ల్యాండ్ లిటిగేషన్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీ : సీఎం చంద్రబాబు

Publish Date:Jul 23, 2026

Advertisement

 

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ల్యాండ్ లిటిగేషన్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే ఉద్దేశంతో ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ ప్రాజెక్టును ప్రారంభించినట్లు సీఎం వెల్లడించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ఈ పైలట్ ప్రాజెక్టును ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రత్యేకతలు, పనితీరును సీఎస్ సాయి ప్రసాద్, రెవెన్యూ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చెయిన్ విధానాన్ని రెవెన్యూ శాఖ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో భూ వివాదాలకు అడ్డుకట్ట వేసేలా ప్రతి ల్యాండ్ పార్సెల్‌కు ప్రత్యేక డిజిటల్ ఐడీ కేటాయించి, ట్యాంపర్ ప్రూఫ్ భద్రతతో లావాదేవీలు జరిగే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు వివరించారు.

భూ వివాదాలకు ప్రధాన కారణాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు ఒకటని, ఇకపై ఇలాంటి సమస్యలను నివారించేలా బ్లాక్‌చెయిన్ విధానం పనిచేస్తుందని అధికారులు తెలిపారు. భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్‌గా ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ వ్యవస్థను రూపొందించామని, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు.NIC ఆంధ్రప్రదేశ్, NIC బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా హైపర్‌లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ ఆధారంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఒక్కో మండలంలో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఆస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల పరిధిలోని 89 రీ-సర్వే గ్రామాల్లో 1,37,763 ల్యాండ్ పార్సెల్ మ్యాప్‌లను ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురానున్నారు.‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ అమలు విధానాన్ని వివరిస్తూ అధికారులు వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. భవిష్యత్తులో క్యూ ఆర్ కోడ్, ఆధార్ అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

అధ్యయనం చేసి లోపాలను సరిదిద్దాలి

పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...“భూ రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల విలువైన భూముల విషయంలో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో భూ వివాదాలు తక్కువగా ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలోనూ భూ తగాదాలు పెరిగాయి. 22ఏ పేరుతో కక్ష సాధింపు చర్యలు జరిగాయి.ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే అంశాల ఆధారంగా భూ సమస్యలను పరిష్కరిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్నాం. రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. పట్టాదార్ పాస్ పుస్తకాలను రాజముద్రతో అందిస్తున్నాం.

శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుటుపల్లి వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా వివాదాల్లో ఉన్న భూములకు విముక్తి కల్పించాం. ప్రస్తుతం ప్రారంభించిన ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ ప్రాజెక్టు ద్వారా భూములకు శాశ్వత భద్రత కల్పిస్తాం.
భూ రికార్డులకు ట్యాంపర్ ప్రూఫ్ వ్యవస్థను తీసుకొస్తున్నాం. బ్లాక్‌చెయిన్ ద్వారా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలు ఒకే వేదికపైకి వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రయవిక్రయాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.

రెండు నెలల పాటు పైలట్ ప్రాజెక్టు అమలును పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి. లోటుపాట్లు గుర్తించేందుకు ప్రత్యేక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేసి, అవసరమైన మార్పులు చేర్పులు చేయాలి. ఇకపై సర్వే పూర్తయిన గ్రామాలను బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వ్యవస్థలోకి తీసుకురావాలి. నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

భూ సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా రెవెన్యూ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపడమే మా లక్ష్యం. భూ సమస్యలు తగ్గితే ఫిర్యాదుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుంది.” అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్, సీఎస్ సాయి ప్రసాద్, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు, ఏడు జిల్లాల కలెక్టర్లు, ఏపీ-ఎన్ఐసీ, బెంగళూరు-ఎన్ఐసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

CM Chandrababu, AP Blockchain Land Records, Mee Bhoomi Blockchain, Andhra Pradesh Land Fraud Prevention, Tamper Proof Land Records, NIC Blockchain Technology, Minister Satya Prasad

By
en-us Political News

  
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.