తమిళనాడులో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటి దాకా వరదలు ముంచెత్తితే.. ఇప్పుడు కరోనా వైరస్ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అన్నిరాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ప్రజలంతా మాస్కులు, సామాజిక దూరం తప్పక పాటించాలని.. వ్యాక్సిన్ వేసుకోని వారంతా రెండు డోసులు తప్పక తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో.. తాను నిత్యం ప్రయాణించే మార్గంలో కొందరు ప్రజలు మాస్కులు పెట్టుకోకపోవడాన్ని గమనించిన తమిళనాడు సీఎం స్టాలిన్.. వారికి మాస్కులు పంచారు. స్వయంగా కొందరికి మాస్కులు తొడిగారు.
చెన్నై రోడ్లపై మాస్కు లేకుండా ఉన్న వారిని చూసిన స్టాలిన్ వెంటనే తన కాన్వాయ్ ఆపించారు. కారు దిగొచ్చి మాస్కులు పంచారు. ఇలా మార్గమధ్యలో పలుచోట్ల కారు ఆపి.. మాస్కులు తొడిగి.. ఔరా అనిపించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో సైతం ప్రజలంతా మాస్కులు ధరించాలంటూ.. స్వయంగా ఆయనే ఓ వీడియో చేసి రిలీజ్ చేశారు.
మాస్కులు పంచడంపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. "హెడ్ క్వార్టర్స్ నుంచి క్యాంప్ ఆఫీసుకు వెళ్తుండగా బహిరంగ ప్రదేశాల్లో కొంత మంది మాస్క్లు పెట్టుకోకపోవడం కనిపించింది. వారికి మాస్క్లు అందించాను. ప్రతి ఒక్కరు మాస్క్లు ధరించాలని వారికి సూచించాను. కొవిడ్ భయంకరంగా వ్యాపిస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలంటే మాస్క్లు ధరించడం చాలా అవసరం. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను విజ్ణప్తి చేసేది ఏంటంటే.. మాస్క్లు తప్పకుండా ధరించండి" అని సీఎం స్టాలిన్ ప్రజలకు పిలుపిచ్చారు.
ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ స్టాలిన్ ప్రజలతో మమేకమవుతున్నారు. జనాలతో కలిసిపోతున్నారు. వాకింగ్, సైక్లింగ్, ఆకస్మిక తనిఖీలతో యాక్టివ్గా ఉంటున్నారు. అదే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారే... అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్, ఫాంహౌజ్లో సెటిలైతే.. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్లో సేద తీరుతున్నారని విమర్శిస్తున్నారు. ఇక కొవిడ్ కట్టడి విషయంలో ఈ ఇద్దరు సీఎంలు అట్టర్ఫ్లాప్ అనే టాక్. ఇక, ముఖ్యమంత్రి జగన్ మాస్క్ పెట్టుకొని కనిపించిన సందర్భాలు అత్యంత అరుదు. కేసీఆరూ అంతే. ఇక, స్టాలిన్లా జగన్, కేసీఆర్లు మాస్కులు పంచే కార్యక్రమాన్ని అస్సలు ఊహించుకోలేమంటున్నారు. వాళ్లే మాస్కులు పెట్టుకోరు.. ఇక జనాలకేం మాస్కులు పెడతారు.. మస్కా కొట్టడానికైతే రెడీ అంటారుగానీ...అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-stalin-distributed-masks-to-public-in-chennai-39-129627.html
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.