కేసీఆర్ కి నిరసనలు, బాబుకి సహకారం

Publish Date:Jun 12, 2014

Advertisement

 

ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులిరువురూ కూడా వ్యవసాయ రుణాల మాఫీ వ్యవహారంలో చిక్కుకొని పైకి చెప్పుకోలేని ఇబ్బంది అనుభవిస్తున్నారు. అయితే తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉంది గనుక ఈవిషయంలో చంద్రబాబుతో పోలిస్తే కేసీఆర్ పరిస్థితే కొంచెం మెరుగుగా ఉందని అర్ధమవుతోంది. అయితే అది వ్యవసాయ రుణాలన్నిటినీ తీర్చేసేంత లేదు గనుక ఆయన చిన్న మెలికపెట్టారు. దానితో తెరాస ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అప్పుడే తెలంగాణాలో నిరసనలు మొదలయ్యాయి.

 

చంద్రబాబు కూడా వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపైనే తొలి సంతకం పెట్టినప్పటికీ, ఆయన చాల తెలివిగా దానికి ఒక కమిటీని వేసి, దానికో 45 రోజులు గడువుపెట్టి తనకు సమయం ఏర్పాటు చేసుకొన్నారు. అంటే ఈవిషయంలో కేసీఆర్ కంటే చంద్రబాబే చాలా లౌక్యం ప్రదర్శించినట్లు అర్ధమవుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి వ్యవసాయ రుణాలపై తన నిర్ణయం ప్రకటించి ప్రజల నుండి నిరసనలు ఎదుర్కొంటుంటే, చంద్రబాబు 45రోజుల గడువు తీసుకొన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రైతులు ఎటువంటి నిరసన తెలుపకపోవడం విశేషం.

 

ఎందువలన అంటే, ఇంతవరకు ఆంద్ర పాలకులు, రాజకీయ నేతలు తెలంగాణా ప్రజలను దోచుకొన్నారని, తెలంగాణా ఏర్పడితే ఇక సమస్యలన్నీ మంత్రదండం వేసినట్లు మాయమయిపోతాయని కేసీఆర్ తెలంగాణా ప్రజలకు బాగా నచ్చ జెప్పగలిగారు. ఇప్పుడు కేసీఆరే స్వయంగా పాలిస్తున్నారు గనుక, ఇక ఆంద్ర వాళ్ళను నిందించదానికి అవకాశం లేదు. మంచయినా చెడయినా బాధ్యత కేసీఆర్ దే అవుతుంది. అందుకే ఆయన నిరసనలు ఎదుర్కోవలసి వస్తోంది.

 

ఇక చంద్రబాబు విషయానికి వస్తే, ఆయన రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఫైలుపై సంతకం కూడా చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి గురించి అందరికీ తెలుసు గనుక, ఆయనేదో మంత్రం దండం తిప్పేసి రాత్రికి రాత్రే వేల కోట్ల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేసేస్తారని ఎవరూ అత్యాశకు పోలేదు. అందువలన ఈ విషయంలో అయన కూడా తప్పకుండా ఏదో ఒక మెలిక పెట్టవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత మాఫీ చేసి తమను రుణభారం నుండి విముక్తులను చేస్తారనే ఆశ రైతులలో ఇంకా మినుకు మినుకు మంటూనే ఉంది.

 

సంపద సృష్టించడంలో ఆయనకున్న అనుభవం, కార్యదక్షత, ప్రధాని మోడీ, మరియు కేంద్రమంత్రులందరితో ఆయనకున్న సత్సంబంధాలు, ఆకారణంగా మోడీతో సహా అందరూ కూడా రాష్ట్రాన్ని అదుకొంటామని ప్రజా సమక్షంగా పదేపదే భరోసా ఇవ్వడం వంటి అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రైతన్నల ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి. అందుకే ఒక్క ప్రతిపక్ష పార్టీలు తప్ప మరెవరూ నిరసనలు తెలియజేయలేదు. అయితే ఆయన స్వయంగా 45రోజులు గడువు విధించుకొన్నారు గనుక అంతవరకు ఆయనకు తాత్కాలిక ఉపశమనంగానే భావించవచ్చును. అప్పటికి ఆయన ఏదో విధంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొ౦నవలసి ఉంటుంది. లేకుంటే ఆయన కూడా కేసీఆర్ లాగే విమర్శలు ఎదుర్కోవడం తధ్యం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.