మా ప్రేమను కోపంగానో..మా ప్రేమను ద్వేషంగానో..ఫీల్ అవర్ లవ్

Publish Date:Jan 1, 2014

Advertisement

 

వచ్చేఎన్నికలలో అదృష్టవశాత్తు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీని ప్రధానిగా పట్టాభిషేకం చేసేసి, ఆయన ఆ కుర్చీలో కాలుమీద కాలేసుకొని టీవిగా కూర్చొంటే చూసి తరించాలని యావత్ కాంగ్రెస్ భక్త కోటి ఒకటే ఆరాటపడిపోతోంది. స్వచ్చమయిన కాంగ్రెస్ డీ.యన్.యే.గల ప్రతీ కాంగ్రెస్ వాది కూడా తమ యువరాజావారికి ప్రధాని కాగల అన్నిఅర్హతలు ఉన్నాయని ఏకగ్రీవంగా కన్ఫర్మ్ చేసేసారు కూడా.

 

కానీ, నగదు బదిలీ పధకం ద్వారా నెలనెలా పదో పాతికో రూపాయలు తీసుకొంటున్నామనే విశ్వాసం కూడా లేని చాలా మంది జనాలు మాత్రం ఆ కాంగ్రెస్ వాదుల అభిప్రాయాలతో ఏకీభవించక పోవడం చాలా విచారకరం. రాహుల్ గాంధీ ప్రధాని పదవికి అర్హుడో కాదో చెప్పడానికి వారేమయినా మొయిలీ, షిండే, గులాం, దిగ్విజయ్ సింగ్, కపిల్ సిబాల్, మనీష్ తివారీల కంటే తెలివయినవారా? అంటే అదీ కాదు. జస్ట్ ఆమాద్మీలు అంతే! అయినా కూడా మాకు ఓ బ్రెయిను, దానికో అభిప్రాయం ఉంటుందని ఒకటే విర్రవీగుతున్నారు. ఆ అహంకారంతోనే యువరాజవారు, రాజమాత స్వయంగా తరలివచ్చి జనాలకి ఎంత నచ్చజెప్పినా వినకుండా నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని చీపురుపట్టుకొని ఊడ్చిపారేసారు.

 

ఇప్పుడు ఆ పెద్దాయన మన్మమోహనులవారు వయసు మీద పడటంతో ప్రధాని కుర్చీలో నిలకడగా కూర్చోలేకపోతున్నారని జాలిపడి, ఈ కాంగ్రెస్ భక్తుల మాట కాదనలేక పోనీ ఆ కుర్చీలో కూర్చొనేందుకు యువరాజవారు దయతో అంగీకరిస్తే, అందుకు ఈ జనాలు సంతోషించకపోగా “అసలు ఆయనకేమి తెలుసని అందులో కూర్చొనేందుకు రెడీ అయిపోతున్నారు? తొమ్మిదేళ్లుగా తల్లి కొంగు చాటునే రాజకీయాలు చేస్తున్నారు, కానీ ఏనాడయినా ఏ సమస్యనయినా పరిష్కరించారా? కనీసం మాట్లాడారా?” అంటూ అర్ధం పర్ధం ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నారు.

 

“పోనీ ప్రభుత్వాన్ని, దేశాన్ని ఆయన ఉద్దరించలేకపోయినా కనీసం స్వంత పార్టీనయినా చక్కదిద్దుకొన్నారా? ఆయనకు పార్టీ కిరీటం పెట్టిన తరువాత నుండి ఇంత వరకు నీతి, అవినీతి, నిజాయితీ, క్రమశిక్షణ గురించి లెక్చర్లు దంచడం తప్ప వాటిలో ఒక్కటయినా అమలు చేయగలిగారా? కనీసం ఒక వ్యక్తికి జోడు పదవులు ఉండకూడదని రూల్స్ మాట్లాడిన ఆయన కనీసం దానిని కూడా నేటికీ అమలుచేయలేనప్పుడు ఇక దేశాన్ని ఎలా గాడిన పెడతాడు? అయినా ఏదో ఒకరోజు తను కూడా బామ్మలాగే ఎవరి చేతిలోనో చచ్చిపోతానని మైకు చించుకొని చెపుతున్నఆయనకీ పట్టాభిషేకం మాత్రం ఎందుకట?” అని సన్నాయి నొక్కులొకటి పైగా.

