మరో ఉద్యమానికి కాక్రోచ్ లు రెడీ.. ఎందుకంటే?

Publish Date:Jul 29, 2026

Advertisement

కాక్రోచ్ జనతాపార్టీ మరో సారి ఉద్యమించడానికి రెడీ అవుతోంది. నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన మద్దతుకు దిగి వచ్చిన మోడీ సర్కార్.. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. కాగా ఆ ఉద్యమ సమయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై నమోదైన కేసులన్నిటినీ తక్షణమే ఎత్తివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ ను కేంద్రం అంగీకరించింది. అయితే రోజులు గడుస్తున్నా కేంద్రం ఆ హామీని నెరవేర్చకపోవడంతో.. దేశవ్యాప్తంగా మళ్లీ  ఆందోళనలు ప్రారంభిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ అల్టిమేటమ్ ఇచ్చింది.  

ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిథి సౌరవ్‌ దాస్.. నీట్ వివాదంపై నమోదైన ప్రజాహిత వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు సమగ్ర విచారణ జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నారు.  మొదట చర్చల సందర్భంగా, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై   కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబోమని,  ఇప్పటికే నమోదైన పాత కేసులను కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని ప్రభుత్వం  హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు..  వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ ఆ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సుప్రీంకోర్టు కూడా శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి  కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్న  సౌరవ్ దాస్, గతంలో ఎటువంటి నేరచరిత్ర లేని, నిర్బంధంలో ఉన్న విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. అయితే..  ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లపై దర్యాప్తు అధికారులు విచారణ కొనసాగించవచ్చని కోర్టు పేర్కొన్న ఒకే ఒక్క అంశాన్ని ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకుంటూ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆరోపించారు.  

న్యాయస్థానం ఎక్కడా కేసులను ఎత్తివేయకూడదని ఆదేశించలేదని, నమోదైన కేసులను ఉపసంహరించుకునే పూర్తి అధికారాలు, చట్టపరమైన హక్కులు ప్రభుత్వానికి ఉంటాయని  స్పష్టం చేశారు.  నీట్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి పూర్తి స్థాయి రక్షణ కల్పించడమే కాకుండా, వారిపై మోపిన అక్రమ కేసులన్నింటినీ ఎటువంటి నిబంధనలు లేకుండా ఎత్తివేయాలని డిమాండ్ చేసిన ఆయన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోతే..  మళ్లీ క్షేత్రస్థాయిలో వీధుల్లోకి వచ్చి పోరాటాన్ని ఉధృతం చేస్తామని  హెచ్చరించారు.

CJP to agitate again,  Cockroach Janata Party, CJP ultimatum, student protest cases, FIR withdrawal demand, Supreme Court NEET ruling

By
en-us Political News

  
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావారనికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ దెబ్బతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఉపశమనాన్ని అందించినప్పటికీ.. భారీ వర్షాల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.
ఇంత కాలంగా ప్రభుత్వ శాఖలలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అదనపు బాధ్యతలు స్వీకరించినప్పుడు లేదా వేర్వేరు ప్రాజెక్టుల ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతి పదవికి ఒక వాహనం చొప్పున బహుళ వాహనాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 2022 నాటి పాత మార్గదర్శకాలకు అనుబంధంగా తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఆర్థిక శాఖ వ్యయ విభాగం అటువంటి సదుపాయాలకు చెక్ పెట్టాయి.
హక్కుల హననానికి తోడు పీవోకేలో గళమెత్తుతున్న ప్రజలపై పాక్ బలగాలు పాశవిక అణచివేతకు పాల్పడుతున్నారు. గత రెండు రోజులుగా రావల్‌కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో పాక్ బలగాలు జరిపిన దాడులు, కాల్పుల్లో 40 మంది పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. పీవోకేలో జనం ప్రాథమిక హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టిన శాంతియుత నిరసనలపై పాక్ సైన్యం యుద్ధం ప్రకటించింది.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద ఉన్న ఈ సహజసిద్ధ జలపాతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది
మద్యం విధానం పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవకతవకలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతున్న విచారణాధికారులు, ఈ కేసులో మాజీ మంత్రి పాత్రపై కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో అరెస్టు ముప్పు నుంచి తప్పించుకునేందుకు, ఆయన సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు.
మూడు దశాబ్దాల భవిష్యత్ ను ముందుగానే చూడగల విజనరీ అయిన చంద్రబాబు నాయుడు 1997లో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక హుద్‌హుద్ తుఫాను అనంతరం.. సురక్షిత, ఆధునిక విమానాశ్రయం ప్రతిపాదనను ఆయన మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు. ఓ వైపు సముద్ర తీరం, మరొకవైపు మన్యప్రాంతాల నడుమ వ్యూహాత్మక ప్రదేశంగా భోగాపురాన్ని అయిన ఎంపిక చేశారు.
మిసిర్ బేస్రాపై ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలీసులపై దాడులు, నరమేధాలు, ఐఈడీ పేలుళ్లు, వసూళ్లు సహా ఏకంగా 150కి పైగా కేసులు నమోదయ్యాయి. 2007లో ఖుంటీ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినప్పటికీ, 2009లో బిహార్‌లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసి అతడిని విడిపించుకుపోయారు. ఆ సంఘటన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల అజ్ఞాతంలోనే ఉన్నారు.
వర్షాల తీవ్రత వల్ల పలు జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కామరూప్, ధుబ్రి, లఖింపూర్, దిబ్రూగఢ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఇన్ స్పెక్టర్, బాధిత మహిళ కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ పరిణా మాల నేపథ్యంలో బాధిత మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధి కారులు చేపట్టిన విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరా బాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు రెండు గంటల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సైబర్ ముఠాల దందాను అరికట్టడానికి సాధారణ చట్టాలు సరిపోవనీ, అందుకే ఇకపై డిజిటల్ అరెస్టు మోసాలను పాతకాలపు ఐటీ చట్టాల కింద కాకుండా, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద నమోదు చేసి, దర్యాప్తు జరపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఫార్వార్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమ వేదికగా షేర్ చేసిన నివేదిక వీడియోతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నౌక పరిసర ప్రాంతాల్లో నిరంతరం పేలుళ్లు జరుగుతుండటం, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేస్తుండటం ఎఫ్సీయూ ఐవిడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.