హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా అధికారులతో ఘర్షణ చోటుచేసుకోవడంతో ఎంఐఎం ఎమ్మెల్సీతో పాటు కార్పొరేటర్పై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పాతబస్తీలోని హుస్సేనాలెం సమీపంలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న ఎంఐఎం నాయకులు కూల్చివేతలను అడ్డుకుంటూ నానా హంగామా చేశారు... దీంతో విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కూల్చివేతల సమయంలో అక్కడికి వచ్చిన మజ్లీస్ నాయకులు అధికారుల విధుల్లో ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు ఎమ్మెల్సీతో పాటు స్థానిక కార్పొరేటర్పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబం ధించి ఘాన్సీ బజార్కు చెందిన ఎఐఎంఐఎం ఇన్చార్జ్ సాహిల్ అక్బర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. కేసు విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/case-registered-against-mim-mlc-36-216782.html
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.