వైసీపీ సోషల్ మీడియా దాటేసింది హద్దులు.. చంద్రబాబు వార్నింగ్ తో మొదలైన వణుకు!

Publish Date:Nov 8, 2024

Advertisement

వైసీపీ సోష‌ల్ మీడియా హ‌ద్దులు దాటింది. ఇత‌ర పార్టీల్లోని మ‌హిళ‌ల‌పై, నేత‌ల కుటుంబాల్లోని ఆడ‌వారిపై అస‌భ్య‌క‌రంగా పోస్టులు పెడుతూ రాక్ష‌స ఆనందం పొందుతున్నారు. ఫ‌లితంగా బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడాలంటే కొంద‌రు మ‌హిళ‌లు భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి. ముఖ్యంగా వైసీపీ   హ‌యాంలో ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ఎత్తి చూపిన వారిపై   ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్యాఖ్య‌లు చేయ‌డం, వారి ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి మాన‌సికంగా ఇబ్బందుల‌కు గురిచేయ‌డం వంటి చ‌ర్య‌ల‌కు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్‌ పాల్ప‌డింది. తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు, మ‌హిళా నేత‌లు వైసీపీ సోష‌ల్ మీడియా వెకిలి పోస్టుల‌తో మాన‌సికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిని కట్ట‌డి చేయాల్సిన పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ మేర‌కు చ‌ర్య‌లు తీసుకోక‌పోగా.. అలాంటి వారికి పార్టీలో పెద్ద‌పీట వేస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణితోపాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి, నారా లోకేశ్ స‌తీమ‌ణి ఇలా అనేక మంది విపక్షాల నేత‌ల కుటుంబ స‌భ్యులు, మ‌హిళా నేత‌ల పై అస‌భ్య‌క‌ర పోస్టింగ్ ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా మూక రెచ్చిపోయింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ సోష‌ల్ మీడియా వెకిలి పోస్టుల‌కు చెక్ ప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, వారి ఆగ‌డాలు ఇంకా ఎక్కువ‌య్యాయి. సోష‌ల్ మీడియా సైకోల‌ను జ‌గ‌న్ ఇంకా ప్రోత్స‌హిస్తూ వ‌చ్చారు.  హోం మంత్రి అనిత,  జ‌గ‌న్ సోదరి, కాంగ్రెస్ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌పై వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ పెట్టిన అస‌భ్య‌క‌ర పోస్టుల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ బ్యాచ్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయంటూ విష‌ ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టింది. అంత‌టితో ఆగ‌కుండా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌ల‌పై అస‌భ్య‌  ప‌ద‌జాలంతో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌ పోస్టింగ్‌లు పెడుతున్నారు. వీరి ఆగ‌డాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి.  వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ క్ర‌మంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. పిఠాపురం ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ ప‌నితీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. హోంమంత్రి అనిత రివ్యూ చేయాల‌ని.. పోలీస్ వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టాల‌ని  సూచించారు. అదేక్ర‌మంలో నేను హోం మంత్రి ప‌ద‌వి తీసుకుంటే ప‌రిస్థితి వేరేలా ఉంటుందంటూ..  ఇప్ప‌టికీ వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్న కొంద‌రు పోలీసు అధికారుల‌కు ప‌వ‌న్‌ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో చంద్ర‌బాబు మాట్లాడారు. అస‌భ్య‌క‌ర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్న‌ వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ ను క‌ట్ట‌డి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ క్ర‌మంలో తాజాగా చంద్ర‌బాబు తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఆ త‌రువాత హోంమంత్రి అనిత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ అయ్యారు. వీరి భేటీ మ‌ధ్య ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో రెచ్చిపోయే వారిపై, రాజ‌కీయ నాయ‌కులు, వారి కుటుంబ స‌భ్యుల ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి పోస్టులుచేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. 

అమ‌రావ‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియాలో హ‌ద్దులుదాటి ప్ర‌వ‌ర్తిస్తే ఇక నుంచి చూస్తూ ఊరుకునేది లేద‌ని, చ‌ట్ట‌ప‌రంగా కఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఆడ‌బిడ్డ‌ల‌పై త‌ప్పుడు పోస్టింగ్ లు పెట్టాలంటే వ‌ణికిపోయేలా ట్రీట్మెంట్ ఇస్తామ‌ని, నెల‌రోజుల్లో పోలీస్ వ్య‌వ‌స్థ‌ను సెట్‌రైట్ చేస్తామ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ వ‌రుస వార్నింగ్ ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌లో వ‌ణుకు మొద‌లైంది. చంద్ర‌బాబు వార్నింగ్ త‌రువాత‌.. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గ‌గ్గోలు పెట్టారు. ఏకంగా డీజీపీ గారూ.. ప్రభుత్వాలు మారుతాయి.. కూటమి శాశ్వతం కాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జ‌గ‌న్ తీరుపై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ కు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అప్ప‌ట్లో సీఎం హోదాలో వారిని క‌ట్ట‌డి చేయాల్సిన జ‌గ‌న్.. అలా చేయ‌లేదు. కూట‌మి ప్ర‌భుత్వంలో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయే వారిని క‌ట్ట‌డి చేయాల‌ని చూస్తుంటే జ‌గ‌న్ కంగారు ప‌డిపోతుండ‌టం గ‌మ‌నార్హం. 

తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఏపీ కాంగ్రెస్  వైఎస్ షర్మిళ కూడా స్పందించారు. సమాజానికి మంచి చేసే సోషల్ మీడియా వ్యవస్థను కొంత మంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారని, సోషల్ సైకోల బాధితుల్లో తాను ఒకరిగా షర్మిళ చెప్పుకున్నారు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై తాను కూడా పోలీస్ కేసు పెట్టినట్లు చెప్పిన షర్మిల అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.  సోష‌ల్ మీడియాలో హ‌ద్దులు మీరే వారిపై కొర‌డా ఝుళిపించి, కూట‌మి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లను ప్ర‌తీ ఒక్క‌రూ అభినందిస్తుంటే.. జ‌గ‌న్ మాత్రం వ్య‌తిరేకిస్తుండ‌టం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియాలో నేత‌లు, వారి కుటుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టేవారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం, పోలీసులు చెబుతుంటే.. వారిని జ‌గ‌న్ బెదరించడం చూస్తుంటే.. అధికారం పోయినా కూడా జ‌గ‌న్ రెడ్డిలో మార్పు రాలేద‌ని అవగతమౌతోంది. ఇప్పటికీ జ‌గ‌న్ తీరులో మార్పు రాకుంటే రాబోయే కాలంలో వైసీపీ క‌నుమ‌రుగు కావ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వైసీపీ వ‌ర్గాల్లో నుంచి సైతం వినిపిస్తోంది.

By
en-us Political News

  
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.