Publish Date:May 13, 2026
ప్రజాస్వామ్యం వచ్చింది...
పాలకుండలాంటి ఓటు హక్కును తెచ్చింది.
ఎన్నికలు వచ్చాయి...
రంగురంగుల జెండాలు,
వేర్వేరు అజెండాలతో రెపరెపలాడుతాయి.
అందరూ ఎన్నో కలలు చూపిస్తూ,
“మీ ఆశలు నెరవేరుస్తాం” అంటూ
చేతులు జోడించి ఓటేయమంటారు.
తమ పార్టీ గుర్తును మరీ మరీ గుర్తుచేస్తారు.
ఎన్నికలు ముగిశాక...
అధికారమే పరమావధిగా,
కొంతమంది జెండాలు మార్చడం
నిత్యం జరిగే రాజకీయ సత్యమైపోయింది.
ఇలా సాగుతున్న ఈ రాజకీయ రంకుకు
చరమగీతం పాడాలని
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది
రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం.
కానీ ఆ చట్టానికే ఎన్ని చిల్లులు!
జెండాలు మార్చి, అజెండాలు మార్చుకున్న నాయకుల
సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం మాత్రం
ఎన్నికల కమిషన్కు ఇవ్వలేదు.
అధికార పార్టీ శిబిరం నుంచే వచ్చిన
సభాపతికే అప్పగించారు.
పాపం... వారి పదవి కూడా
ఆ పార్టీ భిక్షే కదా!
తమ నాయకుడి మాటకు వ్యతిరేకంగా
నిష్పాక్షికంగా చర్యలు తీసుకునే
సభాపతులు మన చట్టసభల్లో ఎంతమంది?
అందుకే “ఆయారాం గయారాం”ల ఆట
ఇప్పటికీ ఆగలేదు.
చట్టాలు చేసే చట్టసభలే
తమ చట్టాలకు ఇన్ని చిల్లులు పెడితే,
ఆ పాలకుండలోని పాలు నిలుస్తాయా?
ఎవరు వీరిని నిలదీయాలి?
పార్టీలకు కొమ్ముకాసే మీడియానా?
ఈ చోద్యం చూస్తూ మౌనంగా ఉండే విద్యావంతులా?
గుక్కెడు సారాకో,
ఎన్నికల ప్రలోభాలకో లొంగిపోయే ఓటరా?
ఎవరైనా సరే...
ఆ పిల్లి మెడలో గంట కట్టే ఎలుక కావాలి.
ఫిరాయింపుల నిరోధక చట్టం
ఇప్పుడొక అందమైన చిల్లుల జల్లెడలా మారింది.
అది నిజంగా పాలకుండలా నిలదొక్కుకోవాలంటే,
ఆ పెత్తనం ఎన్నికల కమిషన్ చేతుల్లో పెట్టాలి.
— డా. వి.డి. రాజగోపాల్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/democracy-36-219697.html
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే