కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి కోర్టులో కష్టాలు కొనసాగుతున్నాయి. చిదంబరం బెయిల్ పిటిషన్ ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ పదిహేడు వరకు పొడిగించింది, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. చిదంబరం బెయిల్ పిటిషన్ మళ్లీ నిరాకరించడంతో ఆయన తీవ్ర షాక్ లో ఉన్నారు. ఢిల్లీ హై కోర్టు కూడా ఇప్పటికే చిదంబరం బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు లో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలైంది, జస్టిస్ రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. చిదంబరం బెయిల్ పిటిషన్ ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు.
యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న ఆయన విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు అనుమతిచ్చారు. ఆ కంపెనీ పెట్టుబడులను సేకరించింది చిదంబరం తనయుడు కార్తీ కంపెనీల నుంచే, ఈ కంపెనీల మధ్య మూడు వందల ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయని కేసు నమోదైంది. గతంలో ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హై కోర్టు తిరస్కరించింది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ హోదాలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం సమావేశాలను ఆయనే నిర్వహించేవారు, ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియా అనే సంస్థకు విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు అనుమతి ఇవ్వడం ఈ కేసుకు మూలాధారం.
ఐఎన్ఎక్స్ మీడియా అనే సంస్థ పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలది. అడ్వాంటేజ్ ఇండియా సింగపూర్ లోని దాని అనుబంధ సంస్థ అడ్వాంటేజ్ సింగపూర్ నుంచి ఐఎన్ఎక్స్ మీడియా పెట్టుబడులు స్వీకరించినట్లు రికార్డుల్లో చూపారు. ఈ రెండు కంపెనీలు చిదంబరం కుమారుడు ప్రస్తుత ఎంపీ కార్తీ చిదంబరానివి. తండ్రి పదవి అండతో విదేశీ పెట్టుబడులకు అనుమతులను సులభంగానే సాధించారు, ఎఫ్ఐపీబీ అనుమతులు తీసుకో కుండా ఐఎన్ఎక్స్ న్యూస్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసి అందులో ఇరవై ఆరు శాతం పెట్టుబడులు పెట్టారు. తండ్రి ఆర్ధిక మంత్రి కావడంతో దీన్ని అడిగేవారు లేకపోయారు. ఈ కేసులో కీలక నిందితులైన పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీ దంపతులు అప్రూవర్ లుగా మారారు. తమ మీదకు కేసు రాకుండా చూసుకునేందుకు కార్తీకి వారు పది లక్షల రూపాయలు లంచం ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chidambaram-judicial-custody-extended-25-89695.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.