విజన్... విజ్ డమ్ ల మేలుకలయిక చంద్రబాబు!

Publish Date:Nov 19, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో పదేపదే తనలో 1995 నాటి చంద్రబాబును చూస్తారని చెబుతున్నారు. ఆయన దూకుడు, ఆయన వేగం చూస్తుంటే అది నిజమేనని అనిపించక మానదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తనను తాను ముఖ్యమంత్రిగా కంటే రాష్ట్రానికి సీఈవోగా ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఆయన ప్రణాళికలు, కార్యాచరణ అంతా హైటెక్ సీఎం అని అందరూ పిలిచేలా చేశాయి. అప్పట్లోనే ఆయన ఐప్యాడ్ లలో పవర్ పాయింట్ ప్రజంటేషన్లను తీసుకుని జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వెళ్లి వాటిని   హైదరాబాద్ కు రప్పించారు. బిల్ గేట్స్ లాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో గంటల తరబడి చర్చించారు. వారిని ఇంప్రెస్ చేయగలిగారు. అంతేనా తన విజన్ తో వారిని తన అభిమానులుగా మార్చేసుకున్నారు. 

ఇప్పుడు 2024లో కూడా అయన అదే ఒరవడిలో ముందుకు సాగుతున్నారు.  మెటా సంస్థ‌తో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పి, ప్ర‌భుత్వ ప‌త్రాల‌ను వాట్సాప్ ద్వారా పంప‌డం, డ్రోన్ టెక్నాల‌జీతో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించ‌డం లాంటివి ఆరంభించారు. తొలిద‌శ‌లో ఈ నెలాఖ‌రుక‌ల్లా వంద‌ర‌కాల సేవ‌ల‌ను వాట్సాప్ ద్వారా అందించేలా గత నెల 22న మెటాతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక  అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వాట్సాప్ బిజినెస్‌, లామా లాంటి ఏఐ టెక్నాల‌జీల‌తో ప‌రిపాల‌నా సామ‌ర్థ్యాన్ని మ‌రింత పెంచుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ ప‌త్రాల కోసం ప‌డుతున్న ఇబ్బందుల‌ను తాను యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో చూశాన‌ని, ఇప్పుడు వాట‌న్నింటి ప‌రిష్కారం చాలా సుల‌భంగా వాట్సాప్ ద్వారా దొర‌క‌డం అనేది చ‌రిత్రాత్మ‌క‌మ‌ని చంద్ర‌బాబు కుమారుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 

మ‌రోవైపు.. రాష్ట్రాన్ని డ్రోన్ హ‌బ్‌గా మారుస్తామ‌ని కూడా చంద్ర‌బాబు చెబుతున్నారు. క‌ర్నూలు స‌మీపంలో 300 ఎక‌రాల‌ను  ఇందు కోసం కేటాయించారు.  అమ‌రావ‌తిలో అతిపెద్ద డ్రోన్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించి అందరినీ అబ్బురపరిచారు. అమ‌రావ‌తిని, బుద్ధుడిని కూడా డ్రోన్ల‌తో ఆవిష్క‌రించారు. ఆ వెంటనే ఆయన సీప్లేన్ సేవలపై దృష్టి పెట్టారు. దేశంలోనే తొలి సారిగా ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీకాకుళం వరకూ  ట్రయల్ రన్ నిర్వహించారు. స్వయంగా  సీ ప్లేన్‌లో విహ‌రించారు. విజ‌య‌వాడ నుంచి శ్రీశైలం వెళ్లి, అక్క‌డ రోప్ వే ద్వారా ప్ర‌యాణించి ఆల‌య ద‌ర్శ‌నం చేసుకుని, తిరిగి సీ ప్లేన్‌లోనే విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు.

ఇలా  ఆధునికతను అందిపుచ్చుకుంటూ.. టెక్నాలజీని ప్రజాప్రయోజనాల కోసం సమర్ధంగా వినియోగించుకుంటూ.. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షిస్తూ చంద్రబాబు 1995 నాటి సీబీఎన్ ను గుర్తు చేస్తున్నారు. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా చెరగని సంతకంలా కనిపిస్తున్నారు.   ,గ‌తంలో హైదరాబాద్‌కు ఎలాంటి ఇమేజి తెచ్చిపెట్టారో అంతకు మించి అమరావతిని అభివృద్ధి చేసి ఏపీ రాజధానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి శ్రమిస్తున్నారు.  చంద్రబాబుకున్న  దూరదృష్టి, టెక్నిక‌ల్ విజన్ సమకాలీన రాజకీయాల్లో ఎవ్వరికీ లేదనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు.  

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.