బీజేపీతో జగన్ చీకటి ఒప్పందం.. CPI నారాయణ

Publish Date:Mar 31, 2023

Advertisement

ఇంత కాలం కేంద్ర దర్యాప్తు సంస్థలే కేంద్రం పంజరంలో చిలుకగా మారిపోయాయని అనుకున్నాం. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏకంగా ప్రాంతీయ పార్టీలనే బంధిత పార్టీలు (captive parties)గా మార్చేసుకుందా? అంటే ఔననే అంటున్నారు సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంటూ జగన్ నేతృత్వంలోని వీసీపీని చూసిప్తున్నారు. ఔను ఆయన వైసీపీ, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో తరహా ఒప్పందం జరిగిందని గట్టిగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా జరిగిన పరిణామాలు.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పక్షం రోజుల వ్యవధిలో ఏపీ సీఎం జగన్ రెండు మార్లు హస్తినకేగి రావడం వెనుక ఉన్నది ఈ ఒప్పందమేనని నారాయణ చెబుతున్నారు.

ఇంతకూ ఆ ఒప్పందం ఏమిటి అంటే.. జగన్ అక్రమాస్తుల కేసు.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపునకు లింకు పెట్టే ఒప్పందమని వివరంగా చెబుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వివేకా హత్య కేసు నుంచి జగన్ సన్నిహితులు, బంధువులను బయటపడేయాలంటే.. జగన్ తన అక్రమ సంపాదనను కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం కోసం ఖర్చు పెట్టాలన్నదే ఆ ఒప్పందం అని చెబుతున్నారు. అధికార వైసీపీ నారాయణ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించినా.. ఆ ఆరోపణలు వాస్తవమే అయి ఉండొచ్చన్న అనుమానాలు మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లోనూ, పరిశీలకులలోనూ కూడా వ్యక్తం అవుతున్నాయి. 

 మొదట వివేకా హత్య కేసు విషయానికి వస్తే.. ఈ కేసులో సీబీఐ విస్పష్టంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేయనున్నట్లు తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. ఇహనో ఇప్పుుడో వారిరువురూ అరెస్టు కావడం ఖాయమన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. అంతా నిజమేననుకున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే.. సిరికిం జెప్పడు అన్నట్లుగా జగన్ హడావుడిగా హస్తినకు వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీతో, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర అంశాలపైనే వారిరువురితో భేటీ అయినట్లు ప్రభుత్వం షరా మామూలు అన్నట్లుగా ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఈ నాలుగేళ్లలో ఇలాంటి భేటీలు ఎన్నో జరిగాయి. ప్రతి భేటీ సందర్భంగానూ ఇటువంటి ప్రకటనలే వెలువడ్డాయి.దీంతో వాటిని జనం నమ్మడం మానేశారు.

అయితే వివేకా హత్య కేసులో సీబీఐ  అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని చెప్పిన వెంటనే జగన్ హస్తిన వెళ్లారు. అంతే సీబీఐ అరెస్టు మాట ఏమైందో కానీ, ఆ కేసు అక్కడే ఆగిపోయింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పరాభవం, అలాగే వివేకా హత్య కేసులో అవినష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలు దరఖాస్తు, ఉపసంహరణల నేపథ్యంలో జగన్ మరోసారి హస్తిన వెళ్లారు. అంతే కాదు.. అర్ధరాత్రి హడావుడిగా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం చర్చ జరిగిందన్నది యథాప్రకారం బయటకు వెల్లడి కాలేదు. ఆ తరువాత మోడీతోనూ జగన్ బేటీ అయ్యారు. పనిలో పనిగా కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఇక్కడే సీపీఐ నారాయణ తన ఆరోపణలను పకడ్బందీగా ఎక్కుపెట్టారు. మోడీ, అమిత్ షా లతో మాత్రమే భేటీ అయితే రాజకీయ బేటీయే అన్నది నిర్ధారణ అయిపోతుందన్న అనుమానంతోనే మొక్కుబడి తంతుగా విత్త మంత్రిని కలిశారనీ, అయితే అసలు క్విడ్ ప్రోకో ఒప్పందం అమిత్ షాతో భేటీలోనే కుదిరిపోయిందనీ నారాయణ ఆరోపిస్తున్నారు.

కేసుల నుంచి జగన్ అండ్ కోను బయటపడేయడానికి ఆయన తన అక్రమ సంపాదనను కర్నాటకలో బీజేపీ విజయం కోసం ఖర్చుచేయాలన్నదే ఆ ఒప్పందమని నారాయణ అన్నారు. అందుకు ప్రతిగా వివేకా హత్య కేసులో జగన్ అండ్ కోకు ఇబ్బందులు రాకుండా కేంద్రంలోని బీజేపీ సహకరిస్తుందన్నదే ఆ ఒప్పందం అని నారాయణ ఆరోపించారు. ఏపీలో పరిస్థితులు, జగన్ బదనిక తరహాలో అప్పులు, కేసులు ఇలా ప్రతి విషయంలోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆధారపడి ఉండటం చూస్తుంటే.. నారాయణ ఆరోపణలు వాస్తవమేనని భావించాల్సి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.