ఆయిల్ కంపెనీల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్.. సరఫరా పునరుద్ధరించకుంటే చర్యలు తప్పవంటూ వార్నింగ్

Publish Date:Apr 26, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. ప్రజలకు అత్యవసరమైన ఇంధన సరఫరాలో అంతరాయం కలగడం పట్ల  అసహనం వ్యక్తం చేసిన ఆయన సోమవారం (ఏప్రిల్ 27) నాటికి రాష్ట్రంలోని ఏ ఒక్క పెట్రోల్ బంకు వద్ద కూడా  నో స్టాక్ అనే బోర్డు కనిపించడానికి వీల్లేదని చమురు కంపెనీల ప్రతినిధులకు   అల్టిమేటం జారీ చేశారు. ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టించి ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సదరు కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి  చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి  ఉన్నతాధికారులు,  ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం (ఏప్రిల్ 26)  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు. రిటైల్ అవుట్‌లెట్లకు ఇవ్వాల్సిన క్రెడిట్ సదుపాయాన్ని నిలిపివేసి..  సరఫరాను ఆపడం వల్ల సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ధోరణిని సహించేది లేదన్నారు.

రాష్ట్రంలో ముఖ్యంగా నయారా, రిలయన్స్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు సరఫరా  నిలిపివేయడం వల్లే సమస్య జటిలమైందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్రంలో వరి కోతల సీజన్ నడుస్తుండటం, వ్యవసాయ,  ఆక్వా రంగాల నుండి డీజిల్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం కూడా ఈ పరిస్థితికి కారణమైందన్నారు.  మూడు రోజుల క్రితమే ఈ సమస్య వెలుగులోకి వచ్చినా,  తక్షణమే ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను సీఎం నిలదీశారు. తనకు కేవలం నివేదికలు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కావాలని స్పష్టం చేశారు.

ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందన్న చంద్రబాబు. .   ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్,  కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠిన నిఘా ఉంచాలని పోలీసు, పౌర సరఫరాల శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం డీజిల్ అవసరమయ్యే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనీ.. అవసరమైతే కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

ముఖ్యమంత్రి హెచ్చరికల నేపథ్యంలో చమురు కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలనీ.. డిపోల నుండి బంకులకు ఇంధనాన్ని తరలించే ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ సోమవారం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి రాకపోతే కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  

ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోంది. వేసవి,  వ్యవసాయ పనుల నేపథ్యంలో ఇంధన అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వం వేగంగా స్పందించడం ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కృత్రిమ కొరతలు తలెత్తకుండా శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని సీఎం అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.  

By
en-us Political News

  
తెలంగాణాలో నాలుగు దశాబ్దాలకు పైగా జరిపిన పురావస్తు పరిశోధనల్లో వెలికి వచ్చిన అరుదైన సమాచారాన్ని శివనాగిరెడ్డి ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారని వేణు నక్షత్రం తన ప్రసగంలో చెప్పారు. చరిత్ర పుస్తకాల్లో లేని తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైన ఈ విషయాలను అందరూ తెలుసుకోవాలన్నారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే మళ్లీ ముంపు తప్పదా అన్న భయం మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది. గత వరదల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఏడేళ్లుగా తనకు ఇస్తున్న హామీలను నిర్వాహకులు నెరవేర్చడంలేదన్నారు. చెప్పిన సమయానికి విగ్రహ ప్రతిష్టాపన ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. తన ఆగ్రహానికి గురికాకముందే ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చాలని హెచ్చరించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నప్పటికీ.. మాట తప్పడం సరికాదన్నారు.
భారత వాతావరణ శాఖ శాస్త్రీయ అధ్యయనాల అనంతరం ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని చెబుతుంటే.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో భవిష్యవాణి రంగం మాత్రం కుండపోత వర్షాలు, భారీ వరదల ముప్పు ఉందని హెచ్చరిస్తోంది.
మొత్తంగా మోడీ పర్యటనలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం ప్రధాన అంశం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఆగస్టు మూడో వారం నుంచే భోగాపురం విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
భోగాపురం నుంచి నేరుగా అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆకర్షించేందుకు బలమైన పునాది ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఉత్తరాంధ్ర ప్రగతికి గేట్‌వేగా అభివర్ణించారు. ఇప్పుడు ఇక తదుపరి టార్గెట్ గా అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇక్కడ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడపడమే కావాలని ఆంధ్రులు కోరుతున్నారు.
నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి ప్రజాస్వామ్య నిరసన హక్కును గౌరవిస్తూ ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ట విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది
బోనం కింద పడటంతో జోగిని శ్యామలతో పాటు పలువురు జోగినులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. జాతర సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు వచ్చిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పలాంటిర్ టెక్నాలజీస్ మరియు అర్మాడా సంయుక్తంగా షిప్పింగ్ కంటైనర్లలో ఎన్విడియా B300 AI యాక్సిలరేటర్లతో పనిచేసే మొబైల్ వార్ డేటా సెంటర్లను ఆవిష్కరించాయి. ఇంటర్నెట్ మరియు క్లౌడ్ కనెక్షన్ లేకపోయినా యుద్ధ రంగంలోనే స్వతంత్రంగా పనిచేసే ఈ వినూత్న టెక్నాలజీ విశేషాలు చూడండి.
సోనీ సంస్థ తన 10 ఏళ్ల మైలురాయిగా విడుదల చేసిన అత్యంత విలాసవంతమైన 1000X కలెక్షన్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌పై మొదటిసారి 15 శాతం పరిమిత కాలపు డిస్కౌంట్‌ను ప్రకటించింది. DSEE ఆల్టిమేట్ టెక్నాలజీ, 12 మైక్రోఫోన్ల నోయిస్ క్యాన్సిలేషన్ మరియు 24 గంటల బ్యాటరీ లైఫ్ ఉన్న ఈ ప్రీమియం ఆడియో డివైజ్ పూర్తి వివరాలు మరియు ఆఫర్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ లిమిటెడ్ ఐపిఓ ప్రైస్ బ్యాండ్ రూ. 200 212 గా నిర్ణయించబడింది. ఆగస్టు 7 నుండి 11 వరకు సబ్‌స్క్రిప్షన్ కి అందుబాటులో ఉండే ఈ ఐపిఓ పూర్తి వివరాలు, లాట్ సైజ్ మరియు లిస్టింగ్ తేదీలను ఇక్కడ తెలుసుకోండి.
8వ వేతన సంఘం 8th Pay Commission వార్షిక ఇంక్రిమెంట్ ప్రతిపాదనలపై కీలక వివరాలు. 3%, 5%, మరియు 6% ఇంక్రిమెంట్‌ల ఆధారంగా లెవెల్ 1, 2, 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 5 ఏళ్లలో ఎలా పెరుగుతుందో సమగ్రంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.