కాపులపై కన్నేసిన చంద్రబాబు
Publish Date:May 17, 2012
Advertisement
రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటింగ్ నిట్టనిలువుగా చీలిపోతున్న నేపథ్యంలో 2014 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం వుందని ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పూర్తి విశ్వాసంతో వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశంపార్టీ బలపడటానికి అవకాశం వున్న అన్ని చర్యలతోపాటు, తెలుగుదేశంపార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే తృతీయశ్రేణి నేతలను బయటకు పంపాలనే ఆలోచనతో వ్యవహరిస్తున్నారు. ఆ ఆలోచనలో భాగంగానే కాపులను తెలుగుదేశంపార్టీవైపు ఆకర్షించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశంపార్ట్టీ ఆవిర్భావ సమయంలో కాపు సామాజికవర్గానికి చెందిన అత్యధిక మంది తెలుగుదేశంపార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే తర్వాత కాలంలో విజయవాడలో నెహ్రూ, రంగాల మధ్య తలెత్తిన ఆధిపత్యపోరులో కమ్మసామాజికవర్గం నెహ్రూవైపు, కాపు సామాజికవర్గం రంగా వైపు చేరిపోయింది. కాపు సామాజికవర్గంలో బిసీలుగా పరిగణించే తూర్పు కాపులు తెలుగుదేశంపార్టీ అభిమానులుగానే వుండిపోయారు. చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ స్థాపించిన తర్వాత బిసీ సామాజికవర్గానికి చెందిన తూర్పు కాపులు కూడా తెలుగుదేశంపార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. పార్టీ పరంగా, నాయకుల పరంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పటికీ తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరలేకపోతున్నారు. ఈ స్థితిలో అసహనంతో వున్న తూర్పు కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించాడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో తూర్పు కాపు వర్గానికి చెందిన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-eyes-on-kapu-community-24-14105.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





