దీటుగా చైనా, బేలగా భారత్

Publish Date:May 1, 2013

Advertisement

 

గత నెల 15వ తేదిన భారత భూభాగంలోకి 19కి.మీ. మేర చొచ్చుకు వచ్చిన చైనా దేశ సైనికులు ముందు నాలుగు తాత్కాలిక స్థావరాలను వేసుకొన్నారు. ఒకవైపు భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నపటికీ, వారు వెనక్కి మళ్ళకపోగా, మళ్ళీ మొన్నమరొక కొత్త స్థావరం కూడా ఏర్పాటు చేసుకొన్నారు.

 

భారత అభ్యంతరాలకు దీటుగా బదులిస్తూ చైనా విదేశాంగ శాఖా ప్రతినిధి, తమ సైనికులు ఏనాడు భారత భూభాగంలో అతిక్రమణలకి పాల్పడలేదని, వారు ప్రస్తుతం ఉన్న ప్రాంతం తమ చైనా భూభాగం లోనిదేనని, అందువల్ల వారిని వెనక్కి రప్పించే ప్రశ్నే ఉత్పన్నం అవదని, అయినా భారత్ తో తాము చర్చలకు ఎల్లపుడు సిద్దమేనని తెలిపింది. భారత్ కూడా చర్చలలో జరిగిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని కోరింది.

 

దురాక్రమణకు పాల్పడిన చైనా ఇంత గట్టిగా జవాబిస్తుంటే, ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మాత్రం “ఇది స్థానికమయిన ఒక చిన్న సమస్య, దీనికి అంత ప్రాదాన్యం లేదు. దీనిని స్థానిక కమాండర్ల పరిధిలోనే పరిష్కారం కనుగొంటామని” తేలికగా కొట్టిపారేశారు.

 

అదేవిధంగా ప్రతిపక్షాల అభ్యంతరాలను త్రోసిపుచ్చుతూ, భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ కుర్షిద్ ఈ నెల 9న తన చైనా పర్యటనను యధావిధిగా కొనసాగిస్తానని చెప్పారు. “వారిని వెనుతిరిగి యదా స్థానాలకు వెళ్ళాలని కోరాము. అందుకు ప్రతిగా వారు మాకు కొన్ని షరతులు విదించారు. దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించగలమనే నమ్మకం మాకుంది,” అని ఆయన చెప్పడం భారత మెతక వైఖరికి అద్దం పడుతోంది.

 

దురాక్రమణ చేసిన చైనా తన తప్పును సరిదిద్దుకోకపోగా గట్టిగా వాదిస్తుంటే, దీటుగా జవాబు చెప్పవలసిన భారత ప్రభుత్వం చైనాను తమ సైనికులను వెనక్కి తీసుకోమని బేలగా అభ్యర్దిస్తోంది.

 

తాజా సమాచారం ప్రకారం, మొన్న ఇరుదేశాల కమాండర్ల మద్య జరిగిన 3వ ఫ్లాగ్ మీటింగ్ కూడా విఫలమయింది. తమను భారత్ ఏవిధమయిన డిమాండ్స్ చేయలన్నా, ముందుగా భారత్ తన సరిహద్దు భూభాగాలయిన ‘ఫుక్చీ’ మరియు ‘చుమార్’ ప్రాంతాలలో నెలకొల్పిన శాశ్విత మిలటరీ కట్టడాలను వెంటనే తొలగించాలని, అప్పుడే చైనా భారత అభ్యంతరాలను పరిశీలించగలదని చైనా నిర్ద్వందంగా చెపుతోంది. అంతే గాకుండా, ప్రస్తుతం తమ భూభాగంలో తమ స్థావరాలకు కేవలం 500 మీటర్ల దూరంలో భారత్ సైనికులు ఇటీవల కొత్తగా నెలకొల్పిన స్థావరాలను కూడా వెంటనే తొలగించాలని చైనా డిమాండ్ చేసింది.

 

ఫ్లాగ్ మీటింగ్ లో పాల్గొన్న చైనా మిలటరీ కమాండర్లు, తాము భారత కమాండర్ల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకొని వెనక్కి వెళ్ళలేమని, తమకు తమ కేంద్ర మిలటరీ కమాండ్ నుండి వెనక్కి మరలమని స్పష్టమయిన ఆదేశాలు వస్తే తప్ప తాము వెనక్కి వెళ్ళబోమని కూడా వారు స్పష్టం చేసారు.

 

తద్వారా ప్రధాని డా.మన్మోహన్ సింగ్ చెప్పినట్లు ఇది స్థానిక మిలటరీ కమాండర్ల పరిధిలో పరిష్కరింపబడే ఒక చిన్న స్థానిక సమస్య ఎంతమాత్రం కాదని, చైనా వ్యుహాత్మకంగానే ఈ చొరబాటుకి దిగిందని స్పష్టం చేసింది. అయినప్పటికీ, వివిధ కుంభకోణాలలో తలమునకలయున్న యుపీయే ప్రభుత్వం, చైనా దురాక్రమణ పట్ల స్పందించవలసిన రీతిలో స్పందించకపోగా, సమస్యను తక్కువ చేసి ప్రజలను, ప్రతిపక్షాలను కూడా మభ్య పెట్టే ప్రయత్నాలు చేయడం చాలా దారుణం. కనీసం చైనాకు తగ్గట్లు జవాబు చెప్పే పరిస్థితిలో కూడా లేకపోవడం విచారకరం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.