ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబా సిడర్గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రతిష్ఠను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచడంతో పాటు పర్యాటకం, పెట్టుబ డులను ఆకర్షించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. గతంలో గుజరాత్ పర్యా టక రంగానికి బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి ఆ రాష్ట్ర ప్రచారానికి విశేషంగా తోడ్పడిన నేపథ్యంలో, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ బిల్డింగ్ కోసం చిరంజీవిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్న ట్లు సమాచారం.
ఈ ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు, సంబంధిత ప్రతినిధుల మధ్య ఇప్పటికే ప్రాథమిక స్థాయి సంప్రదింపులు పూర్తైనట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ విలువను పెంచడం వంటి అంశాల్లో చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలు వడలేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ నియామకంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Megastar as AP brand ambassador, Chiranjeevi, CM Chandrababu, Pavan kalyan, Naralokesh, AP Goverment
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/megastar-as-ap-brand-ambassador-36-228128.html
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ తీవ్ర జాప్యం కావడంపై పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
భారత్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ వార్తల్లో నిలిచారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.
భారత విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక మార్పుకు బీజం పడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు రిపబ్లికన్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి చేపట్టిన నిరసన
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు
మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..!
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్తో గడుపుతుంటారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆగస్టు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, మొత్తం 3 రోజుల పాటు పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది