు. అందరూ వాలంటీర్లను ఆడిపోసుకోవడానికే పరిమితమయ్యారు. తానేటి వనిత, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు ఇలా మంత్రులందరిదీ దాదాపు ఒకటే మాట.. వాలంటీర్ల వల్ల మనం ప్రజలలో చులకన అవుతున్నాం. వారిని తొలగించేద్దాం అనే. ఎమ్మెల్యేలు, నాయకులూ కూడా వారికి వంత పాడారు. అదే సమయంలో వాలంటీర్లు అందరూ వైసీపీవారే అని కూడా అంటున్నారు. ఇదేం తిరకాసో అర్ధం కాక రాజకీయ పండితులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయమేమిటంటే...పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి ప్రతి విషయాన్నీ వాలంటీర్లకు అప్పగించిన జగన్ నియోజకవర్గాలలో, గ్రామాలలో, వార్డులలో వారిదే పెత్తనంగా మార్చేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ఆఖరికి మంత్రులు కూడా వారి వారి ఇలాకాలలో డమ్మీలుగా మారిపోయారు.

ప్రజలకు దూరమయ్యారు. ఏ పనీ చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వారిలో ఆందోళన, అలజడి ఆరంభమైంది. తమ వారి వద్ద తమ  పలుకుబడి చూపించుకోవాలంటే నెపం వాలంటీర్లపై నెట్టేయడమే మార్గమని భావిస్తున్నారు. వాలంటీర్లు వారికి ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుని వ్యవస్థలో జొరబడి అస్తవ్యస్తం చేసేశారని నిందిస్తున్నారు. వారిని తొలగించేద్దామనీ, ఆ తరువాత మనదే రాజ్యమని కింది స్థాయి క్యాడర్ కు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రజలకు ప్రజాప్రతినిధులకు వారధిగా ఉంటారన్న ఉద్దేశంతో జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ప్రజా ప్రతినిథులను డమ్మీలను చేసేలా మారిపోయిందన్న అసంతృప్తి వైసీపీ ఎమ్మెల్యేలలో చాల కాలంగా ఉంది. ఇంత కాలం లోపల్లోపల దాచుకున్న ఈ అసంతృప్తినీ, ఆగ్రహాన్నీ జిల్లా ప్లీనరీలలో ఒక్క సారిగా వెల్లగక్కేశారు. అసలే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత పార్టీలో అసంతృప్తులతోనే సమస్యలు ఎదుర్కొంటున్న పార్టీ అగ్ర నేతలకు ఇప్పుడు వాలంటీర్లపై ప్రజా ప్రతినిథుల ఆగ్రహం కొత్త తలనొప్పులను తీసుకువస్తోంది. వెరసి ఇది వాలంటీర్ల ఉద్యోగాలకు ఎసరు తీసుకువచ్చే వరకూ వెళ్లింది. ఇప్పటికే రెగ్యులరైజేషన్ విషయంలో అసంతృప్తితో ఉన్న వాలంటీర్లు ఇప్పుడు తొలగింపు అంటూ పార్టీ కొత్త పల్లవి ఎత్తుకోవడంతో రగిలిపోతున్నారు.

మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి కుటుంబం వైసీపీ వైపే ఉండేందుకు జగన్ వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు మొదటికే మోసం అన్నట్లుగా తయారైంది. ఇటు పార్టీ క్యాడర్ లోనూ.. అటు ప్రజలలోనూ వాలంటీర్లపై ఆగ్రహం పెల్లుబుకుతుండటం.. ఆ వ్యవస్థ వల్లే పార్టీ కేడర్ కు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోవడం.. ఇప్పుడు వారిని తొలగిస్తే మిగిలిన స్వల్ప వ్యవధిలో మళ్లీ నియోజకవర్గాల వారీగా, వార్డుల వారీగా, గ్రామాల వారీగా పథకాల లబ్ధిదారుల వద్దకు నేరుగా ప్రజా ప్రతినిథులను పంపి పథకాల ప్రచారంతో ఊదరగొట్టే సమయం లేకపోవడంతో వైసీపీలో ఆందోళన పెరుగుతోంది. ఏం చేయాలో తెలియక సభల్లో, సమావేశాల్లో వాలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని తొలగించేద్దామంటూ కేడర్ కు చెబుతూ పరిస్థితి మరింత దిగజారకుండా జాగ్రత్త పడుతున్నారు. 

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శుక్రవారం (ఏప్రిల్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయత జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది.
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.