బెజవాడకు ముంపు తప్పదా? బుడమేరు ఇప్పటికీ దుఖదాయినేనా?

Publish Date:Aug 3, 2026

Advertisement

తెలుగువన్ స్పెషల్

విజయవాడ నగరాన్ని గతంలో తీవ్ర విషాదంలోకి నెట్టిన బుడమేరు ముంపు ఘటన జరిగి రెండేళ్లు పూర్తవుతోంది. ప్రభుత్వం అప్పట్లో ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంది. అండగా నిలిచింది. అంతే కాకుండా.. బుడమేరు ముంపు సమస్యను శాశ్వత పరిష్కారానికి  అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటికీ నాటి బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజలలో ఆందోళన ఇప్పటికీ ఇసుమంతైనా ఆందోళన తగ్గలేదు. వర్షాకాలం వచ్చిందంటే.. కృష్ణా నదికి వరద వస్తోందంటూ ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.  ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే మళ్లీ ముంపు తప్పదా అన్న భయం మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది.  గత వరదల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

గతంలో వచ్చిన తీవ్ర వరదల వల్ల విజయవాడ నగరంలోని దాదాపు 16 డివిజన్లు నీట మునిగిన సంగతి తెలిసిందే. రాయనపాడు, సింగ్ నగర్, వైఎస్సార్ కాలనీ, రాజరాజేశ్వరిపేట, భవానీపురం వంటి అనేక ప్రాంతాల్లో ప్రజలు దాదాపు పది రోజుల పాటు వరద నీటిలోనే చిక్కుకుపోయారు. ఆ సమయంలో  ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.  బుడమేరు బెజవాడ పాలిట దుఃఖదాయినిగా మారింది.

ప్రస్తుతం ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో బుడమేరులోకి వరద ప్రవాహం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.దీంతో బుడమేరుర ముంపు భయం వెంటాడుతోంది. ఈ సందర్భంగా.. గతంలో పడిన గండ్లను ప్రభుత్వం  నామమాత్రంగానే పూడ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండపల్లి శాంతినగర్ వద్ద ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం కూడా పూర్తిస్థాయిలో జరగలేదని  సిపిఐ నేత శంకర్ అంటున్నారు. 

బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే   వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం  50 కోట్ల రూపాయలే మంజూరు చేయడంతో పనులు అరకొర మాత్రమే జరిగాయంటున్నారు.   బుడమేరు దిగువ భాగంలో   282 ఎకరాలు, నగర పరిధిలో మరో 82 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు గతంలో నిర్వహించిన సర్వేలోనే తేలింది.

బుడమేరు ప్రవాహ మార్గంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తొలగించకపోవడం, కాలువ లోతును పెంచకపోవడం వల్ల కొద్దిపాటి వరద వచ్చినా నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఏనికేపాడు అండర్ టన్నెల్ ఛానల్ వద్ద నీటి ప్రవాహ సామర్థ్యం కేవలం 4 వేల క్యూసెక్కులు మాత్రమే ఉండటం వల్ల, ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తే నీరు వెనక్కి తన్ని నగరంపైకి విరుచుకుపడే అవకాశం ఉంది.

నాటి వరదల్లో ఆటోలు, గృహోపకరణాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన బాధితులు ఇప్పటికీ కోలుకోని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించి  ఆపరేషన్ బుడమేరు పేరుతో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నారు.కృష్ణా నది తరహాలోనే బుడమేరు పరివాహక ప్రాంతమంతా పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించాలని, ఆక్రమణలను తొలగించి కాలువను వెడల్పు చేయాలని బెజవాడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.  

