జగన్ పార్టీలో అసంతృప్తి సెగలు?
Publish Date:May 24, 2012
Advertisement
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని అసంతృప్తి సెగలు కారుమేఘాల్లా కమ్మేస్తున్నాయి. అసలు తమ పార్టీ అధినేత జగన్మోహన రెడ్డిని కలవటానికి సాధ్యం కావటం లేదని కార్యకర్తలు బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ప్రచారవేళల్లో మినహా మిగతా సమయంలో తమకు ప్రవేశం ఉండదని వారు అంటున్నారు. ప్రత్యేకించి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే జగన్ ను కలవాలంటే అసాధ్యమని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని తన స్వగ్రామంలో కార్యక్రమానికి తనను రానీయలేదని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అలిగారు. ఆయన తన సొంతజిల్లా ప్రకాశం పార్టీ ఇన్ ఛార్జిగా వెళ్ళాలని ఆశపడ్డారు. పార్టీ అధికార ప్రతినిధినైన తనకే అవకాశాలు ఇవ్వక పొతే, మిగతా వారి పరిస్థితి ఏమిటని ఆయన అలిగారు. ఎమ్మెల్యే అయినా ఎంత పెద్దవాడైనా జగన్ ను కలవటం కుదరదని, ఆయన ఇంటి ప్రదానగేటుకు, గుమ్మానికి మధ్యలో ఉండిపోవాల్సిందేనని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేత (పేరు రాయొద్దని) తూర్పు గోదావరి జిల్లాలో చెప్పారు. అసలు గెలిచేపార్టీకి ఉండాల్సిన లక్షణాలే తమ అధినేతకు లేవన్న విమర్శలు వినిపించాయని ఆయన అంటున్నారు. అయితే మాస్ గేధరింగ్ బాగున్నందున తామంతా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో ఉండిపోతున్నామని, లక్షలు ఖర్చు పెట్టినా ఆ పార్టీని విడవలేమని తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నియోజకవర్గానికి సమీపంలోని ఓ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే 'తెలుగువన్.కామ్' ఎదుట అంగీకరించారు. అసంతృప్తి ఉన్నా అవకాశముందని సర్దుకుపోతామన్నారు. 2014 వరకూ అసంతృప్తి ఉన్నా పార్టీని ఏమీ చేయదని ఆయన చెప్పారు. ఇలా అసంతృప్తితోనే ఉన్న ఈ నేతలకు కొత్తగా ఓ సమాచారం అందింది. అదేమిటంటే ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరికీ వారె సొంతఖర్చులతో గెలవాలని దాని సారాంశం. దీంతో ఈ నేత కూడా డంగైపోయి ఇంకా జగన్ వెనుక ఉండి ఏమి ప్రయోజనమని తిరిగి ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన సొంత ఖర్చుతో పార్టీ తరపున గెలవాలని ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలుసుకుని ఆ నట అసంతృప్తితో గుటకలు మింగారు. అలానే ఈ పార్టీకి వేదికలు కల్పించినవారూ, నేతలుగా ఉన్నవారూ కూడా అసంతృప్తిని బయటపడకుండా జాగ్రత్తగా నటిస్తున్నారని పరిశీలనలో తేలింది.
http://www.teluguone.com/news/content/disgrace-in-ysr-congress-party-24-14265.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





