దహీ వెర్సెస్ తయిర్‌.. తమిళనాట బీజేపీకి గడ్డు సమస్యే

Publish Date:Mar 31, 2023

Advertisement

తమిళుల భాషాభిమానం  గురించి  కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు.  తమిళ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ, మాతృ భాషకు అవమానం జరిగితే ఊరుకోరు. మాతృ భాషకు అవమానమనే కాదు, జాతీయ భాష హిందీ డామినేషన్  ను సైతం ఇసుమంతైనా  సహించరు. అలా తమిళ భాషకు ఏ చిన్న అవమానం జరిగినా వెంటనే తమిళ జనం రోడ్డు ఎక్కేస్తారు. రాజకీయాలకు అతీతంగా తమిళులంతా ఏకమైపోతారు. అసలు ద్రవిడ పార్టీల పుట్టుకకు హిందీ వ్యతిరేక ఆందోళనలే ప్రధాన కారణం.

1965లో హిందీని ఏకైక జాతీయ భాషగా ప్రకటిస్తూ,కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమిళనాడులో  సుమారు రెండు నెలలకు పైగా ఆందోళనలు జరిగాయి. సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. ప్రధాన మంత్రి లాల్‌ బహదూర్ శాస్త్రి హిందీ భాషేతర రాష్ట్రాలు కోరే వరకూ ఇంగ్లీష్‌ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీ ఇచ్చి తమిళులను శాతింప చేశారు.   అయినా ఆందోళనల ఫలితంగా తమిళనాడు రాష్ట్రం రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారి పోయింది.

ఆ తర్వాత 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంతవరకు తిరుగు లేని శక్తిగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడి పోయింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకే) గెలుపొందింది.  ఇక అంతే .. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ,  ఆమాట కొస్తే మరో జాతీయ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. 

ఇక ప్రస్తుతం లోకి వస్తే తమిళ నాడులో మరో మారు, తమిళ్ సెంటిమెంట్ రాజకీయ దుమారం రేపుతోంది.అయితే ప్రస్తుత వివాదానికి ‘దహీ’ (పెరుగు) కేంద్ర బిందువు.. కావడం విశేషం. తమిళనాడుతో పాటుగా ఎన్నికలు జరుగతున్న కర్ణాటకలోనూ ‘దహీ’ దావానలం రగులుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో డెయిరీ ఉత్పత్తులు విక్రయించే ఆహార విక్రయ సంస్థలు, ఇంతవరకు పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌ అనే ఇంగ్లీష్ పదంతో పాటు తైర్‌ (తమిళం), మొసరు (కన్నడం) అనే పదాలను కూడా ముద్రిస్తున్నాయి. అయితే, పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌కు బదులు ‘దహీ’ అనే పదాన్ని ప్రముఖంగా  ముద్రించాలనీ కర్డ్‌ అని గానీ, ఇతర ప్రాంతీయ భాషల్లోని పేర్లను గానీ ‘దహీ’ పక్కన బ్రాకెట్‌లో ముద్రించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ) మార్చి 10న ఆదేశించింది.  ‘కర్ణాటక కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌), బెంగళూరు రూరల్‌ అండ్‌ రామనగర డిస్ట్రిక్ట్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ సొసైటీస్‌ యూనియన్‌ లిమిటెడ్‌, తమిళనాడు కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌, హట్సన్‌ అగ్రో ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తమిళనాట ఆవిన్‌ అనే బ్రాండ్‌ పేరుతో పెరుగును, ఇతర పాల ఉత్పత్తులను విక్రయించే ‘తమిళనాడు కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌’ ఈ ఆదేశాలను పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తాము విక్రయించే పెరుగు ప్యాకెట్లపై హిందీ పదమైన ‘దహీ’ని వాడబోమని.. తమిళ పదమైన ‘తైర్‌’నే ముద్రిస్తామని తేల్చిచెప్పింది.

దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా స్పందించారు. హిందీని బలవంతంగా రుద్దడంలో భాగంగానే ‘దహీ’ పదాన్ని పెరుగు ప్యాకెట్లపై తప్పనిసరిగా ముద్రించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని మండిపడ్డారు. అటు కన్నడనాట కూడా ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ఆదేశాలపై ప్రజాగ్రహం పెల్లుబికింది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా కేంద్రంపై వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు. కర్ణాటక కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ విక్రయించే నందిని బ్రాండ్‌ పాల ఉత్పత్తుల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.‘‘నందినీ బ్రాండ్‌ కన్నడిగుల ఆస్తి. అది కన్నడిగుల గుర్తింపు. కన్నడిగుల జీవరేఖ.. హిందీని బలవంతంగా రుద్దడాన్ని కన్నడిగులు తీవ్రంగా వ్యతిరేకిస్తారని తెలిసి కూడా నందిని బ్రాండ్‌ పెరుగు ప్యాకెట్లపై హిందీ పదమైన దహీని వాడాలంటూ ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ కేఎంఎ్‌ఫకు ఆదేశాలివ్వడం తప్పు’’ అని కుమారస్వామి మండిపడ్డారు. ‘దహీ’  అనేది హిందీ పదం కాదని, సంస్కృతం నుంచి వచ్చిన పదమని, దాని అర్థం పాల ఉత్పత్తి అని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినా నిరసనలు చల్లారలేదు.దీంతో, ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ తన పాత నిబంధనలను సడలించింది.

ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు విక్రయించే పెరుగు ప్యాకెట్లపై ‘కర్డ్‌’ అని ఆంగ్లంలో ముద్రించి, దాని పక్కన ప్రాంతీయ భాషా పదం (పెరుగు/తైర్‌/మొసరు/దహీ వంటివి) కూడా చేర్చుకోవచ్చని స్పష్టం చేసింది.  అయినా కూడా దహి వివాదం బీజేపీకి తమిళనాడులో చేయగలిగినంత నష్టం ఇప్పటికే చేసేసిందని చెప్పాలి. 

 తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఇందుకు బాధ్యులైన వారిని (కేంద్రాన్ని) శాశ్వతంగా బహిష్కరిస్తామని హెచ్చరించారు.  మరో వంక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దహి  నిర్ణయాన్ని తప్పుపట్టారు.   ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలనే ప్రధాని మోదీ విధానాలకు ఇది విరుద్దంగా ఉందని వ్యాఖ్యానించారు.. అయినా పేస్ బుక్ లో మిత్రులు కొందరు సూచించిన విధంగా పెరుగు ప్యాకెట్‌ మీద ఇంగ్లీష్‌, తమిళ్‌, హిందీ మాత్రమే ఎందుకు ఉండాలి. ఏ రాష్ట్రంలో అయినా అమ్మకునేందుకు వీలుగా భారతీయ భాషలన్నింటిలో రాయాలని FSSAI ఆదేశించి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. 

By
en-us Political News

  
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.