ఓటమెరుగని నేత ఇప్పుడు నిజంగానే సన్యాసం తీసుకోబోతున్నారా?

Publish Date:Oct 11, 2019

Advertisement

 

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పరుచూరు నియోజకవర్గంలో తిరుగులేని నేత. నిన్నటి వరకూ ఓటమెరుగని నేతగా ఉన్న దగ్గుబాటి మొన్నటి ఎన్నికల్లో తొలి సారి ఓడిపోయారు. వైసిపి అధికారంలోకి రావడంతో పరుచూరు నియోజకవర్గ ఇన్ చార్జి గా కొనసాగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను తనదైన శైలిలో ముందుకు తీసుకు పోతున్నారు. అవినీతి మరక అంటని నేత అయిన దగ్గుబాటికి ఇప్పుడు ఓ సమస్యొచ్చి పడింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన రాజకీయాల్లో కొనసాగే విషయం పై చాలాసార్లు తర్జన భర్జన పడ్డారు అని తెలుస్తోంది.ముప్పై అయిదేళ్లుగా తిరుగులేని నేతగా ఉన్న ఆ సీనియర్ నేతకు సమస్యొచ్చిపడింది. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటికే ఓసారి రాజకీయ సన్యాసం చేసిన ఆయన మరోసారి అదే అస్త్రం ప్రయోగించ పోతున్నారా లేక వారసుడి  కోసం సర్ధుకుపోతారా అనే అంశం పై చర్చ కొనసాగుతోంది.

ఇటీవల నియోజక వర్గ రాజకీయ సమీకరణాల కూడా మారాయి. దగ్గుబాటికి తెలీకుండా పార్టీ నిర్ణయాలు జరగడంతో ఆయన మనస్తాపం చెందారని సమాచారం. అయితే పార్టీ అధిష్టానం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జోక్యంతో కొన్ని వివాదాలు అక్కడితో సర్ధుమనిగాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ తో దగ్గుబాటి ఇటీవల భేటీ అయ్యారు. ఆయన నియోజక వర్గ సమస్య లతో పాటు తన మనసులో మాట ఆయన ముందు పెట్టారు.భర్త ఒక పార్టీ భార్య ఒక పార్టీలో ఉండడంతో రాజకీయంగా సమస్యలొస్తున్నాయి. పురంధేశ్వరి ఇటీవల కాలంలో వైసిపి సర్కార్ పై విమర్శలు చేశారు. దీంతో దగ్గుపాటి టార్గెట్ గా మారారు. ఆయనపై పార్టీ నేతలే విమర్శ లు చేయడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో కూడా సమస్య లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. 

తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తన కొడుకు హితేష్ రాజకీయాల్లో కొనసాగుతారని జగన్ తో భేటీలో దగ్గుబాటి తన భావాన్ని వెల్లడించారు. అయితే జగన్ మాత్రం దగ్గుబాటికి సర్దిచెప్పారట. ఇప్పటి కిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సమాధానమిచ్చారు జగన్. దగ్గుపాటి వెంకటేశ్వరావు ఇప్పటికే  ఒకసారి రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా కొడుకు హితేష్ కు పౌరసత్వం సమస్య రావడంతో దగ్గుబాటి రంగంలోకి దిగారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోగా తాజా రాజకీయ పరిణామాలతో మరోసారి దగ్గుబాటి రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం. మొత్తానికీ దగ్గుబాటి పాలిటిక్స్ కు దూరంగా జరగడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. త్వరలోనే దగ్గుపాటి పరుచూరు లో అనుచరులు అభిమాను లతో సమావేశం కాబోతున్నారని తెలుస్తుంది. ఈ మీటింగ్ లో దగ్గుబాటి తన రాజకీయ సన్యాసంపై ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకీ పురందేశ్వరి రాజీనామా చేసే అవకాశం అవసరం లేదు. దీంతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందన్న భావనలో దగ్గుబాటి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక రాజకీయాల్లో దగ్గుబాటి కనిపించే అవకాశాలు తక్కువ అని సమాచారం. ఇక ఈ ఇంటి రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయో వేచి చూడాలి.

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.