క్రెడిట్ కోసం ఉబలాటం.. పలుచనౌతున్న జగన్ ప్రతిష్ఠ!

Publish Date:Mar 26, 2026

Advertisement

ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు సరికదా.. అప్పటికే ఉన్న పరిశ్రమలను తరిమేసింది. జగన్ హయాంలో ఏపీలో పెట్టుబడులు అన్న మాట ఎత్తడానికే పారిశ్రామిక వేత్తలు భయపడ్డారు. అభివృద్ధి అన్న మాటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏపీలో ఎక్కడా వినిపించలేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి జగన్ సాధించిందేమిటయ్యా అంటే ఎవరైనా సరే జీరో అనే చెబుతారు. 

2014 నుంచి 2019 వరకూ ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కొరియాకు చెందిన ఆటోమెబైల్ దిగ్గజ కంపెనీ కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో భారీ పెట్టుబడితో తన కార్ల తయారీ కంపెనీని స్థాపించింది. అప్పట్లో కియాదే దేశంలోకెల్లా అత్యంత భారీ విదేశీ పెట్టుబడి. జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లో   కియా జగన్ అస్తవ్యస్థ విధానాలకు విసిగి ఏపీనుంచి తరలిపోవాలని నిర్ణయించుకుందన్న వార్తలు వినిపించాయి. ఒక వైసీపీ ఎంపీ అయితే బహిరంగంగా కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ ను బెదిరించడం కనిపించింది. అయితే కియా విషయంలో  ప్రజల నుంచి వైసీపీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వైసీపీ వెనకడుగు వేసింది. దీంతో కియా రాష్ట్రంలో కొనసాగింది. అయితే కియా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కారణం చంద్రబాబు కాదనీ, ఆ క్రెడిట్ మొత్తం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదనీ వైసీపీ క్లెయిమ్ చేసుకుంది. ఎప్పుడో వైఎస్ రాజశేఖరరెడ్డి రాసిన లేఖ కారణంగానే కియా ఏపీలో పెట్టుబడులు పెట్టిందని జగన్ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన బుగ్గన రాజేంధ్రనాథ్ క్రెడిట్ మొత్తం జగన్ కు కట్టబెట్టేయడానికి ప్రయత్నించారు.

అలాగే.. టీసీఎస్ విశాఖలో బ్రాంచి ఏర్పాటు చేయనున్నదనీ, దీని ద్వారా ప్రత్యక్షంగా పది వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయనీ నారా లోకేష్ ప్రకటించారు.లోకేష్ ఇలా ప్రకటించారో లేదో.. అలా వైసీపీ టీసీఎస్ రాష్ట్రానికి రావడానికి క్రెడిట్ జగన్ దే అంటూ ప్రచారం మొదలెట్టేసింది. ఇందు కోసం కొన్ని పేపర్ కట్టింగులు, వైబ్ సైట్ లింకులను సొంత సామాజిక మాధ్యమంలో సర్క్యులేట్ చేసి   జగన్ సర్కార్ ఎప్పుడో 2020లోనే టీసీఎస్ ను విశాఖకు తీసుకువచ్చిందనీ, ఆ ఘనత అంతా జగన్ దే అంటూ భజన చేసుకుంది.  వాస్తవానికి జగన్  హయాంలో  టీసీఎస్ విశాఖలో తన బ్రాంచ్ ప్రారం భిస్తున్నట్లు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అలాగే అప్పట్లో జగన్ సర్కార్ టీసీఎస్ కు ఇస్తున్న ఇన్సెంటివ్ ల గురించి కానీ, కేటాయిస్తున్న భూమి గురించి కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే  టీసీఎస్ విశాఖలో బ్రాంచిని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనా వెలువడింది. వాస్తవం ఇలా ఉంటే  జగన్ మాత్రం విశాఖకు టీసీఎస్ తన క్రెడిట్ అంటూ క్రిడిట్ చోరీకి నానా పాట్లూ పడ్డారు

అలా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. ప్రస్తత తెలుగుదేశం కూటమి సాధిస్తున్న విజయాలనూ, తీసుకువస్తున్న పరిశ్రమలనూ తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయాలన్న తాపత్రయంలో ఓ జోకర్ స్థాయికి దిగజారి పోతున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.  

కొద్ది నెలల క్రితం ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఒడిశాకు వెళ్లిపోతోంది.. చంద్రబాబు ఏపీకి వస్తుందంటూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారు అని ఎగతాళి చేసిన జగన్..  ఇప్పుడు అదే ప్లాంట్‌కు రాష్ట్రంలో శంకుస్థాపన జరగడంతో వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు. రాష్ట్రానికి అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంటును తీసుకువచ్చింది తానే అంటూ తన భుజాలను తానే చరిచేసుకుంటూ.. స్వోత్కర్షకు దిగారు.

 ఇందుకు సంబంధించి ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు చెప్పుకుంటున్న గొప్పలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఆయన మాటల్లోని డొల్ల తనాన్ని మరో సారి ప్రస్ఫుటంగా బయటపెడుతున్నాయి.  ఆయన పాత వీడియోలు, ప్రస్తుత వ్యాఖ్యలు కలిపి  నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆయన రాజకీయ పరిణితిపై సందేహాలు ముప్పిరిగొనేలా చేస్తున్నాయి.  

ఒక్క స్టీల్ ప్లాంట్ ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్  విషయంలోనే కాదు..   అనేక అంశాల్లో క్రెడిట్ కోసం జగన్ ఉబలాటం నవ్వుల పాలైంది.   అసలాయన మాటలను సొంత పార్టీ నేతలూ, శ్రేణులకు నమ్మకం లేకుండా పోయింది.   ప్రతి విషయంలోనూ క్రెడిట్  తన ఖాతాలో వేసుకోవడం కోసం ఆయన పడుతున్న పాట్లు, చేస్తున్న వాదనలు ఆయన ప్రతిష్ఠను ప్రజలలో చులకన చేస్తున్నాయి.   

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
బడి పిల్లలను శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తూ ప్రవచన కర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.