 

 Vijayawada Floods, Budameru Flood Threat, Vijayawada News, Andhra Pradesh Rains, Budameru Retaining Wall

By
en-us Political News

  
తెలంగాణాలో నాలుగు దశాబ్దాలకు పైగా జరిపిన పురావస్తు పరిశోధనల్లో వెలికి వచ్చిన అరుదైన సమాచారాన్ని శివనాగిరెడ్డి ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారని వేణు నక్షత్రం తన ప్రసగంలో చెప్పారు. చరిత్ర పుస్తకాల్లో లేని తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైన ఈ విషయాలను అందరూ తెలుసుకోవాలన్నారు.
ఏడేళ్లుగా తనకు ఇస్తున్న హామీలను నిర్వాహకులు నెరవేర్చడంలేదన్నారు. చెప్పిన సమయానికి విగ్రహ ప్రతిష్టాపన ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. తన ఆగ్రహానికి గురికాకముందే ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చాలని హెచ్చరించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నప్పటికీ.. మాట తప్పడం సరికాదన్నారు.
భారత వాతావరణ శాఖ శాస్త్రీయ అధ్యయనాల అనంతరం ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని చెబుతుంటే.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో భవిష్యవాణి రంగం మాత్రం కుండపోత వర్షాలు, భారీ వరదల ముప్పు ఉందని హెచ్చరిస్తోంది.
మొత్తంగా మోడీ పర్యటనలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం ప్రధాన అంశం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఆగస్టు మూడో వారం నుంచే భోగాపురం విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
భోగాపురం నుంచి నేరుగా అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆకర్షించేందుకు బలమైన పునాది ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఉత్తరాంధ్ర ప్రగతికి గేట్‌వేగా అభివర్ణించారు. ఇప్పుడు ఇక తదుపరి టార్గెట్ గా అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇక్కడ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడపడమే కావాలని ఆంధ్రులు కోరుతున్నారు.
నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి ప్రజాస్వామ్య నిరసన హక్కును గౌరవిస్తూ ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ట విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది
బోనం కింద పడటంతో జోగిని శ్యామలతో పాటు పలువురు జోగినులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. జాతర సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు వచ్చిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పలాంటిర్ టెక్నాలజీస్ మరియు అర్మాడా సంయుక్తంగా షిప్పింగ్ కంటైనర్లలో ఎన్విడియా B300 AI యాక్సిలరేటర్లతో పనిచేసే మొబైల్ వార్ డేటా సెంటర్లను ఆవిష్కరించాయి. ఇంటర్నెట్ మరియు క్లౌడ్ కనెక్షన్ లేకపోయినా యుద్ధ రంగంలోనే స్వతంత్రంగా పనిచేసే ఈ వినూత్న టెక్నాలజీ విశేషాలు చూడండి.
సోనీ సంస్థ తన 10 ఏళ్ల మైలురాయిగా విడుదల చేసిన అత్యంత విలాసవంతమైన 1000X కలెక్షన్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌పై మొదటిసారి 15 శాతం పరిమిత కాలపు డిస్కౌంట్‌ను ప్రకటించింది. DSEE ఆల్టిమేట్ టెక్నాలజీ, 12 మైక్రోఫోన్ల నోయిస్ క్యాన్సిలేషన్ మరియు 24 గంటల బ్యాటరీ లైఫ్ ఉన్న ఈ ప్రీమియం ఆడియో డివైజ్ పూర్తి వివరాలు మరియు ఆఫర్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ లిమిటెడ్ ఐపిఓ ప్రైస్ బ్యాండ్ రూ. 200 212 గా నిర్ణయించబడింది. ఆగస్టు 7 నుండి 11 వరకు సబ్‌స్క్రిప్షన్ కి అందుబాటులో ఉండే ఈ ఐపిఓ పూర్తి వివరాలు, లాట్ సైజ్ మరియు లిస్టింగ్ తేదీలను ఇక్కడ తెలుసుకోండి.
8వ వేతన సంఘం 8th Pay Commission వార్షిక ఇంక్రిమెంట్ ప్రతిపాదనలపై కీలక వివరాలు. 3%, 5%, మరియు 6% ఇంక్రిమెంట్‌ల ఆధారంగా లెవెల్ 1, 2, 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 5 ఏళ్లలో ఎలా పెరుగుతుందో సమగ్రంగా తెలుసుకోండి.
మదర్సాలు ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా పౌరులందరికీ సమానమైన చట్టాలు అమలులో ఉన్నాయన్న తస్లీమా.. ఇండియాలో మాత్రం మహిళలు ఇప్పటికీ చట్టపరంగా, సామాజికంగా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.