Publish Date:Aug 12, 2023
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రత్యక్షమయ్యారు. దాదాపు నాలుగు నెలల తర్వాత... అది కూడా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్ట్ సందర్శిస్తున్న సమయంలో ఆయనతో ఎమ్మెల్యే శ్రీదేవి భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... పార్టీ మార్పుపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని తెలిపారు. అలాగే చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో మాట్లాడిట్లు ఈ సందర్బంగా వెల్లడించారు. కానీ దాదాపు నాలుగు నెలల పాటు ఎవరికీ కనిపించకుండా ఉండడంతో.. ఉండవల్లి శ్రీదేవి ఏమయ్యారన్న ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో జోరందుకుంది.
ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క టీడీపీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధ బరిలో దిగారు. అయితే ఆమె అనూహ్యంగా గెలుపోందడంతో.. అధికార ఫ్యాన్ పార్టీ అధిష్టానం... అదే పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు... కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఆనం రామ్నారాయణ రెడ్డి కాగా.. మరొకరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. సస్పెన్షన్ వేటు కొద్ది రోజులకు తెలుగుదేశం పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. అలాగే సదరు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో క్రియాశీలంగా రాజకీయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
కానీ శ్రీదేవి మాత్రం తనపై సస్పెన్షన్ వేటు పడిన వెంటనే.. ఓ ప్రెస్మీట్ పెట్టి.. ఆ క్రమంలో ఫ్యాన్ పార్టీ అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేసి.. ఆ తర్వాత ఉండవల్లి శ్రీదేవి ఎవరికీ కనిపించకుండా గాయబ్ అయిపోయారు.
మరోవైపు ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోందని.. ఉండవల్లి శ్రీదేవి మాత్రం ఎక్కడా కనిపించకుండా ఉన్నారనీ ఆమె నియోజకవర్గమైన తాడికొండలో ఓ సందేహమైతే వ్యక్తమవుతూ వస్తుంది. అలాంటి వేళ.. ఆగస్ట్ 10న ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్ట్ వద్ద ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి శ్రీదేవి దంపతులు రావడంతో.. ప్రజలకు ఓ క్లారిటీ అయితే వచ్చేసినట్లు అయింది. చంద్రబాబుతో భేటీ అనంతరం.. పార్టీ మార్పుపై త్వరలో ఓ క్లారిటీ ఇస్తానని ఆమె స్వయంగా ప్రకటించడంతో.. సైకిల్ పార్టీలో చేరతారనే ఓ ప్రచారం అయితే తాడికొండ నియోజకవర్గంలో ఊపందుకొంది.
ఓ వేళ ఆమె పసుపు పార్టీలో చేరితే.. ఆమెకు మళ్లీ తాడికొండ సీటే ఇస్తారా? లేకుంటే రాష్ట్రంలో మరో నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపుతారా? అదీఇదీ కాకుంటే.. సైకిల్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని.. పార్టీ అధికారంలోకి వస్తే.. కీలక పదవి ఇస్తామనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉందా? అనే ఓ ప్రచారం సైతం పోటిలికల్ సర్కిల్లో ఊపందుకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vundavalli-dridevi-broke-sclience-39-159891.html
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.