డీలిమిటైజేషన్ కలిపింది ఇద్దరినీ..!

Publish Date:Mar 14, 2025

Advertisement

తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పు, నిప్పు వంటి వారు. విమర్శల స్థాయిని వారిరువురూ దూషణల స్థాయికి దిగజార్చేశారు. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటూ ఉంటారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో సై అంటే సై అని తలపడుతుంటారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటే.. కేసీఆర్ విపక్షంలో ఉన్నారు. వీరిద్దరూ ఒకే మాట మాట్లాడటం అన్నది.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏ విషయంలోనైనా ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం అన్నది ఇప్పటి వరకూ జరగలేదు. అసలలాటిం సందర్భం ఒకటి వస్తుందన్న ఊహ కూడా రాజకీయవర్గాలలోనే కాదు, సామాన్య జనంలో కూడా రాలేదు.  రేవంత్, కేసీఆర్ మధ్య మాటలయుద్ధం జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ మర్యాదలకు కూడా తిలోదకాలిచ్చి వారు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటుంటారు. 

అయితే అనూహ్యంగా ఆ ఇరువురి నోటీ ఒకే మాట వచ్చింది. ఏదో సినిమాలో నువ్వాదరిని.. నేనీ దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అన్న పాటను స్ఫురింపచేసేలే.. నిప్పూ ఉప్పులా చెరో వైపూ ఉండే రేవంత్ రెడ్డి, కేసీఆర్ లను నియోజకవర్గాల పునర్విభజన అంశం ఏకతాటిపైకి తెచ్చింది. ఔను డీలిమిటైజేషన్ ను వ్యతిరేకించే విషయంలో ఇరువురి నోటా ఒకే మాట వచ్చింది.  కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించే విషయంలో ఇరువురి నోటీ ఒకే మాట వినిపిస్తోంది.  

జనాభా ప్రాతిపదికగా మాత్రమే జరిగే డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నచర్చ జోరుగా సాగుతోంది. ముందుగా ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిరసన గళం ఎత్తారు.  జనాభా ప్రాతిపదికగా జరిగే డీలిమిషేషన్ తో పెరిగే సీట్లన్నీ ఉత్తరాదిలోనే పెరుగుతాయనీ, దక్షిణాదిలో నామమాత్రంగా సీట్లు పెరగడమో… లేదంటే అసలు సీట్లే పెరగకపోవడమో.. ఇంకా చెప్పాలంటే సీట్ల సంఖ్య  తగ్గిపోవడమో జరుగుతుందన్న ఆందోళనను డీఎంకే వ్యక్తం చేసింది.  దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగడానికి దోహదం చేసింది. అంతే కాకుండా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో ఈ నెల 22న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

చెన్నై వేదికగా జరగనున్న ఈ సమావేశానికి రావాలంటూ ఇప్పటికే తెలంగాణలోని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లకు డీఎంకే  ఆహ్వానించింది. రేవంత్, కేటీఆర్ ఇద్దరూ కూడా ఈ సమావేశాన్నిస్వాగతించారు. హాజరవ్వడానికి అంగీకరించారు.   డీఎంకేతో కాంగ్రెస్   పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అటువంటిది డీఎంకే సమావేశానికి హాజరౌతామని కేటీఆర్ అంగీకరించడం విశేషమేనని పరిశీలకులు అంటున్నారు. అదీ కాక రేవంత్, కేటీఆర్ లు ఇద్దరూ ఈ సమావేశానికి హాజరు కానుండటం రాజకీయవర్గాలలో ఆసక్తి రేకెత్తించింది.  మొత్తం మీద రేవంత్, కేటీఆర్ ల నోట ఏ విషయంలోనైనా సరే ఏకాభిప్రాయం వ్యక్తం కావడం ఇదే మొదటి సారి అని కూడా అంటున్నారు. చెన్నై వేదికగా జరిగే అఖిలపక్ష సమావేశంలో ఇరువురూ ఒకే వేదిక పంచుకుంటే అది రాజకీయంగా ఒక గొప్ప విశేషంగానే చెప్పుకోవలసి ఉంటుంది. చూడాలి మరి.. రేవంత్ కేసీఆర్ లు ఆ సమావేశానికి స్వయంగా హాజరౌతారో తమతమ పార్టీల తరఫున ప్రతినిధులను పంపుతారో. 

