తప్పు చేస్తే వదలను.. తన, పర బేధం ఉండదు.. చేతలతో చెప్పిన చంద్రబాబు!

Publish Date:Apr 27, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హుందాతనంతో మెలగాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే  చెబుతున్నారు. ఎవరైనా తప్పు చేస్తే తాను వదిలిపెట్టననీ, వారిపై చర్యలు తీసుకునే విషయంలో తన, పర బేధం చూడననీ స్పష్టం చేస్తున్నారు. ఆ విషయాన్ని మాటలతోనే కాకుండా చేతల ద్వారా చేసి చూపుతున్నారు.  తాజాగా తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఒక ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది.  కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కఠినంగా స్పందించారు.

తిరుపతి హైవేపై ఉన్న ఒక టోల్ ప్లాజా వద్ద  ఎమ్మెల్యే సురేంద్ర బాబు అనుచరులు, టోల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు సహనం కోల్పోయి, అక్కడి సిబ్బందిపై  భౌతిక దాడికి దిగారు. టోల్ చెల్లింపు విషయంలో లేదా వాహనం వెళ్లే క్రమంలో తలెత్తిన చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఎమ్మెల్యే అనుచరుల వీరంగమాడారు. ఇందుకు  సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల అనుచరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

ఈ వివాదంపై తక్షణమే విచారణ జరపాలని,  బాధ్యులైన వారిపై  కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులను   ఆదేశించారు. కేవలం ఆదేశాలతో ఆగకుండా..  కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును పిలిపించి చంద్రబాబు గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది. పార్టీ ఇమేజ్ దెబ్బతినేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదనీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

గతంలో వైసిపి నేతల అహంకారపూరిత ధోరణి వల్ల ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించున్న సంగతి తెలిసిందే. తప్పు చేసిన తమ పార్టీ నేతలను జగన్ వెనకేసుకు వచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అయితే  చంద్రబాబు మాత్రం అందుకు భిన్నం.  పాలనలో పారదర్శకత, అధికారుల పనితీరుపై నిరంతరం సమీక్షలు నిర్వహించడమే కాకుండా  ఇప్పుడు సొంత పార్టీ నేతలైనా సరే తప్పే చేస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు,  వారి అనుచరులు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతాన్ని తన తాజా చర్య ద్వారా చంద్రబాబు విస్పష్ట సంకేతం ఇచ్చారు. 

చంద్రబాబు ఆదేశాలతో కదిలిన పోలీసు యంత్రాంగం  టోల్ ప్లాజా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై   కేసులు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు అయినప్పటికీ.. వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడంతో పోలీసులు వేగంగా కదులుతున్నారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ తీవ్ర జాప్యం కావడంపై పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ వార్తల్లో నిలిచారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబా సిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
భారత విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక మార్పుకు బీజం పడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు రిపబ్లికన్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి చేపట్టిన నిరసన
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు
మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..!
ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.