 

కళ్ళుండి కూడా చూడలేదీ పాడులోకం. ఆయన చొరవ తీసుకోబట్టే ఈ జనాలు లోక్ పాల్ బిల్లు, భూ సేకరణ బిల్లు వంటి కనీవినీ ఎరుగని అనేక బిల్లులను చూడగలిగారు. ఆయన దయతలచబట్టే ఈ జనాలకి ఈ నగదు బదిలీ పధకం, ఆహార భద్రతా పధకం, పన్నెండు సబ్సిడీ సిలిండర్లకు బదులు తొమ్మిదేసి సిలిండర్లు పొందగలుగుతున్నారు. అయినా కూడా ఈ జనాలు తమకు ఇంకా ఏదో తక్కువయిందని వాపోవడం ఓ ఫేషన్ అయిపోయింది.

 

యువరాజవారు ఇంకా ప్రధాని పదవి చెప్పట్టకుండానే ఇన్నేసి పనులు ఎడమ చేత్తో చేసి పడేస్తున్నాఅవేవీ పట్టించుకోకుండా, “దేశం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు” అంటూ ఆ మోడీ చెప్పే తియ్యతియ్యటి మాటలనే గుడ్డిగా నమ్ముతూ, ఆయనకే ప్రదాని కుర్చీ బాగా సూట్ అవుతుందని సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తున్నారు.

 

“పదేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో దేశంలో కుంభకోణాలు తప్ప ఏమి కనబడుతున్నాయి? రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపడితే, ఆయన వల్ల దేశానికి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. ఆయనకి పట్టాభిషేకం జరిగితే మాకేంటి?” అని గిట్టనివారు నిలదీస్తుంటే, చంద్రబాబు వంటి చెడ్డవాళ్ళు కొందరయితే “మీరు మాపాలిట అనకొండలు” అంటూ కాంగ్రెస్ గురించి మరీ నీచంగా ఏదేదో మాట్లాడేస్తున్నారు. “మీ యువరాజుకి పట్టాభిషేకం చేసుకోవాలంటే అందుకు మా రాష్ట్రమే దొరికిందా విడగొట్టడానికి?” అంటూ జగన్ బాబు కూడా అవేశపడిపోతున్నాడు. ఇక, తామంతా గొప్ప రామ భక్తులమని గొప్పలు చెప్పుకొనే బీజేపీ వాళ్ళకయితే మరో పనిలేనట్లు తెల్లారిలేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు ఎప్పడూ ఆ సోనియా రాహుల్ గాంధీల నిత్యనామపారయణమే తప్ప ఏనాడు ఎవరూ కూడా నోరారా “రామ” అని పలికింది లేదు.

 

ఈవిధంగా దేశంలో యావత్ ప్రజానీకం, ప్రత్యర్ధ రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా “మా ప్రేమను కోపంగానో, మా ప్రేమను ద్వేషంగానో.. ఫీల్ అవర్ లవ్” అంటూ సోనియా రాహుల్ గాంధీల గురించే పాడుకొంటున్నారు, మాట్లాడుకొంటున్నారు. ఎవరికయినా ఇంతకంటే ఏమి కావాలి? వారు కురిపిస్తున్న అపారమయిన ప్రేమ కోసం ప్రధాని మంత్రి కుర్చీ ఏమిటి.. అవసరమయితే ప్రభుత్వాన్ని కూడా త్యాగం చేసెయోచ్చు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.