By
en-us Political News

  
గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎందుకు రాజీనామా చేశారు ? అవిశ్వాస పోరాటంలో తాను నెగ్గలేనని మనోహర్ కి ముందే తెలిసిపోయిందా? పోరాడి ఓడిపోవడం కంటే ముందే పక్కకు తప్పుకోవడం బెటర్ అనుకున్నారా? సొంత పార్టీ నాయకులు కనీసం తనకు మద్దతు పలకడం లేదన్న అంతర్మథనం మనోహర్ తో రాజీనామా చేయించిందా? గుంటూరులో మేయర్ రాజీనామాతో, జరగబోతున్న నష్టం ఎవరికి?
సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు.ఆలాంటి వారి విష‌యంలో సీరియ‌స్‌ యాక్ష‌న్ తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జాప్ర‌తినిధులు త‌ప్పులు చేస్తే.. వారిని ప్ర‌శ్నించ‌డం వ‌ర‌కు ప‌రిమితం కావాల‌ని, కానీ, వారి ఇంట్లో ఆడ‌వాళ్లు ఏం త‌ప్పులు చేశార‌ని వారిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నార‌ని నిల‌దీశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (మార్చి 16) ఉదయం శ్రీవారి దర్శనం కోం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
గుంటూరు మేయ‌ర్, వైసీపీ నేత కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2021లో మేయ‌ర్‌గా ఎన్నికైన మ‌నోహ‌ర్ మరో ఏడాది ప‌ద‌వీ కాలం ఉండ‌గానే రాజీనామా చేశారు. గ‌త నెల‌లో జ‌రిగిన గుంటూరు న‌గ‌ర‌పాల‌క స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో ఆరు స్థానాల‌కు ఆరు స్థానాలనూ తెలుగుదేశం, జ‌న‌సేన కార్పొరేట‌ర్లు కైవ‌సం చేసుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం భయంతో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.
ఎన్నికల ముందు తన పార్టీ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ చాలా మాటలు మాట్లాడారు. మనకు ఆర్థిక, అంగ బలాలు, టీడీపీ స్థాయిలో గ్రౌండ్ లెవల్ నెట్‌వర్క్ లేవు, పోల్ మేనేజ్‌మెంట్ కూడా తెలియదు అందుకే జనసేన స్థాయికి తగ్గట్లు 21 స్థానాలకే పరిమితం అవుతున్నామని జనసైనికులకు వివరించారు.
హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని  నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా  సినీ నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణేశ్ ట్విట్ట‌ర్‌ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన జనాలు ఇది ఖచ్చితంగా ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ట్వీట్ అని తెలుస్తోంది. 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ లోని రెండు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి చేసిన మార్చురీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖరరెడ్డి, కునా వివేకానందగౌడ్ లు పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు? అంటే చెప్పడం కష్టం. అసలు ఉంటుందా? అంటే అదీ అనుమానమే? ఎందుకలా? నిన్న మొన్నటి దాకా, ఇదిగో, అదిగో అంటూ ఊహాగానాలు చేస్తూ వచ్చిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇప్పడు ఎందుకు మౌనం పాటిస్తోంది? అంటే స్పష్టమైన సమాధానం ఏదీ రాక పోయినా కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఆలోచనల కారణంగానే కాబినెట్ విస్తరణ అలోచన అటకెక్కిందని విశ్వసనీయ వర్గాల సమాచారంగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మామూలుగానే దక్షిణాదిలో బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చిన క్షణం నుంచీ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ నేతల పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. డీలిమిటేషన్ తో పాటు.. త్రిభాషా సూత్రాన్ని బీజేపీ హై కమాండ్ చర్చలోకి తీసుకురావడంతో దక్షిణాదిలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
 అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పక్కింట్లో పిడుగు పడినా తమకు పట్టనట్టుంటున్నారు. ఇరుగు పొరుగు అనే కాన్సెప్ట్ పూర్తిగా కనుమరుగైంది. నగరాల్లో ఇలా ఉంటే గ్రామాల్లో శుభవార్త అయినా, దుర్వార్త అయినా కలిసి పంచుకుంటున్నారు. రష్యాలో ఓ సర్కస్ లో రెండు ఏనుగుల్లో ఒకటి  చనిపోయింది.
వైఎస్ వివేకా హత్య జరిగి శనివారం (మార్చి 15)కి సరిగ్గా ఆరేళ్లు. ఈ ఆరేళ్లలో వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. గొడ్డలి పోటు నుంచి గుండెపోటు దాకా.. నారాసుర రక్త చరిత్ర నుంచి ఇంటి మనుషులే హత్య చేశారనే అనేక మలుపులు తిరిగింది. చివరికి కోర్టులు నిర్ధారించి, తీర్పు వెలువరించలేదు కానీ, వివేకా హత్యకు మోటివ్ ఏమిటో, హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న దాని మీద ప్రజలకు సందేహాలేవీ లేకుండా తెలిసిపోయింది. తేలిపోయింది. అయినా ఇప్పటి వరకూ హంతకులు ఎవరన్నది న్యాయస్థానం తేల్చ లేదు. హంతకులకు శిక్ష పడలేదు. కానీ ఈ కేసులో బాధితులు మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష అనుభవిస్తున్నారు.
పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని తన ఇద్దరు పిల్లల కాళ్లు, చేతులను కట్టేసిన ఓ తండ్రి తలలను బకెట్లో ముంచి చంపేసాడు. తర్వాత తానూ ఊరివేసుకుని చనిపోయాడు. కాకినాడ  జిల్లా వాకల పూడిలో అసిస్టెంట్ అకౌంట్ గా పని చేస్తున్న వానపల్లి చంద్రకిషోర్ ఒకటో తరగతి చదువుతున్న జోషిల్ , యుకేజీ చదువుతున్న నిఖిల్ పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని మనస్థాపం చెంది ఈ దారుణానికి పాల్పడ్డాడు
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సారి బీజేపీ ఎంపీ రఘునందనరావు ఈ విషయాన్ని లేవనెత్తారు. తిరుమల గడ్డపై నిలబడి రుబాబు చేశారు. తెలంగాణ భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.