అమరావతి రైతుల చలో అరసవల్లి

Publish Date:Mar 31, 2023

Advertisement

అమరావతి రైతులు.. మళ్లీ అరసవల్లి యాత్రకు బయలుదేరనున్నారు.  శనివారం (ఏప్రిల్ 1 ప్రత్యేక బస్సుల్లో రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు అరసవల్లికి బయలుదేరుతున్నారు.  ఆ క్రమంలో రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన పాదయాత్రలో వెంట తీసుకు వెళ్లిన శ్రీవారి రథానికి  ప్రత్యేక పూజలు   నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా రాజధాని రైతులు సింహాచలం, అన్నవరం, శ్రీకూర్మం, చిన్న తిరుపతి ఆలయాలను కూడా దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకోనున్నారు. 

 వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించడం.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేపట్టిన నిరసనలు, ఆందోళనలు.. రేపటికి1200వ రోజుకు చేరుకుంటాయి.  అమరావతి రైతులు.. గత ఏడాది సెప్టెంబర్ 13న అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. ఆ క్రమంలో అక్టోబరు 20వ తేదీ వరకు చెదురుమదురు ఘటనలు మినహా పాదయాత్ర సజావుగానే కొనసాగింది. కానీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం  పసలపూడి వద్ద రైతులు చేస్తున్న  పాదయాత్రను పోలీసులు అడ్డుకొని... గుర్తింపు కార్డులు ఉన్నవారు మాత్రమే ఈ యాత్రలో పాల్గొన్నాలని సూచించారు.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం హైకోర్టులో తేల్చుకుంటామంటూ రాజధాని రైతులు ..  పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. దాంతో ఈ పాదయాత్రపై అటు ప్రభుత్వం, ఇటు అమరావతి రైతులు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే రైతుల చేపట్టిన పాదయాత్రను నిలిపి వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. 

కానీ ఈ పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని సూచించింది. గుర్తింపు కార్డులు కచ్చితంగా కలిగి ఉండాలని.. అలాగే రైతులు చేపట్టిన పాదయాత్రకు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలపవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ షరతులను ఏ మాత్రం ఉల్లంఘించరాదంటూ రైతులకు సూచించింది. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తామని రైతులు ప్రకటించినా... అది ఎందుకో కుదరలేదు. 

అయితే ఈ ఏడాది జనవరిలో అమరావతి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు.. ఈ పాదయాత్ర నిలిచిపోయిన రామచంద్రాపురం నియోజకవర్గంలోని పసలపూడి నుంచి తిరిగి పాదయాత్ర చేపట్టి.. అరసవల్లి చేరుకుని.. స్వామి వారిని దర్శించుకొని   పాదయాత్ర పూర్తి చేశారు.  

మరోవైపు ఇదే రాజధాని రైతులు గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పుడు కూడా జగన్ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే.. రైతులు హైకోర్టుకు వెళ్లి..   అనుమతులు తెచ్చుకొన్నారు. పాదయాత్ర పూర్తి చేశారు. అనంతరం తిరుపతిలో భారీ బహిరంగ సభను  నిర్వహించారు. అయితే మూడు రాజధానులకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు, ఆందోళనలు, పాదయాత్రలకు అధికార వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.

By
en-us Political News

  
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌, గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.
సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.